హిందూ స్మశాన వాటికకు భూమి పూజ..

హిందూ స్మశాన వాటికకు భూమి పూజ..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7,8,9,10 వ వార్డ్ ప్రజల సౌకర్యార్థం అమ్మ గార్డెన్ ఏరియాలోనీ ఆర్ ఆర్ నగర్ ప్రాంతంలో హిందూ స్మశాన వాటికకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. సుమారు 50 లక్షల పట్టణ ప్రగతి, 15వ ఫైనాన్స్ నిధులతో స్మశాన వాటిక కు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడారు.అమ్మ గార్డెన్ ఏరియాలో ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నానని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి రఘునాథరెడ్డి, ఎమ్మార్వో సతీష్ కుమార్,పుర కమిషనర్ గద్దె రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, గోపతి భానేష్, నాయకులు,ప్రజలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

క్రిస్టియన్ స్మశాన వాటిక పనులకు భూమి పూజ…

క్రిస్టియన్ స్మశాన వాటిక పనులకు భూమి పూజ…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణం లోని ఆర్కే 1 ఏ ప్రాంతంలో 15 లక్షల 15వ ఫైనాన్స్ నిధులతో చేపడుతున్న క్రిస్టియన్ శ్మశాన వాటిక నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను కార్మిక , మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,మంచిర్యాల డీసీపీ భాస్కర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో అన్ని వర్గాల ప్రజల కోసం స్మశాన వాటికలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి రఘునాథరెడ్డి రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జంగం కళ, మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ, శ్యామ్ గౌడ్, క్రిస్టియన్ పాస్టర్ లు, నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version