అర్ధరాత్రి యూవకులు రోడ్లపై తిరగకుండా పోలీసు నిఘా ఏర్పాటు చేయాలి
డి.ఎస్.పి గిరిబాబు ను కలిసిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు
వనపర్తి నేటీదాత్రి .
వనపర్తి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గిరిబాబును వనపర్తి జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ద్యారపోగు వెంకటేష్ ఘనoగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాదారి భోజరాజు, చింతకుంట విశ్వం బాబు, ఎడవల్లి వీరప్ప రామచంద్రయ్య పాల్గొన్నారని వెంకటేష్ తెలిపారు
వనపర్తి జిల్లా లో అదేవిధంగా వనపర్తి టౌన్ లో యువకులు అర్ధరాత్రి లో డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అర్ధరాత్రి రోడ్ల పైకి రాకుండా పోలీసు లు కఠిన చర్యలు తీసుకోని నిఘా ఏర్పాటు చేయాలని విజిలెన్స్ కమిటీ సభ్యుల అధ్యర్యము లో డిఎస్పి గిరిబాబు కి దృష్టికి తీసుకు వెళ్లమని వెంకటేష్ ఒక ప్రకటన లో తెలిపారు
ఎస్సీ కాలనీ 21వ వార్డు కర్రెమ్మ గుడి, 5వ వార్డు ఇందిరమ్మ కాలనీ లో కొత్త గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డి ఎస్పీ ని కోరారు
