ప్రభుత్వ స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు.
చిట్యాల, నేటి ధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రాథమిక పాఠశాల నైన్ పాక లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
నిర్వహించడం జరిగింది. పాఠశాల విద్యార్థిని విద్యార్థులుఒకరోజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడుగా వ్యవహరించి వారి ప్రతిభను ప్రదర్శించారు.దీనికి సంబందించిన సమావేశంలో ఒకరోజు ప్రధానోపాధ్యాయులు గా వ్యవహరించిన ఎండీ సన మాట్లాడుతూ ఒకరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించడానికి గత 3 రోజుల నుండి కష్ట పడి తరగతి గదిలో పాఠం చెప్పడం చాలా భయం వేసిందని, రోజూ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కష్టపడే విధానం నాకు నచ్చిందని చెప్పడం జరిగింది. మిగతా విద్యార్థులు కూడా వారి వారి అనుభవాలు చెప్పడం జరిగింది అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాముకుంట్ల తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షనతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఊర్మిళ గారు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా ఎంపీపీఎస్ కొత్తపల్లి ప్రధానోపాధ్యాయులు బి నాగరాజు గారు వ్యవహరించారు. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ కైరున్నీసా హాజరయ్యారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామ్ సుందర్, ఇక్రమోద్దీన్, సదానందం, అనిల్ గవస్కర్, హసీనా, రాజేష్ మరియు ఒక్కరోజు ఎంఈఓ గా రేపాల శ్రేయాన్షి ఉపాధ్యాయులుగా , సాత్విక్, తనుశ్రీ, అనుశ్రీ, హర్షవర్ధన్, శ్రీ తేజ, యువీన, చైత్ర, శార్వాణి, సోను, నిహారిక, వైష్ణవి, జనని, తదితరులు పాల్గొన్నారు అనంతరం ఒక్కరోజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బహుమతులు అందజేయడం జరిగింది.