రైతు భీమా దరఖాస్తుల స్వీకరణ
నిజాంపేట: నేటి ధాత్రి
రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో రైతు బీమా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జూన్ 5వ తారీఖు లోపు కొత్తపట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 13 అని పేర్కొన్నారు.