సిరిసిల్లలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకల సందర్బంగా సిరిసిల్ల పట్టణంలో ని బైపాస్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గౌడ్ సంఘం నాయకులు తీగల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలిరాజు,బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు,దొరల అరాచకాలను,మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో బీసీలదే రాజ్యాధికారమని అన్ని పార్టీలు దీనికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
