మనీషా ఇండియన్ ఆధ్వర్యంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ ప్రారంభం…

మనీషా ఇండియన్ ఆధ్వర్యంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని ఆయా గ్రామాల లోని గ్యాస్కనెక్షన్ లేని వినియెగదారులు ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ప్రభుత్వం అందిస్తుంది అని అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం సభ్యులు చెల్మెడ అనిల్ కుమార్ అని అన్నారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు రేషన్ కార్డు పై గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు అర్హులని మనీషా ఇండియన్ గ్యాస్ యాజమాన్యం తెలపడం జరిగిందన్నారు .ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అప్లికేషన్ చేసుకోవలసిన అర్హత వివరాలు రేషన్ కార్డు లో ఉన్న మహిళ అభ్యర్థుల పేరు పై అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నారు. కావలసిన పత్రాలు (డాక్యుమెంట్)వివరాలు ముందుగా రేషన్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు లో ఉన్న సభ్యుల అందరివి ఆధార్ కార్డ్ జీరాక్స్, బ్యాంకు అకౌంట్ జీరాక్స్, అప్లికేషన్ కలిగిన వారి ఒక ఫోటో ఇవ్వగలరని తెలియజేయడం జరిగింది.ఇంతకు ముందు రేషన్ కార్డు లో ఉన్న సభ్యుల ఏ ఒక్కరికి పై కూడా ఎక్కడ కూడా గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు అని అప్లికేషన్ ఫారం తో అన్ని పత్రాలు జత చేసి కోహీర్ మనీషా ఇండియన్ గ్యాస్ ఆఫీస్ లో ఇవ్వగలరు అని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version