వరద ధాటికి కోతకు గురైన పాలవాగు బ్రిడ్జి
చెన్నూరు,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని అక్కేపళ్లి గ్రామానికి వెళ్లే పాల వాగు బ్రిడ్జి అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కోతకు గురై ప్రమాదాలకు దారితీస్తుందని గ్రామస్తులు వాపోయారు.చెన్నూర్ పట్టణ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు నిరంతరం రాకపోకలు జరిపే బ్రిడ్జి కోతకు గురైన ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు.ఈ రహదారి వెంట ఎలాంటి ప్రమాదాల జరగకముందే అధికారులు అప్రమతమై చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరారు.