కొత్త తిమ్మాపూర్ వద్ద డివైడర్ పనులు ఆపాలంటూ నిరసన.

కొత్త తిమ్మాపూర్ వద్ద డివైడర్ పనులు ఆపాలంటూ నిరసన..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

.క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుర్మపల్లి స్టేజ్ నుండి శ్రీనివాస గార్డెన్ వరకు నిర్మిస్తున్న 100 ఫీట్ల రహదారి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో డివైడర్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే రామకృష్ణాపూర్ ఎక్స్ రోడ్ నుండి అమ్మ గార్డెన్ వరకు డివైడర్ నిర్మించడం వల్ల కొత్త తిమ్మాపూర్ గ్రామానికి వెళ్లే ప్రజలకు దూర భారం ఏర్పడుతున్న నేపథ్యంలో మంగళవారం డివైడర్ పనులు ఆపాలని స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు.డివైడర్ పనులు అడ్డుకున్నారు. ప్రజల సౌకర్యార్థం రహదారి పై అవసరమైన చోట యుటర్న్ లు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లినా సరే నిర్మాణాలు యధావిధిగానే జరుగుతున్నాయని, అవసరమైన చోట యూటర్న్ నిర్మించడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని కొత్త తిమ్మాపూర్ వెళ్లే రహదారి దగ్గర యూటర్న్ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో రహదారిపై బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపడతామని అంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version