కాలేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

కాలేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజి,–అన్నారం సరస్వతి బ్యారేజీలను శుక్రవారం ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మేడిగడ్డ లో కొనసాగుతున్న బోర్ హోల్స్ పనుల పురోగతిని అధికారులను అడిగితెలుసుకున్నారు.
మేడిగడ్డ,అన్నారం ప్రాజెక్ట్ ల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సిబ్బంది కోసం గతంలో సీఆర్పీఎఫ్ పోలీసులు ఉపయోగించిన షెడ్లను పరిశీలించి సిబ్బంది ఉండేందుకు విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అనంతరం అన్నారంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద అదనపు సిబ్బంది వసతి కొరకు గదులను పరిశీలించారు.
అన్నారం ప్రాజెక్ట్ అప్ స్ట్రీమ్ ను పరిశీలించి బోర్ హోల్స్ పనులను ప్రారంభించాలని ఆదేశించారు.
ప్రాజెక్టులో సాంకేతిక పరిశీలన పనులను శుక్రవారం నుంచి ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక పరీక్షలను దశల వారీగా చేపట్టాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పరిశీలన పనుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు.
డ్రిల్లింగ్ పనులు చేపట్టేటప్పుడు గట్టి శిలా పొర వచ్చేంతవరకు కొనసాగించాలని సూచించారు. ప్రాజెక్టులో వివిధ దశల్లో సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తూ పనుల నాణ్యతను నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, ప్రతిరోజు ఇరిగేషన్ అధికారులు పనులను సమగ్రంగా పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈఎన్సి రమేష్ కుమార్, సీఈ శ్రీనివాస్ గుప్తా, ఈఈలు తిరుపతిరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో గల సాయికుంట ప్రాంతంలో చేపట్టిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.కాలేజ్ రోడ్డులో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి,క్రిటికల్ కేర్ విభాగాల నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రజలకు మరింత వేగవంతమైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం 129.25 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.అధికారులు గుత్తేదారుల సమన్వయంతో పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం మంచిర్యాల పట్టణంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని సందర్శించి రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు తో కలిసి దరఖాస్తుల పరిష్కారం వివరాలను పరిశీలించారు.భారత జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి 63, 163 జి రహదారుల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని ప్రాంతాలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కార చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version