వైఎస్ కంటే బలంగా రేవంత్!

సీఎం రేవంత్ బలమేమిటో తెలిసింది.

`రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకోగలిగారు.

`ఇది సామాన్యమైన విషయం కాదు.

`గతంలో ఎవరికీ సాధ్యం కాలేదు.

`ఉమ్మడి రాష్ట్రంలో వైస్ కు కూడా ఇంతటి ప్రాధాన్యత దక్కలేదు.

`కేవీపీ కి రాజ్యసభ ఇప్పించడం కోసం ఐదేళ్లు వైస్ ఆగక తప్పలేదు.

`ఐదేళ్ల కాలంలో వైస్ మూడు సార్లు ప్రయత్నం చేసినా అధిష్టానం ఇవ్వలేదు.

`అలాంటిది రేవంత్ కు మాత్రం సాధ్యమైంది.

`12 ఏళ్ల క్రితం వేం నరేందర్ ను ఎమ్మెల్సీ చేయాలనుకున్నాడు.

`అప్పుడు సాధ్యం కాలేదు.

`ఇప్పుడు ఏకంగా రాజ్యసభ కు పంపిస్తున్నాడు.

`వైస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కావడానికి 20 ఏళ్ళు కష్టపడ్డాడు.

`చంద్రబాబు ను ఓడించేందుకు, తాను సీఎం అయ్యేందుకు పాదయాత్ర చేశాడు.

`రేవంత్ రెడ్డి సీఎం అయ్యేందుకు ఎంతో కాలం పట్టలేదు.

`స్నేహితుడిని రాజ్యసభ బరిలో నిలిపేందుకు శ్రమ పడాల్సి రాలేదు.

`బలమైన నాయకుడికి పదవులు దాసోహమంటాయి అనడానికి ఇదే సాక్ష్యం.

`సీఎం రేవంత్ ను అధిష్టానం ఎంత బలంగా నమ్ముతున్నారో అర్ధమైంది.

`ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్ని పటాపంచెలై పోయాయి.

`సీఎం రేవంత్ కు అధిష్టానం వద్ద పలుకుబడి లేదనే వార్తలు తెలిపోయాయి.

`కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా సిఎం రేవంత్ అంటే ఏమిటో తెలిసిపోయింది

`సీఎం. రేవంత్ మీద అధిష్టానానికి వున్న గురి అందరికీ అర్థమైంది.

`అధిష్టానం సీఎం రేవంత్ కు ఎంత విలువ ఇస్తుందో తెలిసినట్లయింది.

హైదరాబాద్, నేటిధాత్రి:

సవాళ్లను స్వీకరించడంలో సిఎం. రేవంత్‌రెడ్డిని మించిన నాయకుడు మరొకరు లేరని మరోసారి రుజువైంది. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఎన్నికయ్యేందుకు అవకాశాలున్నాయి. అందులో రెండు రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం ఇప్ప్పుడున్న పరస్ధితుల్లో కష్టం. కాని రెండో రాజ్యసభ సీటు కూడా కైవసం చేసుకోవడం కోసం సిఎం. రేవంత్ రెడ్డి చూపిన ధైర్యం, చొరవ సామాన్యమైంది కాదు. ఎంతో నమ్మకం, ఆత్మవిశ్వాసం వుంటే కాని అది సాద్యమయ్యేది కాదు. కాని ఎలా అని అందరూ అనుకుంటున్న సమయంలో సిఎం.రేవంత్ రెడ్డి చాణక్యమం మరోసారి తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సిఎం. రేవంత్‌రెడ్డి మీద బలమైన నమ్మకం వుంది. అందుకే రెండో రాజ్యసభ సీటు తమకు కావాలన్న ఆశ కూడా చాలా మంది నాయకుల్లో వుండేది. అందుకు సీనియర్లు క్యూ కట్టారు. వారిలో మాజీ పిపిసి. అద్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి . హనుమంతరావు ఎన్నోఆశలు పెట్టుకున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కూడా రాజ్యసభకు ఎంపిక చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డికి ఇస్తారని కూడ అనుకున్నారు. మొదటి నుంచి వేం నరేందర్ రెడ్డి పేరు వినిపించలేదు. కాని ఒక్కసారిగా వేం నరేందర్ రెడ్డి పేరును పార్టీ అదిష్టానం ప్రకటించడంతో సిఎం. రేవంత్‌రెడ్డి ఎంత బలమైన నాయకుడు మరోసారి తెలిసిపోయింది. నిన్నటిదాకా అధిష్టానం వద్ద సిఎం. రేవంత్‌కు ఎంట్రీ లేదని కొందరు, సిఎం.ను నమ్మడం లేదని కొందరు ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కాని అవన్నీ అబద్దాలని అనేక సార్లు తేలిపోయింది. కాని ఈసారి మాత్రం ఎవరూ ఊహించని విధంగా అదిష్టానం సిఎం. రేవంత్‌రెడ్డికి ఎంత అనుకూలంగా వుందో అందరికీ అర్దమయ్యేలా తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎంతో మంది నాయకులు ఇంతగా అధిష్టానం వద్ద నమ్మకాన్ని సంపాదించకున్న వారు లేరు. ఆఖరుకు వైఎస్. రాజశేఖరెడ్డి కూడా ఇంత బలంగా ఎనాడు కనిపించలేదు. అప్పటి పరిస్దితులకు, ఇప్పటి పరిస్దితులకు పెద్ద తేడా లేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి రావడానికి వైఎస్ ఎంత కష్టపడాల్సి వచ్చింది. తాను సిఎం. కావడానికి కూడా ఇరవై ఏళ్లు పట్టింది. సిఎం. కావడానికి రాజశేఖరరెడ్డి గతంలో ఎన్నడూ ఏ నాయకుడు చేయని విధంగా పాదయాత్ర చేయాల్సి వచ్చింది. అలా పార్టీని మెప్పించి, ఒప్పించి పాదయాత్ర చేసి, ప్రజల నమ్మకాన్ని చూరగొని సిఎం. అయ్యారు. లేకుంటే ఆ సమయంలో కూడా కాంగ్రెస్ గెలిచేది కాదు. రాజశేఖరెడ్డి సిఎం. అయ్యేవారు కాదు. కాని తెలంగాణకు సిఎం. అయ్యేందుకు రేవంత్‌రెడ్డి ఆనాడు వైఎస్ పడిన శ్రమలో పది శాతం కూడా కష్టపడ కుండానే సిఎం. అయ్యారు. అంటే రేవంత్‌రెడ్డి సంకల్పసిద్ది ఎంత బలమైందో అర్దం చేసుకోవచ్చు. సిఎం. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరినప్ప్పుడు ఎలాంటి పరిస్ధితులు వున్నాయో అందరికీ తెలుసు. అడుగడుగునా అవరోధాలు. అవమానాలు. తిరస్కారాలు. పార్టీ సీనియర్ నాయకుల నుంచి ఎదరింపులు. అయినా అన్నీ దిగమింగకుంటూ వచ్చారు. ఆఖరుకు రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడు అయ్యేందుకు, అయిన తర్వాత కూడా అడుగుడుగునా అనేక అవాంతరాలు ఎదుర్కొన్నారు. నిత్య కష్టం ఎల్లదీశాడు. అటు ఇంటి పోరు, ఇటు బైటి పోరు అన్నట్లు నిత్యం సొంత పార్టీలో అనేక మంది టార్గెట్లు చేస్తూ వచ్చేవారు. బైట విషయానికి వస్తే ఆనాటి కేసిర్ సర్కారు రేవంత్‌ను కాలు బైట పెట్టకుండా నిత్యం ఏదో రకంగా అడ్డుకుంటూ వుండేది. అయినా వాటన్నింటికీ తట్టుకుంటూ ముందుకెళ్లారు. పార్టీ కోసం పనిచేశారు. పార్టీని బలోపేతం చేశారు. ఆనాడైనా, ఈనాడైనా ఒంటరి పోరాటమే చేస్తున్నారు. పార్టీని అదికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. వైఎస్‌లాగా సుధీర్ఘ పాదయాత్ర చేయకపోవచ్చు. కాని ఎంతో కొంత పాదయాత్ర కూడా చేశారు. ఆ పాదయాత్రను కూడా అడ్డుకునే ప్రయత్నం సొంత పార్టీలో కూడా చేశారు. ఆ రోజుల్లో రేవంత్ అనుభవించినంత నరకం మరొకరైతే రాజకీయాలు వద్దని వెళ్లిపోయేవారేమో? ఓ వైపు కోవర్టులు, మరో వైపు పార్టీలోనే శత్రువులు, ఆనాటి ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు అన్నీ తట్టుకున్నారు. నిలబడ్డారు. ప్రణాళికలు రచించారు. పార్టీని ఒప్పించారు. ప్రజలను విశ్వాసం పొందారు. ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. ప్రజల నుంచి సానుకూల వాతావరణం సంపాదించుకున్నారు. తెలంగాణలో పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుసకొచ్చారు. ఇది ఎవరు ఔనన్నా, కాదన్నా అంగీకరించాల్సిన సత్యం.ఎందుకంటే ఇటీవల జరిగిన వరుస ఉప ఎన్నికలైనా, పంచాఇయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా సరే సిఎం. రేవంత్ ఒంటి చేత్తో గెలిపించకుంటూ వస్తున్నారు. అధిష్టానం వద్ద రోజురోజుకు నమ్మకం పెంచుకుంటూ పోతున్నారు. ఇకపోతే తాను సిఎం. కావడానికి ఇరవై ఏళ్లు కష్టపడిన, వైఎస్ రాజశేఖరెడ్డి, తన స్నేహితుడైన కేవిపి. రామచంద్రరావును రాజ్యసభకు పంపడానికి కూడా అనేక సార్లు ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ప్రతీసారి చుక్కెదురైంది. ఎప్ప్పుడు అవకాశం వచ్చినా వైఎస్ ఆనాడు కేవిపి. పేరును ప్రతిపాదించడం, అదిష్టానం తిరస్కరించడం జరిగేంది. ఆ సమయంలో దేశంలోనే బలమైన సిఎం. అనే పేరు సంపాదించుకున్న వైఎస్ ర్పుాశేఖరెడ్డి మాటలు కూడా అధిష్టానం వద్ద చాలా కాలం చెల్లుబాటు కాలేదు. ఆయన ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. ఆఖరుకు ఆయన రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత గాని కేవిపి రామచంద్రరావుకు రాజ్యసభ ఇప్పించుకోలేకపోయారు. అలా ఐదేళ్లపాటు అదిష్టానానికి ప్రతిపాదనలు పదే పదే పంపితే అప్ప్పుడు మోక్షం కుదిరింది. ఆ రోజుల్లో కేంద్రంలో వైఎస్. ఎంత చెబితే అంత అనేలా వుండేది రాజకీయం. అయినా రాజశేఖరెడ్డి మాట ఆనాడు చెల్లలేదు. అలా వైఎస్‌తో పోల్చుకుంటే సిఎం. రేవంత్‌రెడ్డి బలం అనేక రెట్లు వుందని చెప్పడంతో సందేహం లేదు. లేకుంటే రెండు రాజ్యసభ సీట్లే వచ్చే చోట ఒకటి తన స్నేహితుడికోసం ఇప్పించుకోగలగడం అంటే సామాన్యమైన విషయం కాదు. వైఎస్ కాలంలో ఒక్క సోనియా గాందీని ఒప్పిస్తే సరిపోయేది. ఇప్ప్పుడు అలాంటి పరిస్ధితి కూడా కాదు. సోనియాగాంధీ, రాహుల్ గాందీ, ప్రియాంకాగాందీ, మల్లికార్జున ఖర్గేతోపాటు పార్టీ ప్రదాన కార్యదర్శి వేణుగోపాల్‌ను కూడా ఒప్పింగలిగితే తప్ప సీటు వచ్చే అవకాశం లేదు. కాని ఇంత మందిని సునాయాసంగా ఒప్పించగలిగిన సిఎం. రేవంత్‌రెడ్డికి అధిష్టానం వద్ద ఎంత వెయిట్ వుందో ఈ ఒక్క సందర్భం చాలు. అసలు రాజ్యసభ సీటు ఇప్పించుకోవడమే ఎంతో పెద్ద టాస్క్. అలాంటిది ఇప్ప్పుడు వేం నేరేందర్‌రెడ్డిని గెలిపించుకోవడం అనేది మరింత పెద్ద టాస్క్. ఆ టాస్క్‌ను ఎలా గట్టెక్కుతారనేది ఇప్ప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఇప్ప్పుడు ఎలా రెండో రాజ్యసభ సీటు గెల్పించుకుంటారనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మరో వైపు బిఆరఎస్ తన వ్యూహం కూడా అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అదే జరిగితే రెండో రాజ్యసభ గెల్చుకోవడం సాద్యం కాని పని. అయినా ఎంతో నమ్మకంతో రేవంత్ రెడ్డి తన స్నేహితుడిని నిలబెట్టారు. ఒక వేళ బిఆరఎస్ విప్ జారీ చేసినా పది మంది ఎమ్మెల్యేలలో కనీసం ఎనమిది మంది ఓట్లు వేస్తారన్న నమ్మకం వుంది. ఆ ఎనమిది మంది పదవులు పోయినా, మళ్లీ గెలిపించుకుంటానన్న నమ్మకం వుంటే తప్ప ధైర్యం చేయలేని పరిస్దితి. అయినా రంగంలోకి దిగారంటే రేవంత్ బారీ వ్యూహమే రచిస్తున్నారని అర్ధమౌతోంది. ఇంకా ఎంత మంది బిఆరఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనేది తేలిపోతుంది. రెండో రాజ్యసభ సీటు కూడా సిఎం. రేవంత్ రెడ్డి గెలిపించుకుంటే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌రెడ్డిని మించిన బలమైన నాయకుడు లేడనే చెప్పాలి. రెండో రాజ్యసభ గెలిపించుకుంటే కాంగ్రెస్‌లో తిరుగుండదు. ఎదురుండదు. ప్రతిపక్ష వ్యూహాలు ఇక భవిష్యత్తులో కూడా చెల్లవు. అంతటి బలమైన నాయకుడుగా రేవంత్ రెడ్డి జాతీయ స్దాయిలోనూ గుర్తింపు పొందుతాడు. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లోనూ కీలకభూమిక పోషిస్తారని చెప్పడంలో అశియోక్తి కూడా వుండదు. చూద్దాం..ఏం జరుగుతుందో!!

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version