పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ నివారించండి
మోడీ ప్రభుత్వ కుట్రలను ఎండగట్టండి
సిపిఎం మండల కార్యదర్శి తోలేం గోపి
గుండాల,నేటిధాత్రి :
తెలంగాణలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరత నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని దీంతో ప్రజలు,రైతులు, వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం లాభపేక్షతోనే ఈ ఆయిల్ కంపెనీలు ఈ కృత్రిమ కొరతను సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు కలిసి సామాన్యుని దోచుకునేందుకు పండిన కుట్రలలో భాగమే ఇది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి చమురు సంస్థల అన్ని బంకులకు ఆయిల్ అందించాలని సిపిఎం గుండాల మండల కార్యదర్శి తోలం గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఒకవైపు దేశంలో ఇందన నిలువలు పుష్కలంగా ఉన్నాయని చెబుతూనే మరోవైపు కృత్రిమ కొరతను సృష్టించడం కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిదర్శనమని యుద్ధ నేపథ్యంలో ఆయిల్ సంక్షేమాన్ని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపద్యంలో ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచకుండా నిలిపివేసింది అని ఎన్నికలు ముగిసిన వెంటనే సామాన్యుడిపై భారం మోపేందుకు రంగం సిద్ధం చేస్తుందని ఆయన అన్నారు.ఇంధనం దొరకక లారీలు వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉన్నదని దీంతో నిత్యవసరాల ధరలు పెరిగి పేద మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుందని తక్షణమే ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్యం ని కోరారు.
