పెట్రోల్ బంకుల్లో నోస్ట్రాక్ బోర్డులు…

పెట్రోల్ బంకుల్లో నోస్ట్రాక్ బోర్డులు

మోడీ ప్రభుత్వం వైఫల్యం

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు

భూపాలపల్లి నేటిధాత్రి

పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ నివారించండి మోడీ ప్రభుత్వ కుట్రలను ఎండగట్టండిని
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు
విమర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతతో నో స్టాక్ బోర్డులు కన్పడుతున్నాయి. దీంతో ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం లాభాపేక్షతోనే ఈ ఆయిల్ కంపెనీలు ఈ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు కలిసి సామాన్యుడిని దోచుకునేందుకు పన్నిన కుట్రలో భాగమే ఇది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచి, చమురు సంస్థల ద్వారా అన్ని బంకులకు ఆయిల్ సరఫరాను పునరుద్దరించాలని సీపీఐ ఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు

డీజిల్ కొరతతో వ్యవసాయం దెబ్బతింటోంది వరికెల

డీజిల్ కొరతతో వ్యవసాయం దెబ్బతింటోంది వరికెల

నడికూడ,నేటిధాత్రి:

జిల్లాలో ప్రస్తుతం డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో వ్యవసాయ పనులు పూర్తిగా స్థంభించిపోయే పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా సాగు కాలంలో ట్రాక్టర్లు,ఇతర వ్యవసాయ యంత్రాలకు అవసరమైన డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీనితో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని కోరారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి రైతులకు అవసరమైనంత డీజిల్‌ను సరఫరా చేయాలని పౌర సరఫరా శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
రైతులు ఇప్పటికే కష్టాల్లో ఉన్నారని,ఈ డీజిల్ కొరత పరిస్థితి మరింత సమస్యలను తెచ్చిపెడుతోందని ఆయన అన్నారు.ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని,ప్రతి మండలంలో డీజిల్ అందుబాటును పెంచి, రైతులకు ఎటువంటి అంతరాయం లేకుండా వ్యవసాయ పనులు సాగేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం గంభీరంగా పరిగణించి,తక్షణ పరిష్కారం చూపాలని తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున ప్రభుత్వాన్ని కోరారు.

పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ నివారించండి…

పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ నివారించండి

మోడీ ప్రభుత్వ కుట్రలను ఎండగట్టండి

సిపిఎం మండల కార్యదర్శి తోలేం గోపి

గుండాల,నేటిధాత్రి :

తెలంగాణలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరత నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని దీంతో ప్రజలు,రైతులు, వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం లాభపేక్షతోనే ఈ ఆయిల్ కంపెనీలు ఈ కృత్రిమ కొరతను సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు కలిసి సామాన్యుని దోచుకునేందుకు పండిన కుట్రలలో భాగమే ఇది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి చమురు సంస్థల అన్ని బంకులకు ఆయిల్ అందించాలని సిపిఎం గుండాల మండల కార్యదర్శి తోలం గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఒకవైపు దేశంలో ఇందన నిలువలు పుష్కలంగా ఉన్నాయని చెబుతూనే మరోవైపు కృత్రిమ కొరతను సృష్టించడం కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిదర్శనమని యుద్ధ నేపథ్యంలో ఆయిల్ సంక్షేమాన్ని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపద్యంలో ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచకుండా నిలిపివేసింది అని ఎన్నికలు ముగిసిన వెంటనే సామాన్యుడిపై భారం మోపేందుకు రంగం సిద్ధం చేస్తుందని ఆయన అన్నారు.ఇంధనం దొరకక లారీలు వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉన్నదని దీంతో నిత్యవసరాల ధరలు పెరిగి పేద మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుందని తక్షణమే ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్యం ని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version