పడకేసిన పారిశుద్ధ్యం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: అసలే వర్షాకాలం.. కొత్త కొత్త రోగాలతో ప్రజలు ఇబ్బందిపడుతున్న సమయంలో జహీరాబాద్ పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఆర్టీసీ కాలనీలోని ఆర్ఎల్ఆర్ స్కూల్ వెనకాల మురుగునీరు ఇళ్ల మధ్యలో చేరి పందులు నివాసాల ముందు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటికి తోడు దోమలు మురికిపై వాలి తినే ఆహారపదార్థాలపై వాలితే ప్రజలు రోగాల బారినపడే అవకాశముంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
