సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం..

సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం..

విజేతలకు నగదు షీల్డ్ అందజేసిన సిరికొండ ప్రశాంత్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం జన్నె యుగంధర్ అధ్యక్షతన జరగగా ప్రశాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పార్టీలకతీతంగా యువత కోసం ఎక్కడైనా వస్తానని ప్రాణమై నిలుస్తానని

ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఆటలకు యువత దూరమవుతున్న నేటి పరిస్థితులలో క్రీడలను ప్రోత్సహించాలని సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ క్రీడలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

క్రీడలు అంటే తనకు పంచ ప్రాణమని క్రీడలు ఆడేవారన్న చాలా ఇష్టమని అందుకనే పార్టీలకతీతంగా క్రీడలకు సహకరిస్తానని ఆయన తెలిపారు భూపాలపల్లి ని జిల్లా చేయడంతో పాటు అద్భుతమైన అభివృద్ధి చేసిన మాజీ స్పీకర్ బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తనయుడిగా ఆయన ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషిచేయడమే కాకుండా ప్రజల కష్టాలలో పాలుపంచుకుంటానని తెలిపారు గత వారం రోజులుగా క్రికెట్ క్రీడలను కొనసాగిస్తూ విజయవంతం చేసిన నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ గెలుకున్న విజేతలకు ప్రశాంత్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

విజేతలు మొదటి విజేతలుగా కేకేఆర్ జట్టు నిలువగా రెండవ విజేతలుగా విక్టరీ లేవన్ జట్టు మూడవ విజయంశాలుగా ఛాలెంజర్ జట్టు నాలుగవ విజేతలుగా ఎలిమినేటర్ జట్టు నిలిచాయి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతగా దాసరపు మహేష్ నిలిచారు కాగ మొదటి జట్టుకు ట్రోఫీతో పాటు 40 వేల రూపాయల నగదును ద్వితీయ బహుమతిగా 20వేల రూపాయల నగదు షీల్డ్ ను సిరికొండ ప్రశాంత్ విజేతలకు అందించారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతల రమేష్ శశికాంత్ గౌడ్ జన్నె యుగంధర్ మాజీ సర్పంచ్ రాములు కార్యక్రమం నిర్వాహకులు వేల్పుల రాజ్ కుమార్ గడ్డం నితిన్ లవన్ బాబులు రంజిత్ వెంకన్న ప్రకాష్ కన్నా పూర్ణ యాదవ్ గురుకుంట్ల కిరణ్ సంగా రాజేందర్ కోడెల రాజమల్లు కోడెల నంది గొల్లపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version