శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ కలకలం.. పోలీసుల విచారణ…

శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ కలకలం.. పోలీసుల విచారణ

 

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ ఒకటి బయటపడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ద్వారా వాహన తనిఖీల్లో గుర్తించారు అక్కడి పోలీసులు.

శ్రీశైలం టోల్‌గేట్(Srisailam Toll gate) వద్ద రివాల్వర్ కలకలం రేపుతోంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా.. ఓ వ్యక్తి నుంచి 9 ఎంఎం పిస్టల్(9mm Pistol) ఒకటి బయటపడింది. దీంతో సదరు తుపాకీ(Revalver)ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

కాగా.. రివాల్వర్ తీసుకువచ్చిన వ్యక్తిని మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) వాసిగా గుర్తించారు శ్రీశైలం ఆలయ అధికారులు. ఆ రాష్ట్రానికి చెందిన సైబర్ క్రైమ్ ఎస్ఐ(Cyber Crime SI) అని ఆయన పోలీసులకు చెప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనపై విచారణలో భాగంగా.. సదరు వ్యక్తి నుంచి రివాల్వర్ సహా ఐడెంటిటీ కార్డు(ID Card)ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టినట్టు శ్రీశైలం సీఐ ప్రసాదరావు(CI Prasada Rao) పేర్కొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version