గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టండి
పంచాయతీ భవనాలపై పట్టింపేది!
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయం పేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ భవనం పై పట్టిం పు ఏది! కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యం కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుంది అధికా రంలో వచ్చి రెండేళ్లయిన నిర్మాణాలపై అలసత్వం ప్రదర్శిస్తుంది ప్రతి చిన్న గ్రామపంచాయతీ సొంత భవనం ఉండాలని లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధి హామీ నుంచి నిధులు కేటాయించి అనేక భవనాలు నిర్మించింది ఇంకా కొన్ని చోట్ల నిర్మించాలి ఉండగా ప్రభుత్వం మారిన తర్వాత నిధుల పట్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది.
ఏండ్లు గడుస్తున్న భవనని ర్మాణం కలగానే!
శాయంపేట మండలంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి మోక్షం ఎప్పుడో అనేది మండల ప్రజలు ఆలోచనలో పడ్డారు గత ప్రభుత్వం నూతన భవనానికి శంకుస్థాపన చేసిన పనులు మొదలు పెట్టకపోవడం వల్ల ప్రజాప్రతినిధులు అధికారుల మీద ప్రజలు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. మెరుగైన పాలన అందించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభు త్వం ముందుకు వచ్చి భవ నాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలి గత ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని నూతన భవన నిర్మాణానికి అవకాశం కల్పించి త్వరగా నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
నూతన గ్రామపంచా యతీ భవనం నిర్మించండి
శాయంపేట మండల నివాసి కందగట్ల సంతోష్
శాయంపేట మండల కేంద్రంలో నివసిస్తున్న కందగట్ల సంతోష్ మాట్లా డుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గదులు లేక ఆరు బయట సమావేశాలు వస్తువులు భద్రపరచడం, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ,వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం సాధ్యం కావట్లేదు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి నూతన భవనాన్ని ప్రత్యేక హంగులతో ప్రభుత్వం భవన నిర్మాణం చేపట్టాలి నూతన భవన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందుతుందని అన్నారు కాబట్టి భవన నిర్మాణ పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు
