రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం
మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి,ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రామచంద్రనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం
కాంగ్రెస్ పార్టీతోనే డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి
గతంలో ఏకలవ్య గురుకుల పాఠశాల మోడల్ స్కూల్స్ వివిధ గురుకులాలు ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ స్కూలుకు 200 కోట్లు విడుదల కావడంతో సంబరాలు జరుపుకున్నారు
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కొరకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసిననందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మరిపెడ మండల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి యువ నాయకులు నూకల అభినవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు, రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు నిన్న ఒక్కరోజు 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించేందుకు 11,000 కోట్ల రూపాయాలను మంజూరీ చేయడం పట్ల ఆయన హర్హంవ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నప్పటికి నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన ఎజెండాగా 11 వేల కోట్ల రూపాయలను కేటాయించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనే 3 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించేందుకు 600 కోట్ల రూపాయలను కేటాయించామని.. మొత్తంగా 58 పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలను కేటాయించడం విద్యకు ప్రజాప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన అన్నారు, తాము అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు నిర్మించి విద్యలో అసమానతలు లేకుండా చేస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు,ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రవి నాయక్, అప్సర్, మెన్స్ అశోక్ కుమార్ గౌడ్,రామ్ లాల్ , వీరభద్రం గౌడ్, కృష్ణ, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.