బిక్షటన చేసిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు.
మందమర్రి నేటి ధాత్రి
కార్మిక శాఖ మంత్రి ఇలాకాలోనే రోడ్డున పడ్డ కార్మికులు…
కార్మికుల ఓట్లు తప్ప, 220 కుటుంబాల గోస పట్టదా?.
పోరాటంలో భాగంగా 3వ రోజు బిక్షటన చేసిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు.
అధికారులు, పాలకులు స్పందించి సమస్యను పరిష్కరించకుంటే ప్రజా పోరాటంగా ముందుకు వస్తాం.
దూలం శ్రీనివాస్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు.
తొలగించిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను తిరిగి వీధిలోకి తీసుకోవాలని ఎస్సీ కేఎస్ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం మూడవ రోజుకు చేరుకుంది. పోరాటంలో భాగంగా మందమరి ఏరియాలోని మార్కెట్ ప్రాంతంలో బిక్షాటన చేస్తూ, కార్మికులు ప్రజలకు తమ గోడును తెలియజేశారు. ప్రజల నుంచి విశేష స్పందన రావడమే కాకుండా పోరాటానికి అండగా నిలబడుతామని బరోసా కూడా ఇవ్వడం జరిగింది . అనంతరం దూలం శ్రీనివాస్ ఎస్ సి కె ఎస్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ…
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ప్రాంతంలోనే పెద్ద ఎత్తున 220 మంది కార్మికులను టెండర్ పేరుతో తొలగించి రోడ్డున పడేసి, రెండు నెలలు కావస్తున్నా కార్మిక శాఖ మంత్రి గారు ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే అధికారులు సైతం వారి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చాడానికే టెండర్ పేరుతో కాలయాపన చేస్తున్నారు. 12 సం”రాలుగా సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తు తమ యవ్వనాన్ని, అనుభవాన్నే కాకుండా వాళ్ల విలువైన భూములను సైతం కొల్పొయిన వారి పట్ల అధికారులు ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు గా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు సానుకూలంగా స్పందించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, కార్మికులందరినీ ఎలాంటి షరతులు లేకుండా పాత పద్ధతిలోనే పూర్తిస్థాయిలో అందర్నీ తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేదంటే ఈ కార్మికుల పోరాటానికి ప్రజల మద్దతును పూర్తిస్థాయిలో కూడగట్టి ఈ పోరాటాన్ని ప్రజా పోరాటంగా ముందుకు తీసుకు రావడానికి కూడా వెనుకడుగు వేయమని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
