ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి.

ఎంపిడిఓ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కేంద్రం ఎంపిడిఓ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది…ఇట్టి కార్యక్రమానికి ఎంపిడిఓ ముఖ్య అతిధులుగా హాజరైయ్యరు, కార్యక్రమము లో హద్నూర్ హెచ్ఎం అమృత్ సార్, ఎపిఓ రాజ్ కుమార్,బర్ధిపూర్ మాజీ ఎంపీటీసీ రాజ్‌కుమార్, మాజీ సర్పంచ్ పెంటయ్య, పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, డాక్టర్ జాన్ శ్రీకాంత్,బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతలగట్టు శివరాజ్,నాయకులు మాటూర్ రాజ్‌కుమార్, డప్పుర్ సంగమేష్, శ్రీకాంత్ రెడ్డి, వై నగేష్, ఎం విష్ణు,రాజేందర్,పాండు ముదిరాజ్,, సోషల్ మీడియా దిగంబర్,మోనిరిటీ యూత్ వైస్ ప్రెసిడెంట్ ,ప్రవీణ్ మరియూ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది,నాయకులు,వివిధ సంఘ నాయకులు తదితరులు పాల్గోని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి..

ఝరాసంగం పంచాయతీ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రాం 117వ జయంతి వేడుకలు ఝరాసంగం మండల కేంద్రమైన గ్రామపంచాయతీలో ఘనంగా జరిగాయి. ప్రముఖులు ఆయన చిత్రపటాన్ని స్పెషల్ ఆఫీసర్ హర్షవర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని పలువురు నాయకులు కొనియాడారు. అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని వెల్లడించారు. జగ్జీవన్​రాం జీవిత పర్యంతం బడుగు వర్గాల ‌అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ సాబ్ సంగమేశ్వర్ నర్సింలు మోహన్ ఏ వన్ మరియు తదితరలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version