వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T113244.651.wav?_=1

వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో

*దేవాదుల నీటి కోసం రైతుల పోరాటం
*దేవాదుల నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను రక్షించాలి.

*భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఉండూరు మహేందర్ రెడ్డి.

వర్ధన్నపేట (నేటిధాత్రి):

వర్ధన్నపేట మండలం చెరువును దేవాదుల నీటితో నింపాలని జాతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కట్ర్యాల గ్రామం వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఉండూరు మహేందర్ రెడ్డి. జిల్లా కార్యదర్శి జడ సతీష్.

Warangal-Khammam national highway

కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి. బూత్ అధ్యక్షులు పింగిలి రాజేందర్ రెడ్డి . కడారి గూడెం మాజీ సర్పంచ్ మంద సతీష్. కంజర్ల రంజిత్ మరియు రైతులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం దేవాదుల నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి నీటి కోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version