రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు
రైతులకు అవగాహన కార్యక్రమం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేతలు డా. దిలీప్ కుమార్, డా.విశ్వా తేజ్, మండల వ్యవసాయ అధికారి గంగ జమున వారి ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” రైతుల అవగా హన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .
రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చుల ను తగ్గించుట, అవసరం మేరకు రసాయనా లు వినియోగం, రైతు సోదరు లు కొనుగోలు చేసిన విత్తనాల మరియు పురుగుల మందుల రసీదులను భద్రపరచు కోవ డం, పంట మార్పిడి వలన కలిగే ప్రయోజనాలు, చెట్లను పెంచడం, సాగునీటిని ఆదా చేయడం వలన కలిగే ప్రయో జనాలు రైతులకు వివరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్, గ్రామపంచా యతీ కార్యదర్శి నాగశ్రీ, వ్యవ సాయ కళాశాల వరంగల్ విద్యార్థులు,కొత్తగట్టుసింగారం గ్రామ రైతులు పాల్గొన్నారు.