ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి నాజియా అంజుమ్ షేక్ సోహెల్..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-10T124340.456.wav?_=1

 

ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి నాజియా అంజుమ్ షేక్ సోహెల్

ఆవకాశం ఇవ్వండి… అభివృద్ధి చూడండి..! యువతకు ఉపాధి… మహిళ సంఘాల బలోపేతం బలపరచిన అభ్యర్థి నాజియా అంజుమ్ షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పరిధిలోని తుమ్మనపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని గ్రామం మొత్తం ఎన్నికల సందడి తారస్థాయికి చేరగా బలపరచిన అభ్యర్థి నాజియా అంజుమ్ షేక్ సోహెల్ ప్రచారంలో చురుకుదనం చూపుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.

“ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాం” అనే నినాదంతో ప్రజల్లో మంచి స్పందనను సొంతం చేసుకుంటున్నారు. అభివృద్ధే ప్రధాన లక్ష్యం తామెదుర్కొంటున్న గ్రామ తుమ్మనపల్లి గ్రామాన్ని సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తన లక్ష్యమని నాజియా అంజుమ్ షేక్ సోహెల్ స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సిసి రోడ్లు, త్రాగునీరు నిరంతర విద్యుత్ సరఫరా మహిళా సంఘాల బలోపేతం యువతకు ఉపాధి ఆవకాశాలు వృద్ధుల సంక్షేమం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటామని తెలిపారు. ప్రజల్లో మంచి ఆదరణ గ్రామస్థులు చాలామంది ఆమె ప్రచారానికి పాజిటివ్ స్పందిస్తున్నారు. “ఈసారి అభివృద్ధి చేయగలిగేది నాజియా అంజుమ్ షేక్ సోహెల్ మాత్రమే” అని కొందరు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నారు.

ప్రచారం సమయంలో మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో కలిసి నినాదాలు చేస్తున్నారు. తమ ఉంగరం గుర్తుకు ఓటు వేసి మార్పును అందించగల నాయకురాలిగా నాజియా అంజుమ్ షేక్ సోహెల్ పేరు స్పష్టంగా వినిపిస్తోంది.ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామ వార్డు మెంబర్లుగా పోటి చేస్తున్న సభ్యులు, గ్రామస్థులు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version