సామర్థ్యాల అభివృద్ధి ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.

సామర్థ్యాల అభివృద్ధి ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.

ప్రారంభమైన 5 రోజుల ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమం

కేసముద్రం నేటి ధాత్రి:

ఎఫ్ ఎల్ ఎన్ తో సామర్ధ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా విద్యార్థుల్లో మంచి ఫలితాలను తీసుకురావచ్చని కేసముద్రం మరియు ఇనుగుర్తి మండలాల విద్యాశాఖాధికారులు కాలేరు యాదగిరి, మరియు జంగా రూపారాణి అన్నారు. కేసముద్రం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 2 మండలాల ప్రాథమిక ఉపాధ్యాయులకు ఎఫ్.ఎల్.ఎన్. 5 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ శిక్షణను బాగా ఉపయోగించుకొని విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేలా కృషి చేయాలన్నారు. అనంతరం 158 మంది ఉపాధ్యాయులకు మూడు గదుల్లో మండల రిసోర్సు పర్సన్లు శిక్షణ ఇచ్చారు. మొదటి రోజు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులలోని ఎఫ్ఎల్ఎన్ అంశాల పై శిక్షణ ఇచ్చారు. వివిధ కృత్యాలు, పరస్పర చర్చల ద్వారా అర్ధవంతమైన శిక్షణ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్పి కె.సారంగం, ఎం.ఆర్.పీ. లు గనె యాదగిరి, బొరిగం రాములు, ఏదునూరి అశోక్, ఎన్నం భాస్కర్, వెలమల భాస్కర్, వట్నాల సత్యనారాయణ, మేకల సురేష్ నాయుడు, జి. మోహనకృష్ణ, ఘనపురం కృష్ణ, ఎస్.భాస్కర్, ఎం.ఐ.ఎస్. కో ఆర్డినేటర్ ఎస్.కె. ఖాదర్, కంప్యూటర్ ఆపరేటర్ వెన్ను భిక్షపతి, సీఆర్పీలు ఎం.డి. సుల్తానా, బండారు స్వాతి, ఇస్సంపల్లి ఉదయ్, చీర మురళి, నేలకొండ నాగవాణి, పులి సరిత, ధారావత్ రవి, నేరెళ్ల పద్మ తదితరులు పాల్గన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version