కాషాయ సైనికులే పార్టీకి కీలకం..కార్యకర్తలే వెన్నెముక

కాషాయ సైనికులే పార్టీకి కీలకం..కార్యకర్తలే వెన్నెముక

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రాంచంద్రాడ్డిరె
-బిజెపి భూపాలపల్లి నియోజకవర్గం కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

భారతీయ జనతా పార్టీ విజయాల్లో పార్టీకి కాషాయ సైనికులే కీలకం..కార్యకర్తలే వెన్నెముక అని, వారి శక్తి, ఉత్సాహం ప్రేరణాదాయకమని, కొన్ని సంవత్సరాలుగా పార్టీ బలోపేతం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారి సేవలు మరువలేనివని భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని అమ్మ గార్డెన్ లో భాజపా 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బిజెపి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి చదువు రామచంద్ర రెడ్డి&మోరే రవీందర్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోని ప్రజలంతా బిజెపి సుపరిపాలనను చూస్తున్నారని, ఇటీవల పార్టీ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాల్లో ఇది ప్రతిబింబిస్తోందన్నారు. బిజెపి 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ పురోగతికి “వికసిత్ భారత్” స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమాజ సర్వతోముఖాభివృద్ధి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం సేవ చేస్తుందన్నారు. 1980లో స్థాపించిన భారతీయ జనతా పార్టీ 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రెండు లోక్ సభ స్థానాలను మాత్రమే గెలుచుకొని ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్ పేయ్, ఎల్ కె అద్వానీ నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగి..1990లో మిత్రపక్షాలతో కలిసి బిజెపి అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. అనంతరం 2014 నుంచి ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిందన్నారు. దేశ ప్రజల రక్షణే లక్ష్యంగా..ప్రజల అభివృద్దే ధ్యేయంగా..వారికి సుపరిపాలనను అందిస్తున్న..నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా..తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధుడై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించేలా కష్టపడాలన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ..ప్రజా సమస్యలపై పోరాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కుమ్మరి సారయ్య జమలాపురం సాంబశివరావు దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్యాల రాజు పార్లమెంట్ ఫుల్ టైమర్ మంద రాజేష్ మండల ప్రధాన కార్యదర్శి బండారి శ్రీనివాస్ అరికాంతపు కృష్ణారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ పెళ్లి మల్లారెడ్డి మండల ఉపాధ్యక్షులు బలుగూరి కిషన్ రావు రాస బిక్షపతి జిల్లా నాయకులు అనుముల శ్రీనివాస్ పులి వెంకట్ రెడ్డి మునిగంటి మల్లారెడ్డి వైనాల ప్రియాంక శివకుమార్ Stomach రాజేశ్వరరావు బల్గూరి తిరుపతిరావు వంగ రవి పొన్నాల మల్లారెడ్డి జమలాపురం రాజు యారా జయపాల్ రెడ్డి పెళ్లి మల్లారెడ్డి మండల నాయకులు రేపాల శ్రీనివాస్ బండారి తిరుపతి చిలకమర్రి రాజేంద్రప్రసాద్ బోయిని తిరుపతి కక్కర్ల వీరన్న పొడిసెట్టి రవి దేశిని భూమయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version