ఎమ్మెల్యే దొంతిని పరామర్శించిన పీసీసీ సభ్యులు
నర్సంపేట నేటిధాత్రి:
గత కొన్ని రోజుల క్రితం నర్సంపేట ఎమ్మెల్యే తల్లీ దొంతి కాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డిని హనుమకొండలోని తన నివాసంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి,పెండెం రామానంద్ మర్యాదపూర్వంగా కలిసి పరమర్శించారు. కాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, నెక్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శులు మోటం రవికుమార్, చిప్ప నాగ, నాడేం నాగేశ్వర్లు, నాడేం ప్రదీప్ కన్నా, తదితరులు పాల్గొన్నారు.
