పదవి బాధ్యతలు చేపట్టిన పావుశెట్టి సునీల్…

పదవి బాధ్యతలు చేపట్టిన పావుశెట్టి సునీల్

పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా

మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్

పరకాల,నేటిధాత్రి

పరకాల మున్సిపాలిటీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.చైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్ శుక్రవారం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు.చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సునీల్ కుమార్‌ను అభినందిస్తూ శాలువా కప్పి సన్మానించారు. అలాగే మున్సిపల్ కౌన్సిలర్‌లను కూడా ఆయన సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా చైర్మన్ పావుశెట్టి సునీల్ మాట్లాడుతూ పట్టణ ప్రజల విశ్వాసంతో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సునీల్ కుమార్ ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి లక్ష్యమని తెలిపారు.పరకాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి,పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం,రోడ్ల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేస్తానని తెలిపారు.పావుశెట్టి సునీల్ కుమార్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆయన అనుచరులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.పట్టణ అభివృద్ధి కోసం చైర్మన్ సునీల్ కుమార్ నాయకత్వంలో మున్సిపాలిటీ ముందుకు సాగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,అధికారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version