కేతకి ఆలయ ఈవో పై ఎండోమెంట్ కమిషనర్ కు ఫిర్యాదు.

కేతకి ఆలయ ఈవో పై ఎండోమెంట్ కమిషనర్ కు ఫిర్యాదు.

◆-: కేతకి ఆలయానికి రెగ్యులర్ ఈవోను నియమించాలి.

◆-: కేతకిలో ఉన్నత అధికారుల అనుమతి లేకుండానే ఉద్యోగాల నియామకము.

◆-: కేతకిలో అక్రమాలు జరుగుతున్న పట్టించుకోని ఉన్నతాధికారులు.

◆-: మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు బొగ్గుల జగదీశ్వర్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్పపై సర్పంచుల ఫోరం ఝరాసంగం మండల మాజీ అధ్యక్షుడు బొగ్గుల జగదీశ్వర్ హైదరాబాదులోని దేవాదాయ,ధర్మాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కేతకి ఆలయానికి ఇన్చార్జి ఈవో గా కొనసాగుతున్న ఆయన ఉన్నతాధికారుల ఉత్తర్వు లు సైతం లెక్కచేయకుండా పనిచేయడంతో ఆలయ ఆదాయానికి గండి పడుతుందన్నారు.

ఉన్నత అధికారులు నుండి ఎలాంటి ఆదేశాలు లేకున్నా తాత్కాలిక నియామకాలు చేపట్టి కొందరికి ఉద్యోగ అవకాశం కల్పించారని ఆయన వివరించారు. కేతకి ఆలయ ఈవో భక్తుల నుండి అధిక మొత్తంలో డొనేషన్లు వసూలు చేసిన వారికి ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. కేతకి ఆలయ గోశాల పేరిట అధిక మొత్తంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆలయంలో ప్రవేటు ఉద్యోగులు, ప్రైవేట్ పూజారులు, ప్రజా ప్రతినిధుల లపై , భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

గత రెండు రోజుల క్రితం ఆలయ ఈవో ముందే కేతకి ఆలయ చైర్మన్ పట్ల ప్రవేట్ పూజారి దురుసుగా మాట్లాడిన ఆలయ ఈవో ఏమి అనకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆలయానికి ఈవో గా ఉన్న ఆయనను దాదాపు 20 ఆలయాలకు ఇన్చార్జి ఈవోగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత కేతకి ఆలయ ఈవో మూలంగా కేతకి ఆలయ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. స్థానికేతురుడైన శాశ్వత ఈఓ ను నియమించి కేతకి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బొగ్గుల జగదీశ్వర్ పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version