పహల్గాం దాడి కేసు.. నేడు చార్జ్షీట్ దాఖలు చేయనున్న ఎన్ఐఏ
పహల్గాం దాడి కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ కాసేపట్లో చార్జ్షీట్ను దాఖలు చేయనుంది. జమ్మూలోని ప్రత్యేక కోర్టులో అధికారులు ఈ చార్జ్షీట్ను దాఖలు చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి కేసులో దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నేడు చార్జ్షీట్ను దాఖలు చేయనుంది. జమ్మూలోని ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ అధికారులు చార్జ్షీటును దాఖలు చేస్తారు. ఈ కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే (NIA Charge Sheet).ఈ కేసులో ఎన్ఐఏ ఇప్పటికే బాట్కోట్కు చెందిన పర్వెయిజ్ అహ్మద్ జోథార్, బషీర్ అహ్మద్ జోథార్లను అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా వారు ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల వివరాలను వెల్లడించారు. వీరికి సంబంధించి అనేక ఆధారాలను ఎన్ఐఏ సేకరించింది. పహల్గాం దాడిలో పాలుపంచుకున్న ముగ్గురు ఉగ్రవాదుల వివరాలను నిందితులు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పర్వెయిజ్, బషీర్లు.. ముగ్గురు సాయుధులైన ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. వారికి ఆహారం, నివాసంతో పాటు రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఉపా చట్టం సెక్షన్ 19 కింద ఎన్ఐఏ నిందితులను అరెస్టు చేసింది.
