భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు

– తహసిల్దార్ జాలీ సునీత
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు మొగుళ్లపల్లి తహసిల్దార్ జాలీ సునీత తెలిపారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి మరియు పోతుగల్ గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహసిల్దార్ సునీత రైతుల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించి..రిజిస్టర్ లో నమోదు చేశారన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. ఈనెల 3 నుండి 20 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, ప్రజలు రెవెన్యూ సదస్సులలో పాల్గొని తమ భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. అలాగే నేడు గురువారం మండలంలోని రంగాపురం మరియు అంకుషాపురం గ్రామాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొని భూములకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న వారు వారి దగ్గర ఉన్న ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తహసీల్దార్ జాలీ సునీత సూచించారు. ఈ కార్యక్రమంలో డిఏఓ రంగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ రామకృష్ణ మరియు రెవెన్యూ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version