“గురుకుల పాఠశాల తనిఖీ”
బాలానగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో కలెక్టర్ విజయేందిర బోయి జనరల్ బాలికల పాఠశాల & కళాశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల వంటగదిరిని పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనమును అందించాలన్నారు. బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజన రుచిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ నాయక్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సౌమ్య, కృష్ణవేణి, శోభారాణి, సాయి లక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.