వందేమాతర గీతాలాపన
నిజాంపేట, నేటి ధాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నగరం గ్రామంలో వందేమాతరం గేయం బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం జాతీయ గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నగరం గ్రామంలో గల ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో సామూహిక వందేమాతర గేయం ఆలపించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమారాణి, ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
