ఆకునూరు గ్రామంలో శ్రీ రుద్ర సహిత శత చండీ యాగం
భైరవభట్ల చక్రధర్, నాగేళ్ల హరికృష్ణ , కొడకండ్ల రాధాకృష్ణ శర్మ
చేర్యాల నేటిధాత్రి:
చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో అతి పురాతన దేవాలయం శ్రీ భవాని రుద్రేశ్వర ఆలయం లో శ్రీ రుద్ర సహిత శత చండీయాగం మహోత్సవం నిర్వహిస్తున్నారు.
భైరవభట్ల చక్రధర్ నాగేళ్ల హరికృష్ణ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈనెల 30 వ తేదీ బుధవారం చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమం తో యాగం ముగుస్తుంది కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనవలసినదిగా కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు