వరుణుడి ఆటంకం.. తొలి రోజు ముగిసిన ఆట…

వరుణుడి ఆటంకం.. తొలి రోజు ముగిసిన ఆట

 

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. జోరు మీదున్న ఇంగ్లండ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. చాలా సేపు వేచి చూసినా వరుణుడు కనికరించకపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.

ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆసీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. జాక్ క్రాలీ(16), బెన్ డకెట్(27), జాకబ్ బెతెల్(10) స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో 57/3తో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఈ దశలో జో రూట్(72*), హ్యారీ బ్రూక్(78*) అర్థ శతకాలతో జట్టును ఆదుకున్నారు.
ఈ క్రమంలో జోరు మీదున్న ఇంగ్లండ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. 45 ఓవర్ల తర్వాత వర్షం పడటంతో మ్యాచ్ సాగలేదు. చాలా సేపు వేచి చూసినా వరుణుడు కనికరించకపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. బ్రూక్, రూట్ నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు.ఇదిలా ఉండగా.. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో మూడు గెలిచి ఆస్ట్రేలియా ఇప్పటికే సిరీస్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలిచి క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది. ఈ ఐదో టెస్టులో కూడా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.

తొలి టెస్టు గెలుపు.. ఆస్ట్రేలియా క్రికెట్‌కు భారీ నష్టం..

తొలి టెస్టు గెలుపు.. ఆస్ట్రేలియా క్రికెట్‌కు భారీ నష్టం

 

యాషెస్ 2025 సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వచ్చిందట. రెండు రోజుల్లోనే ఆట ముగియడంతో ఈ నష్టం వాటిల్లింది.

 యాషెస్ 2025 సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ట్రావిస్ హెడ్(Travis Head) విధ్వంసకరమైన బ్యాటింగ్ తో మ్యాచ్ రెండో రోజే ముగిసింది. దీంతో ఐదు మ్యాచుల యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించడం సంతోషమే అయితే.. మరోవైపు ఆసీస్ బోర్డుకు మాత్రం భారీ నష్టాన్ని తీసుకొచ్చింది.

పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(financial loss Cricket Board)కు ఆదాయ పరంగా భారీ నష్టాన్ని చూసింది. గార్డియన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. రెండు రోజుల్లో ఆడ ముగియడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 3 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు నష్టాన్ని చవిచూస్తోంది. పెర్త్ టెస్టులో మొదటి రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో 101,514 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. తొలి రోజు(శుక్రవారం) 51,531 మంది, రెండో రోజు(శనివారం) 49,983 మంది హాజరయ్యారు. 3, 4వ రోజుల్లో కూడా ఇదే విధంగా ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా అంచనా వేసింది. కానీ బౌలింగ్ లో మిచెల్ స్టార్క్, బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ ఆట ముందుగానే ముగిసేలా చూశారు. దీంతో ఆదివారం, సోమవారం మ్యాచ్ చూసేందుకు టికెట్ బుక్ చేసుకున్న వారికి నిరాశే ఎదురైంది.శనివారం మ్యాచ్ ముగిసిన అనంతరం సెవెన్ నెట్‌వర్క్‌తో ట్రావిస్ హెడ్(Travis Head) మాట్లాడుతూ.. ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపాడు. ఆదివారం టికెట్ బుక్ చేసుకున్న ప్రేక్షకులు తనను క్షమించాలని కోరాడు. మరోవైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రీఫండ్ పాలసీ ప్రకారం.. మిగిలిన మూడు రోజులకు టిక్కెట్లను ఇప్పటికే బుక్ చేసుకున్న వారి వారి డబ్బులుకి తిరిగి చెల్లించనుంది. ఈ విధంగా రెండు రోజుల్లోనే ఆట ముగియడంతో, మూడు రోజుల ఆటకు సంబంధించిన భారీ రెవెన్యూను ఆస్ట్రేలియా బోర్డు(Cricket Australia) కోల్పోయింది. ఈ విధంగా మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఆర్ధికంగా మాత్రం భారీ నష్టం చేకూరిందని నిపుణులు చెబుతున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version