వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక పథకాలు.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక పథకాలు.

యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ గంటి.కమలాకర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక రుణ పథకాలు అందజేయనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ గంటి. కమలాకర్ తెలిపారు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ రంగ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని “అగ్రికల్చర్ రైజ్” పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వరి మిల్లులు, తడి మరియు పొడి ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, గ్రేడింగ్, ప్యాకింగ్ మరియు ఇతర వ్యవసాయ ఆధారిత చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తక్కువ వడ్డీ రేటుతో ప్రత్యేక రుణాలు మంజూరు చేయబోతున్నది. ఈ నేపథ్యంలో నర్సంపేట యూనియన్ బ్యాంకు మేనేజర్ జీ బాలాజీ ఆధ్వర్యంలో మిల్లర్ల సంఘ భాద్యులతో, వర్తక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా యూనియన్ బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ “వ్యవసాయ రంగానికి విలువ జోడించే పరిశ్రమల ప్రోత్సాహంతో రైతులకు మెరుగైన ధరలూ, ఉపాధి అవకాశాలూ అందుతాయన్నారు. ఈ క్రమంలోనే రుణాల ప్రక్రియను వేగవంతం చేసి, సులభంగా రుణాలు అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ హెడ్ గంటి. కమలాకర్, డిప్యూటీ రీజినల్ హెడ్ మహేష్, బ్రాంచ్ మేనేజర్ జీ.బాలాజీ, ఫీల్డ్ ఆఫీసర్ శుశాంత్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు గోనెల రవీందర్, ఇరుకు కొటేశ్వర్, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు దాసరి నర్సింహ రెడ్డి,బ్యాంక్ మిత్ర అడ్డగట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version