ముగిసిన గడ్డం ఎల్లమ్మ స్మారక బ్యాడ్మింటన్ పోటీలు ..

ముగిసిన గడ్డం ఎల్లమ్మ స్మారక బ్యాడ్మింటన్ పోటీలు ..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

గడ్డం ఎల్లమ్మ మెమోరియల్ సీజన్ 2 బాల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ పోటీలను క్యాతన్ పల్లి మున్సిపాలిటీ 14 వ వార్డు మాజీ కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మి రాజు ఆద్వర్యంలో నిర్వహించారు. సుమారు రెండు రోజుల పాటు పోచమ్మ బస్తీలో నిర్వహించిన పోటీలలో సుమారు 32 జట్లు పాల్గొన్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ పోటీలలో బెల్లంపల్లి చెందిన విన్సెంట్, వెంకట్ జట్టు మొదటి బహుమతి, మందమర్రి చెందిన రవి, సన్నీ జట్టు రెండో బహుమతి గెలుపొందారు. గెలుపొందిన జట్లకు మాజీ కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మి రాజు చేతుల మీదుగా నగదు,మెమెంటోలను అందించారు. కాగా మొదటి బహుమతి 5000,రెండో బహుమతి 2500 గెలుపొందిన జట్లకు ఫ్రైజ్ మనిగా అందించారు. ఈ కార్యాలయంలో పోచమ్మ బస్తీ యూత్ నాగరాజు,వికాస్,ప్రభాకర్,శ్రీనివాస్,శంకరయ్య,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ ముగింపు

ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కేంద్రంలో ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ గత కొద్దిరోజులుగా నిర్వహించడం జరిగింది ఫైనల్ మ్యాచ్లో జరా సంఘం వర్సెస్ దిగ్వాల్ క్రికెట్ జట్లు పాల్గొనడం జరిగింది. మన రన్నర్ గా జరా సంఘం విజేతగా నిలవడం తో సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాటిల్ ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ మరియు యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి అధ్యక్షులు నరేష్ గౌడ్ మాజీ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ బొప్పాన్ పల్లి సర్పంచ్ అమృత్ కొల్లూరు సర్పంచ్ శివరాజ్ మాజీ సర్పంచులు కాంగ్రెస్ నాయకులు యువ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

: తానా ఆధ్వర్యంలో విజయవంతంగా పికిల్ బాల్ టోర్నమెంట్..

: తానా ఆధ్వర్యంలో విజయవంతంగా పికిల్ బాల్ టోర్నమెంట్..

 

పికిల్‌ బాల్ టోర్నమెంట్‌ను తానా విజయవంతంగా నిర్వహించింది. క్రీడలు దైనందిన జీవితములో ముఖ్య భాగమని, అందుకే ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న పికిల్‌ బాల్ టోర్నమెంట్‌ని దిగ్విజయముగా నిర్వహించామని తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ తెలిపారు.

న్యూ ఇంగ్లాండ్‌లో భాగమైన బోస్టన్‌లో పికిల్‌ బాల్ టోర్నమెంట్‌ను తానా విజయవంతంగా నిర్వహించింది. క్రీడలు దైనందిన జీవితములో ముఖ్య భాగమని, అందుకే ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న పికిల్‌ బాల్ టోర్నమెంట్‌ని దిగ్విజయముగా నిర్వహించామని తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ తెలిపారు. ఓడిన ప్రతి సారి, ఓటమి నుంచి నేర్చుకుంటూ, సరిదిద్దుకుంటూ జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి క్రీడాకారులకు వివరించారు.
మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ విభాగాలలో 28 జట్లు పాల్గొన్నాయి. ఈ ఈవెంట్ ఐదు గంటలకు పైగా కొనసాగింది. 120 మందికి పైగా ఆటగాళ్లు అసాధారణ నైపుణ్యం, జట్టుకృషి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. విజేతలు, రన్నర్లకు ట్రోఫీస్, షీల్డ్స్ సోర్స్ గ్రూప్ అఫ్ కంపెనీస్ అధినేత శ్రీ బోళ్ల బహుకరించారు. వాలంటీర్స్ రవి ఉప్పలపాటి, అనిల్ గోవాడ, గోపి నెక్కలపూడి, తిర్బు పారుపల్లి, వేణు కూనంనేని, సురేష్ దోనేపూడి టోర్నమెంట్ సజావుగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version