పేదలకు వైద్యం అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ..
రామయంపేట మార్చి 18 నేటి ధాత్రి (మెదక్)
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ వి ఎస్ టి ఇండస్ట్రీస్ తూప్రాన్ వారి సహకారంతో మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం మేడ్చల్ జిల్లా వారి సౌజన్యంతో కాళ్లకల్ గ్రామంలో పాత గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య శిబిరమును తెలంగాణ రాష్ట్ర కార్య దర్శి ప్రొఫెసర్ ఏ శ్రీరాములు ప్రారంభిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్య శిబిరంలను నిర్వహిస్తూ పేదలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు… ఈ కార్యక్రమం లో మెదక్ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర సభ్యులు సింగం శ్రీనివాసరావు, కార్యదర్శి టి.సుభాష్ చంద్రబోస్, వైస్ చైర్మన్ పి. లక్ష్మణ్ యాదవ్, కోశాధికారి డి.జీ. శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పి.దామోదర్ రావు,దేమేయాదగిరి, మద్దెల సత్యనారాయణ, సభ్యులు శ్రీనివాస్, వి. సతీష్ రావు, మల్లారెడ్డి హాస్పిటల్ వైద్య సిబ్బంది మరియు జిల్లా మనోహరాబాద్ మండలకు సంబంధించిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు కాల్లాకల్ విలేజ్ సెక్రెటరీ ఎం.శేషుడు సిబ్బంది పాల్గొన్నారు