మెట్పల్లి నూతన కాంగ్రెస్ కౌన్సిలర్ కు సన్మానం
ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి
మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన 20వ వార్డు కౌన్సిలర్ మాసుల ప్రవీణ్, ను జగిత్యాల జిల్లా ఐజేయు యూనియన్ ఉపాధ్యక్షుడు వార్త విలేఖరి లోక రమణారెడ్డి లను ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో గ్రామ వి డి సి చైర్మన్ జానశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సాల్వాతో సత్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రవీణ్ ను రమణారెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో డబ్బా ఉపసర్పంచ్ రాపల్లి మహేష్ జాన శంకర్ లు కలిసి ఘనంగా సన్మానించారు. రానున్న రోజుల్లో పాలన పారదర్శకంగా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండేలా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వార్డు సభ్యుడు బైండ్ల విశాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీధర్, తేలు రమేష్ దుద్దుల లింగన్న, ఓల్లాడపు దేవన్న, రాడే శ్రీనివాస్, గుమ్మడి లక్ష్మీ నర్సయ్య లు ఉన్నారు
