దేశాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ.ప్రవేశాలు…..

దేశాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ.ప్రవేశాలు…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు గృహాలకు ఈరోజు గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన అనేక.సంక్షేమ పథకాల్లో భాగంగా ఇందిరమ్మగృహ పథకం ఒకటని అందులో భాగంగా ఈరోజు దేశాయిపల్లి గ్రామంలో .లబ్ధిదారులైన ముగ్గురికి గృహ.ప్రవేశాలు నిర్వహించడం జరిగిందని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పేదల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ నిరుపేద సొంతింటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం తీసుకొచ్చి రాష్ట్రంలో ఇండ్లు లేని వారు ఉండాలని ఉద్దేశంతో రాష్ట్ర నిరుపేద ప్రజలకు. ఎంతో అండగా ఉంటుందని తెలియజేస్తూ. ప్రభుత్వం ఇందిరమ్మ.పథకంలో ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులు ప్రభుత్వం గృహ నిర్మాణానికి ఇస్తున్న ప్రభుత్వ ఆర్థిక సాయం తీసుకుని సకాలంలో ఇల్లు నిర్మించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పంపిన చిరు.కానుకను పట్టు వస్త్రాలను లబ్ధిదారులకు నాయకులు ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. సర్పంచులు సుధాకర్. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొన్నాల పరుశురాం.ఆరేపల్లి బాలు. మండల ఉపాధ్యక్షులు గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగలరాజు. రాజిరెడ్డి. శ్రీరామ్. శ్రీనివాస్. లింగారెడ్డి. తిరుపతి. రమేష్. శ్రీనివాస్. కొత్త రవి. మల్లేశం. సిరిసిల్ల దేవయ్య. ఇందిరా కమిటీ సభ్యులు లబ్ధిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

అదనపు కలెక్టర్ విజయలక్ష్మి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి రూరల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి రాంపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా లబ్ధిదారులతో అదనపు కలెక్టర్ మాట్లాడి ఇళ్ళ నిర్మాణ పనులు పురోగతిని, గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపు వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి అర్హుడికి సొంత గృహం అందించే కార్యక్రమం విజయవంతం కావాలంటే అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజయలక్ష్మి సూచించారు, అంతేకాక ప్రాథమిక పాఠశాల అంగన్వాడి సెంటర్లను కూడా తనిఖీ చేసి లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సిందిగా సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తరుణి ప్రసాద్ ఎంపీఓ నాగరాజు పంచాయతీ కార్యదర్శి దేవేందర్ ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version