రిపోర్టర్ పై దాడులు చేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలి

రిపోర్టర్ పై దాడులు చేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రశ్నిస్తే దాడుల
జర్నలిస్ట్ పై దాడిని ఖండిస్తున్నాం

గండ్ర యువసేన అధ్యక్షుడు, గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం ములుగు జిల్లా తాడ్వాయి మండలం లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని గండ్ర యువసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు.మండల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, తదితర విషయాలలో జరిగిన అవినీతి గురించి పత్రికల్లో వార్తలు రాశాడని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే దాడులు చేయడం మానుకోవాలని , దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష్య సాధింపు చర్యలు మానుకొని, ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని , ప్రశ్నిస్తే దాడులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version