బస్వరాజుపల్లిలో విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం

బస్వరాజుపల్లి లో విద్యుత్ ప్రజా బాట

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బస్వ రాజు పల్లి గ్రామంలో శనివారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతకుంట్ల సునీత శ్రీనివాసు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఏఈ వెంకటరమణ మాట్లాడుతూ విద్యుత్ ప్రజాబాట సందర్భంగా గ్రామాలలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు అంతేగాక విద్యుత్ సమస్యలు ఏదైనా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తాము అన్నారు

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజాబాట కార్యక్రమం

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజాబాట

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి రూరల్ మండలంలోని గుడాడ్ పల్లి గ్రామంలో ప్రజాబాట కార్యక్రమంలో ఎస్.ఎస్ నెంబర్ 17/15 కేవిఏ డిటీఆర్ క్రింద లైన్ కు తగిలే చెట్టుకొమ్మలు కొట్టివేయడం జరిగింది మరియు లూస్ లైన్ ఉంటే సరిచేయటం జరిగింది. ఎల్ టి లైన్ లో మిడిల్ పోల్స్ కొరకు ఎస్టిమేషన్ పంపించి మిడిల్ పోల్స్ వేస్తాము ఎన్ని చెప్పారు, విద్యుత్ షాక్ కు గురికాకుండా ఉండడానికి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫర్మర్స్ ఫ్యూస్ బూర్న్ అయినపుడు ప్యూజ్లను వెంటనే వేయవద్దని వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియపర్చాలి.తెగివున్న లైన్ను తాకకూడదు వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని అన్నారు. రైతులు జాయింట్ ఉన్న సర్వీస్ వైర్స్ ను వెంటనే మార్చాలని అన్నారు. విద్యుత్ వినియోగదారుల్లు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని అన్నారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1912 కి సంప్రదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గుడాడ్ పల్లి గ్రామ సర్పంచ్ దారూరి శారదా సంతోష్ విద్యుత్ శాఖ భూపాలపల్లి రూరల్ సబ్ ఇంజనీర్ గుగులోత్ నాగేష్ ,సిబ్బంది శ్రీకాంత్ లైన్ ఇన్స్పెక్టర్ మల్లేశం లైన్మెన్ ఎండి బాబా సాదిక్ హైదర్ లైన్మెన్ గణేష్ జేఎల్ఎం రాజు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version