చలికాలంలో చర్మం పగుళ్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ.;.

చలికాలంలో చర్మం పగుళ్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

 

చలికాలం వచ్చిందంటే చాలామందికి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. శీతాకాలం గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిమారి పగుళ్లు ఏర్పడతాయి. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా చలికాలం(winter) ఎంతో అహ్లాదంగా ఉంటుంది.. మనసుకు ఎంతో హాయినిస్తుంది. కాకపోతే ఈ సీజన్‌లో చర్మసమస్యలు (Skin problems) తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. గాలిలో తేమ(Moisture) తగ్గడం వల్ల చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి. చలికాలం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

3. శీతాకాలం(Winter)లో చర్మాని(Skin)కి తేమ అందించడం ఎంతో ముఖ్యంగా. స్నానం చేసిన మూడు నిమిషాలలోపే మాయిశ్చరైజర్ (Moisturization) లేదా బాడీ లోషన్ (Body lotion)చర్మానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో తేమ కొంతసేపటి వరకు అలాగే ఉంటుంది. మాయిశ్చరైజర్‌కి నీటి శాతం ఎక్కువగా ఉండే లోషన్ల కన్నా, నూనె శాతం ఎక్కువగా ఉండే క్రీములు లేదా పెల్రోలియం జెల్లీ (Petroleum jelly) వంటి అయింట్‌మెంట్స్ మంచిది.

. స్నానం(Bath) చేసే సమయంలో మరీ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటితో చేయడం మంచిది. వేడి నీళ్లు(Hot water) చర్మంపై ఉండే నూనెలను తొలగించి మరింత పొడిబారేలా చేస్తుంది.. దాంతో దురదలు ఏర్పడే ప్రమాదం ఉంది. స్నానానికి చాలా వరకు కెమికల్స్ తక్కువగా ఉండే మైల్డ్ సోప్స్ (Mild soaps)లేదా బాడీలోష్ వాడటం మంచింది

5. వింటర్ సీజన్‌లో చాలా మంది తక్కువగా మంచినీళ్లు తాగుతుంటారు. అలా చేయడం మంచిది కాదు.. సాధ్యమైనంత వరకు నీటిని తీసుకోవాలి. అలా చేయడం వల్ల చర్మాన్ని లోపల నుంచి హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

6. చలికాలంలో ఆహార పదార్ధా(Food items)ల విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒమేగా-3 (Omega-3)ఫ్యాటి యాసిడ్స్ అంటే బాదం, వాల్ నట్స్, చేపలు వంటి ఆహార పదార్థాలు చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

 ఈ దీపావళికి మీ చర్మ సౌందర్యం రెట్టింపు అవ్వాలంటే ఇలా చేసి చూడండి…

 ఈ దీపావళికి మీ చర్మ సౌందర్యం రెట్టింపు అవ్వాలంటే ఇలా చేసి చూడండి

ఈ దీపావళి పండుగకు కొత్త అందంతో మెరిసిపోవాలనుకుంటున్నారా? చర్మం కాంతులీనేలా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ న్యూట్రిషనిస్టు చెబుతున్న సూచనలను ఓసారి ఫాలో అయ్యి చూడండి.

ఇంటర్నెట్ డెస్క్: మరి కొద్ది రోజుల్లో దీపావళి. ఈ పండగకు అద్భుతమైన చర్మ సౌందర్యంతో మెరిసిపోవాలని కోరుకునే వారు కొన్ని చిట్కాలు పాటించాలని సాక్షి లాల్వానీ అనే న్యూట్రిషనిస్టు తెలిపారు. ఆమె షేర్ చేసిన అప్‌డేట్స్‌ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఆమె సూచనల ప్రకారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం పదండి (Skin Care Tips for Diwali).

పండుగ నాటి వరకూ ప్రతి రోజు ఉదయం టీస్పూను ఉసిరి జ్యూస్, అర టీస్పూను అలోవిరా జ్యూస్, చిటికెడు పసుపు, కప్పు నీళ్లలో కలిపి తాగితే చర్మం కాంతివంతం అవుతుంది. ఉసిరి వల్ల చర్మం ముడతలు తగ్గుతుంది. ఆలోవిరా వల్ల స్కిన్ ఇరిటేషన్ మటుమాయం అవుతుంది. పుసుపులోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.

రోజువిడిచి రోజు జామ, వాల్‌నట్స్, ఒక టీస్పూన్ గుమ్మడి గింజలను తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

ఇక పండుగ వరకూ ప్రతి రోజు సాయంత్రం.. సొంపు, కొత్తిమీర, జీలకర్ర వేసి మరిగించిన నీటిని తాగితే లివర్‌లోని విషతుల్యాలు తొలగిపోతాయి. చర్మంపై నల్లమచ్చలు మటుమాయం అవుతాయి. మొటిమల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

రాత్రంతా నానబెట్టిన గోండ్ కతిరాకు రోజు వాటర్, సబ్జా గింజలు, నిమ్మరసాన్ని జోడించి వారానికి మూడు నాలుగు సార్లు తాగితే శరీరానికి తగినంత తేమ అందుతుంది. నిస్సారంగా కనిపిస్తున్న చర్మానికి కొత్త జీవాన్ని అందిస్తుంది. చర్మం ఉబ్బినట్టు ఉండటాన్ని తొలగిస్తుంది.

పెసరపప్పు, మెంతికూరతో చేసిన కిచిడీకి ఒక టీస్పూను నెయ్యి జోడించి తింటే శరీరానికి జింక్, యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా అంది చర్మంలో డల్‌నెస్ తొలగిపోతుంది. రాబోయే పది రోజులు ఈ జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటిస్తే చర్మం కాంతులీనుతూ ఉంటుందని సదరు న్యూట్రిషనిస్టు తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ రెసీపీలను ఎంజాయ్ చేయండి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version