నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవానికి హాజరై చిన్నారిని ఆశీర్వధించిన – నారబోయిన రవి ముదిరాజ్

మునుగోడు 

చౌటుప్పల్ మండలం దామెర గ్రామ వాస్తవ్యులు కోరే ప్రకాష్ -మమత గార్ల చిన్నారులు అభిజ్ఞ – అక్షర గారి నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం కళా శ్రీ ఫంక్షన్ హల్ చౌటుప్పల్ కి హాజరై చిన్నారులని ఆశీర్వధించిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారు

ఈ కార్యక్రమంలో మునుగోడు వైస్ ఎంపీపీ అనంత స్వామి గౌడ్ గారు, మండల విశ్వనాధ్ గారు, వల్కి దిలీప్ గారు, బిఆర్ఎస్ పార్టీ మండల కార్మిక విభాగం అధ్యక్షులు కట్కూరి శంకర్ గారు, మునుగోడు పట్టణ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు మల్లేష్ గారు, గోదాల సాగర్ రెడ్డి గారు, మరియు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలనం – అయన రూపంలో వైఎస్ కదలాడతారు!

 

గంగా నది మన దగ్గరకు రాదు. వేల మైళ్లు ప్రయాణించి అయినా మనమే గంగ దగ్గరికి వెళ్లాలి. ప్రజాస్వామ్యంలో జనమే… గంగా ప్రవాహం లాంటి వారు! వాళ్ల మధ్యకి వెళ్లి కలిసి నడిచిన వారే జన నేతలు అవుతారు!
‘జనం మధ్యలో జన నేత’ అంటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు? పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ్ల ముందు కదలాడతారు! తలపై పాగా, తెల్లటి పంచె, స్వచ్ఛతలో ఒక దానితో ఒకటి పోటీ పడే ఆయన లాల్చీ, చిరు నవ్వులు… మనల్ని గతంలోకి తీసుకు వెళ్లిపోతాయి. అదుగో… ఆ రాజన్న ఇప్పుడు పేదలు, బడుగు, బలహీన వర్గాల వారికి మరోసారి గుర్తుకు వస్తున్నారు. తమని ఆదుకునే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని వాళ్ల కళ్లలో ఆశలు మిలమిల మెరుస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ‘పీపుల్స్ మార్చ్’ అంటూ పోరుబాట పట్టిన విషయం మనకు తెలిసిందే! ఆయన ప్రస్తుతంలో ఎర్రటి ఎండల్లోనూ జనం మధ్య, జనంతో మమేకం అవుతున్నారు…
మార్చ్ లో ప్రారంభమైన భట్టి పాదయాత్ర దివంగత రాజశేఖర్ రెడ్డిని జనానికి తలపిస్తూ ముందుకు సాగుతోంది. వైఎస్ లాగే పంచెకట్టుతో, భరోసా ఇచ్చే చిరు నవ్వుతో, రైతుల్లో రైతుగా మారిపోయి… సామన్యుల్లో సామాన్యుడై… మన తెలంగాణ భూమి పుత్రుడు అడుగులు వేస్తున్నారు. జనం ఆయనతో తమ కష్ట, నష్టాలు చెప్పుకుంటూ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కంకణాలు కట్టుకుంటున్నారు. హస్తానికే తమ ఓటు అంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
వైఎస్ ను తలపించే రూపం, హావభావాలు మాత్రమే కాదు… భట్టి విక్రమార్క మరో మారు రాజన్న రాజ్యాన్ని కాంగ్రెస్ మార్కు పథకాలు, పాలనతో తాను తీసుకు వస్తానని సూటిగా, స్పష్టంగా చెబుతున్నారు. పేదల గోడు వినని ప్రస్తుత దొరల పాలనకు తమ ప్రభుత్వం పూర్తి భిన్నంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ ల్లోనే తొమ్మిదేళ్లు గడిపేసిన కేసీఆర్ తన రాజ ప్రాసాదాల్లోకి కామన్ మ్యాన్ కి నో ఎంట్రీ అనేశాడు. సచివాలయంలోకి కూడా సామాన్యుడు రాకుండా పోలీసుల్ని కాపాలా పెట్టేశాడు! కాంగ్రెస్ వస్తే రాజశేఖర్ రెడ్డి హయాంలో మాదిరిగా ప్రజాదర్భార్, రచ్చబండ కార్యక్రమాలు పునః ప్రారంభం అవుతాయని భట్టి అంటున్నారు. జనం సీఎం వద్దకు రావచ్చని… సీఎం జనం వద్దకు వచ్చి తీరుతాడని ఆయన హామీ ఇచ్చారు! రాబోయే ఖచ్చితంగా… పేదలకు, సామాన్యులకు ఆపన్న ‘హస్తం’ అందించే… రాజన్న రాజ్యమే!

బిఆర్‌ఎస్‌ ను ఎదుర్కోలేక బిజేపి దొంగ దెబ్బ!?

`రెండో రాజధాని పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తే సహించేదే లేదు.

బిజేపి ఆడే పైలా పచ్చీసు రాజకీయాలు ఎలా వుంటాయన్న విషయాల మీద 

ఎమ్మెల్సీ ‘‘దండె విఠల్‌’’ , నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేంద్రరావు’’ తో సంబాషిస్తూ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే…

`రాజకీయ చిచ్చు…రెండో రాజధాని ఉచ్చు!?

`బిజేపి మొదలు పెట్డిన రాజకీయ కుట్ర?

`తెలంగాణ లో బిజేపి పాగా వేయడం కష్టమని తేలిపోయింది?

`కర్నాటక ఫలితాల తర్వాత కలవరం మొదలైంది.

`బిజేపి నుంచే వలసల కాలం కళ్లముందుంది!

`బిజేపిల కలవరపాటుకు గురవుతోంది!

`ఎలాగైనా బిఆర్‌ఎస్‌ బలం తగ్గితే తప్ప దెబ్బ తీయలేమని అర్థమైంది?

`సెటిలర్స్‌ మద్దతు వుంటుందని బిజేపి నమ్ముతున్నట్లుంది?

`అలాగైనా నాలుగు సీట్లు సాధించొచ్చని బిజేపి ఆరాట పడుతోంది.

`తెలంగాణ ఉద్యమ సమయంలోనే రెండో రాజధాని తెరమీదకు వచ్చింది.

`బిజేపి కొందరు చెబుతున్నట్లు అంబేద్కర్‌ రాజ్యాంగలో ప్రస్తావించారనేది అబద్ధం.

`బిజేపి అబద్దాలు అందరికీ తెలుసు.

`తను రాసిన పుస్తకంలో మాత్రమే అంబేద్కర్‌ ప్రస్తావించారు.

`అప్పటికీ ఇప్పటికీ అనేక మార్పులు వచ్చాయి.

`అంబేద్కర్‌ పేరు చెప్పి తెలంగాణ ను ఆగం చేయాలని చూస్తున్నారు.

`తెలంగాణ సమాజం సహించదు.

`పక్క రాష్ట్రాలు రాజకీయం చేయడం వేరు.

`అధికారంలోకి రావడం లేదని తెలంగాణ బిజేపి నాయకులు మాట్లాడడం తెలంగాణ కు ద్రోహం చేయడమే.

`తెలంగాణపై బిజేపి విషం చిమ్మడమే

-తెలంగాణ కోసం బిజేపి నేతలు కొట్లాడిరది లేదు.

-తెలంగాణ లో రాజకీయం చేసే నైతికతే బిజేపికి లేదు.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు వెతకడంలో బిజేపిని మించిన వారు లేరు. దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు ఒక్క మంచి పని చేసింది లేదు. ఒక్క పధకం ప్రకటించిన పాపాన కేంద్ర ప్రభుత్వం పోలేదు. కాని ఎప్పటికప్పుడు రాజకీయ పైలాపచ్చీసు తొండి ఆటలు ఆడడంలో మాత్రం ఆరితేరిపోయారు. తాజాగా తెలంగాణ మీద కుట్రకు బిజేపి తెరలేపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సరిగ్గా ఎన్నికల తరుణం దగ్గరపడుతున్న నేపధ్యంలో బిజేపి సీనియర్‌ నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలన్న అంశాన్ని తెరమీదకు తెచ్చి, ప్రశాంతంగా వున్న తెలంగాణలో మళ్లీ కల్లోలం రేపాలని చూస్తున్నారు. కొన్ని దశాబ్ధాల పాటు గోసలు, అరిగోసలు చూసిన తెలంగాణ, ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో పచ్చగా, ప్రశాంతంగా, ఆత్మగౌరవంతో ముందుకుసాగుతోంది. ఇది బిజేపికి నచ్చడం లేదు. తెలంగాణ పచ్చగా వుండడం బిజేపికి ఏనాడు ఇష్టం లేదు. అందుకే సమయం సందర్భం లేకపోయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ మీద విషం చిమ్ముతూనే వుంటాడు. తెలంగాణ వచ్చిన సంతోషం తీరకముందే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో అక్కడి ప్రజలను రెచ్చగొట్టే విధంగా తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని రాజకీయాలు చేశాడు. ఓట్ల కోసం ఎంతకైనా దిగజరతామని నిరూపించారు. అన్నదమ్ములుగా విడిపోయాం….అభివృద్ది చేసుకుందామని స్నేహపూర్వక వాతావరణాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ సృష్టిస్తే, అడుగడుడునా తెలంగాణను బిజేపి కించపరుస్తూ వస్తోంది. ప్రధాన మంత్రి స్ధాయిలో వున్న వ్యక్తి కూడా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారంటూ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలను అవమానానికి గురి చేయడం కాదా? తాజాగా అదే పార్టీకి చెందిన నాయకుడు విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తే బాగుంటుందంటూ చిలకపలుకులు పలికి, చిచ్చురేపాలని చూడడం ఎంత వరకు సమంజసం అంటూ బిజేపి కుత్సిర రాజకీయాలపై తనదైన శైలిలో బిఆర్‌ఎస్‌ నాయకుడు, ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఫైర్‌ అయ్యారు. నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో లేని, ప్రజలు మనసుగెల్చుకోలేని బిజేపి దేశంలోని రాజకీయాలను ఎలా చిన్నా భిన్నం చేస్తుందో చెబుతూ, పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అన్నది ప్రతి తెలంగాణ వాది కల.

 అరవైఏళ్ల గోస. అందుకు ముందు అదే పరిస్ధితి. హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పాటైనా, కొద్ది రోజులకే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటై ఎదుర్కొన్న వివక్ష, నిర్లక్ష్యాలు తెలంగాణ సమాజం అనుభవించిందే. అందుకే ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు నుంచి పోరాటం మొదలైనా, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాతే అసలైన ఆత్మగౌరవం తెలంగాణలో వెల్లివిరిసింది. జై తెలంగాణ అన్న భావన ప్రతి గుండెను రగిలింపజేసింది. ప్రతి గొంతు జై తెలంగాణ అని నినదించింది. అప్పటి పాలకులను ప్రశ్నించింది. ఉద్యమం సాగింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో సాగిన ఉద్యమం పద్నాలుగేళ్లపాటు నిరంతరంగా సాగి, తెలంగాణ సాగించింది. అప్పటి నుంచి బిజేపి పార్టీ కుత్సిత రాజకీయాలు ఎలా వున్నాయో? నేటి తరానికి తెలియాల్సిన అవసరం వుంది. 1999లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజేపి పెద్దలు తెలంగాణపై విషం చిమ్మడం మొదలుపెట్టారు. అదేంటో 1998లో రాజమండ్రిలో జరిగిన బిజేపి జాతీయ సమావేశాలలో ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మాణం చేపట్టారు. ఆ తర్వాత కేంద్రంలో అధికారం కోసం తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశారు. నాడు చంద్రబాబుతో కలిసి కేంద్రంలో అధికారం పంచుకొని, రాజధాని హైదరాబాద్‌లోనే వుండగా, తెలంగాణ ఎందుకు అంటూ అప్పటి ఉపప్రదాని అద్వాని కొంచెపు వ్యాఖ్యలు చేసి బిజేపి నిజస్వరూపం ఇదే అని నిరూపించారు. అందుకే ఆది నుంచి తెలంగాణ ప్రజలు రెండు నాలుకల బిజేపిని నమ్మడానికి ఏనాడు ఇష్టపడ లేదు. ఆనాడు అద్వాని, నేడు ప్రధాని మోడీ తెలంగాణపై ఒకటే వైఖరి అనుసరిస్తూ వచ్చారు. సరే దేశంలో రెండుసార్లు ప్రజలు అధికారం ఇస్తే ప్రజలకేమైనా చేశారా? అదీ లేదు. నోట్ల రద్దు చేశారు. దేశంలో నల్లదనం పోకపోతే అడగండి అన్నారు. యాభై రోజుల్లో దేశంలో వచ్చే మార్పు గమనించండి. లేకంటే నన్ను శిక్షించండి? అంటూ సాక్ష్యాత్తు ప్రధాని మోడీ ప్రకటించారు. కాని ఏం జరిగింది. దేశ ఆర్ధిక వ్యవస్ధ అస్తవ్యస్తమైంది. దేశం కోలుకోలేని స్ధితికి నెట్టివేయబడిరది. జిడిపి అమాంతం పడిపోయింది. కాని మనం మెరుగైన స్ధాయిలో వున్నామంటూ ప్రజలను మభ్యపెట్టడంలో మాకంటే ఘనులెవ్వరూ లేరని బిజేపి పెద్దలు నిరూపించారు. దేశమంతాటా ఒకే పన్ను అన్నారు. జిఎస్టీ తెస్తున్నామన్నారు. అర్ధరాత్రి స్వాతంత్య్రం అన్నంత గొప్పగా జిఎస్టీ అమలుకు శ్రీకారంచుట్టారు. ఏమైంది? అంటే సమాధానం చెప్పడానికి ఏ బిజేపి నేతకు నోరు రాదు. దేశంలో ధరలు అమాంతం పెరిగి పోయాయి. సామాన్యుడు బతకలేని పరిస్ధితి వచ్చింది. పెట్రోలు ధరలు పెరిగాయని, రూ.400 వున్న సిలిండర్‌ ధర సామాన్యులు మోయలేరంటూ సుద్దులు చెప్పిన బిజేపి ఇప్పుడు ధరలు ఆకాశాన్నంటిస్తూ, దేశం కోసం, ధర్మం కోసమంటూ ప్రజలు పీల్చి పిప్పిచేస్తోంది. ఇలా ప్రజలను భాదిస్తూ, మరో వైపు ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తూ, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారు. మధ్య ప్రదేశ్‌ ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టారు. మహారాష్ట్రలో అదే చేశారు. కర్నాకటలో చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రాష్ట్రాలలో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా బిజేపి అధికారం సాగిస్తూ, డబుల్‌ ఇంజన్‌ సర్కారు అంటూ వింతపోకడను చూపిస్తోంది. 

కర్నాటక ఎన్నికల తర్వాత ఇక దక్షిణాదిలో పాగా వేయడం కష్టమని బిజేపి గ్రహించింది.

 అంతకు ముందు ఎగిరెగిరి పడి తెలంగాణలో రాజకీయ పబ్బం గడుపుకుందామని చూసింది. కాని కాలం గిర్రున తిరిగింది. కలగన్నంత సేపు కూడా బిజేపి సంతోషం నిలవలేదు. కర్నాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో పగటి కలలు వాస్తవంలోకి వచ్చాయి. దాంతో తెలంగాణలో మత రాజకీయాలు చోటు లేదు. బిజేపి బలానికి చోటు లేదు. తెలంగాణ రాజకీయాలను అస్ధిరపర్చే కుట్రకు తెరలేపినట్లుంది. అందుకే విద్యాసాగర్‌రావు అలాంటి వ్యాఖ్యలు చేసినట్లున్నారు. అంతే కాదు హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని చేయాలని రాజ్యాంగం రాసిన సందర్భంలో ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో చైనాతో యుద్దం చేయాల్సి వచ్చింది. అది అంబెద్కర్‌లో ఒక ఆలోచనకు కారణమైంది. 1955లో డాక్టర్‌. బాబాసాహేబ్‌ అంబెద్కర్‌ రాసిన దాట్స్‌ ఆన్‌ లివింగ్‌స్టిక్‌స్టేట్స్‌ అనే పుస్తకంలో 11 పేజీలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అంతేగాని దానిపై దేశంలో ఏనాడు చర్చ జరిగింది లేదు. అలాంటి చర్చ జరిగిన సందర్భాలు లేవు. కాకపోతే యుద్దాలు జరిగితే డిల్లీని టార్గెట్‌ చేసే శత్రుదేశాలకు రాజదాని కేంద్రం కొంత దూరం వుంటే బాగుంటుందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తం చేశారు. అంతే కాకుండా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య బలమైన బంధాలు ఏర్పడానికి దోహదపడొచ్చు అన్నది వ్యక్తం చేశారు. నాటి పరిస్ధితులు వేరు. నేటి పరిస్ధితులు వేరు. అప్పటి పరిస్ధితులను బేరీజు వేసుకొని అంబెద్కర్‌ చెప్పిన ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర విజభన సమయంలో కూడా ఇదే బిజేపి తెరమీదకు తెచ్చింది. అప్పుడే చిచ్చుపెట్టాలని చూసింది. అందులో భాగంగానే ఉమ్మడి రాజధాని, సెక్షన్‌ 8ని కూడా తీసుకొచ్చేందుకు దోహదపడ్డారు. 

 తెలంగాణ కోసం కోట్లాడిన చరిత్ర బిజేపికి లేదు.

 తెలంగాణ ప్రజల మనోభావాలు బిజేపికి అక్కర్లేదు. అదేంటో గాని తెలంగాణ బిజేపి నేతలకు కూడా తెలంగాణ ఆత్మగౌరవం అన్నదే లేదు. అసలు తెలంగాణ మీదే ప్రేమలేదు. అదే వుంటే ఇలా ప్రశాంతంగా వున్న తెలంగాణలో రాజకీయ కల్లోలం రేపేందుకు కుట్రలు చేయరు. ఇదీ బిజేపి అసలు రూపం… కుట్రల స్వరూపం. తెలంగాణ ప్రజలకు బిజేపి నైజం తెలుసు. అందుకే తెలంగాణలో బిజేపికి ఉనికి లేదు. ప్రజల్లో గుర్తింపులేదు. ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే నైతికత ఆ పార్టీకిఅసలే లేదు. ఇప్పటికైనా తెలంగాణ మీద ప్రేమను పెంచుకోండి. తెలంగాణ అభివృద్ధికి సహరించడం నేర్చుకోండి. పరాయి పాలనను తరిమి, స్వపరిపాలన తెచ్చుకొని ఆత్మగౌరవంతో తెలంగాణ తలెత్తుకొని నిలబడిరది. మళ్లీ కుంపటి రేపాలని చూస్తే ప్రజలు సహించరు. తగిన బుద్ది ప్రజలు చెబుతారు. గత ఎన్నికల్లోనే తెలంగాణలో అడ్రస్‌ లేకుండా చేశారు. అయినా బిజేపి మారలేదు. ఇప్పటికైనా మారకపోతే ఆ మాత్రం స్ధానం వుండదు. దక్షిణాది ప్రజలు ఎంతో చైతన్య వంతులు. వారిని మాయచేయాలని చూసి, కర్నాకటలో మూతి కాల్చుకున్నారు. ఇప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలోకి బిజేపిరావాలి.వాస్తవంలో నడవాలి. కుట్రలకు ఆపుకొని, అభివృద్ధి గురించి ఆలోచనలుచేయాలి.

తెలంగాణ రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసుకోనుందా..?

తెలంగాణలో కాంగ్రెస్ వైపుకి రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణులు మొదలు దళితులు, గిరిజనుల దాకా, మైనార్టీలతో సహా… అన్ని వర్గాల్లోనూ కాంగ్రెస్ కు ఓటర్ల బలంగా ఉన్నారు! ఇది మనకు స్వతంత్రం వచ్చిన నాటి నుంచీ నిరూపితం అవుతోన్నదే! అయితే, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అతి పెద్ద బలం రెడ్డి సామాజిక వర్గం. వాళ్లు మొదటి నుంచీ హస్తంతోనే కొనసాగుతున్నారు. ఇతర వర్గాల ధోరణి ఎలా ఉన్నా… ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు చేతి గుర్తుకే చేయెత్తి జైకొడుతున్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలోనూ రెడ్లు ఎప్పటిలాగే కాంగ్రెస్ ను ఆదరిస్తూ వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాస్త మార్పు కనిపించింది!
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ తెలంగాణ రెడ్డి సామాజిక వర్గాన్ని కొంత వరకూ అప్పట్లో ప్రభావితం చేసింది. కేసీఆర్ తో స్నేహం చేసిన జగన్ కారు గుర్తుకు ఓటు వేయాలంటూ పనిగట్టుకుని తెలంగాణలో ప్రచారం చేయించాడు. అనధికారికంగా వైసీపీ మీటింగులు పెట్టి కేసీఆర్ వైపుకు రెడ్డి ఓట్లను మళ్లించింది. అయితే, అయిదేళ్ల తరువాత ఇప్పుడు మరో మారు ఆ సామాజికవర్గం కాంగ్రెస్ వైపుకే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది!
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత కేఎల్ఆర్ అలియాస్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వడం.. ఇలా అనేక మంది రెడ్డి సామాజిక నేతలు, ప్రముఖులు హస్తంతో చేతులు కలుపుతున్నారు. ఎన్నికలు దగ్గరపడేకొద్ది టీ కాంగ్రెస్ లోకి మరింత మంది రెడ్డి  సామాజికవర్గం నేతలు వలససొచ్చే అవకాశాలున్నాయని బలమైన టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ సీఎం కూర్చీపై ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే, తెలంగాణలో ఆర్థిక, రాజకీయ పలుకుబడిలో రెడ్లదే మొదటి స్థానం. అలాగే, ఓటర్లుగా కూడా రెడ్డి కులస్థులు గణనీయంగా ఉంటారు. ఏక కాలంలో… అటు రెడ్డి నేతలు, ఇటు రెడ్డి ఓటర్లు… కాంగ్రెస్ కు జైకొడితే… కర్ణాటక తరువాత దక్షిణాదిలో మరో రాష్ట్రం హస్తం వశం కాకుండా… ఎవరూ ఆపలేరంటున్నారు రాజకీయ పండితులు!

జల జీవం..జన జీవనం కేసీఆర్‌

` రైతు క్షేమ వరదాత కేసిఆర్‌.

` కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో అభివృద్ధిని వివరిస్తూ, విశ్లేషిస్తూ చెప్పిన అంశాలు..ఆయన మాటల్లోనే…

` తెలంగాణ సాధక కేసిఆర్‌.

`తెలంగాణ విధాత కేసిఆర్‌.

`ప్రగతి ప్రధాత కేసిఆర్‌.

` బంగారు తెలంగాణ సృష్టి కర్త కేసిఆర్‌.

`అద్భుతమైన నిర్మాణాల కాణాచి తెలంగాణ.

`అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న మన తెలంగాణ.

` రైతు కలలు నెరవేర్చిన కాళేశ్వరం..

` తెలంగాణలో కొత్త రూపుతో యాదాద్రి దివ్య క్షేత్రం.

` పాలనాపరమైన సరికొత్త నిర్మాణం సచివాలయం.

` వంతెనల్లో అద్భుతమైన వారధి కేబుల్‌ బ్రిడ్జి

` మొహంజాహీ మార్కెట్‌ కు మరింత శోభ.

` పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ బిల్డింగ్‌ అద్భుతం.

` దేశానికే తెలంగాణ రోల్‌ మోడల్‌.

` నిర్మాణాలైనా, సంక్షేమాలైనా తెలంగాణే ఫస్ట్‌.

` దేశంలో కేసిఆర్‌ పాలనే బెస్ట్‌.

` తెలంగాణలో బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌.

`దేశంలో అనేక రాష్ట్రాలలో అప్‌ కమింగ్‌.

నా ప్రజలను నేనెప్పుడూ ఇరుముడిలా నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నా..

` ప్రజల కష్టాలు తీర్చిన..

`కన్నీళ్ళు తుడిచినా..

`అందుకే ప్రజల గుండెల్లో వున్న…

`తాగు నీరు అందించిన..

` చెరువులు బాగు చేయించిన,

` రోడ్లేయించిన…

` నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేసిన..

`ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చిన..

` విద్య, వైద్య సదుపాయాలు కల్పించిన

`జిల్లాకు మెడికల్‌ కాలేజీ సాధించిన

`నాకు ఎదురులేదు..పోటీ అసలే లేదు.

` నా సేవ మీద నా ప్రజలకు విశ్వాసం వుంది.

హైదరబాద్‌,నేటిధాత్రి:  

జలమే జీవం..జీవనం. ఆ ప్రదాతే దైవం. తెలంగాణ పాలిట కేసిఆర్‌ ప్రదాత అందించిన జలజీవం..తెలంగాణకు జీవన వేదం. ..తెలంగాణ సస్యశ్యామలం..పసిడి వన్నెలద్దిన పల్లెకు జీవితం. తెలంగాణకు పచ్చని కాంతులు తెచ్చిన కేసిఆరే ఆరాధ్యం. ఏ నీటి చుక్క కోసం తెలంగాణ తల్లిడిల్లిందో ఆ నీటి జలదాధను తెలంగాణకు మళ్లించిన వరదాత తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ స్వాప్నికుడు, ఉద్యమ వీరుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. చుక్క నీరిచ్చేందుకు కూడా వీలు లేదు..సాధ్యం కాదు.. సాగు కోసం తెలుగు సంపద ఖర్చు చేయలేం…ఎత్తిపోతలు చేపట్టలేమంటూ తెలంగాణ జీవితాలను ఎగతాలి చేసి చిద్రం చేసిన పరాయి పాలన నుంచి విముక్తి ప్రసాధించిన ముక్తి ప్రదాత కేసిఆర్‌. అంటున్న కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒక సంచలనం. ప్రపంచంలో ఇంతటి వేగవంతమైన ప్రగతిని అందించిన పాలకుడు మవరెవరూ లేరు. అది కేసిఆర్‌తోనే సాధ్యమైందంటూ, ఆ విశేషాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే…

                         తెలంగాణ సాధించి ఎండిన చెరువుల బాగు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి, తెలంగాణ చుట్టూ రిజర్వాయర్లును చేపట్టి ఏక కాలంలో అటు ఎండిన బీళ్లకు, ఇటు తడారిన గొంతులను తడిపిన అపర భగీరధుడు కేసిఆర్‌. ఏక కాలంలో రెండు చేతులతో యుద్దాలు చేసిన అర్జునుడు ఎలా సవ్యసాచి అన్నారో…ఏక కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టి, సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన కేసిఆర్‌ కంటే గొప్ప విలుకాడు…ప్రకృతిని విల్లును చేసి, తెలంగాణ సమస్యలపై పోరాటం చేసి, విజయం సాధించిన విజయుడు కేసిఆర్‌. సాగు పలాలు, నీటి సంపదలు, విద్యుత్‌ వెలుగులు, సంక్షేమ కాంతులు అందించిన అభినవ సవ్యసాచి కేసిఆర్‌. తెలంగాణ సాధనతో, అతి తక్కువ కాలంలో తెలంగాణ రూపు రేఖలు మార్చిన కేసిఆర్‌ లాంటి గొప్ప దార్శనికుడు చరిత్రలో లేడు. భవిస్యత్తులో రాడు.

మోడు వారిన జీవితాలకు భరోసా కల్పించి, తెలంగాణ తెచ్చుకున్న జీవితాలకు వెలుగులు నింపి, వయసు పైబడిన వారికి ఆర్ధిక భరోసా కల్పించి, ఆసరా అందిస్తున్న తెలంగాణ పెద్ద కొడుకు కేసిఆర్‌. ఈ రోజు తెలంగాణలోని కుటుంబాలన్నీ చల్లగా వున్నాయంటే, ఆ కుటుంబల్లో కలతలు లేని సంసారాలు సాగుతున్నాయంటే, ముదిమి వయసు తల్లిదండ్రులకు వేళకు ముద్ద, తగిన గౌరవం దక్కుతున్నాయంటే కారణం కేసిఆర్‌ అందిస్తున్న ఆసరా ఫించన్లే…ఆ భరోసానే…దివ్యాంగుల జీవితాలకు ఓ దారి చూపి వారికి ఫించన్‌ను తెలంగాణ వచ్చాక రెండు వేలు, తర్వాత మూడు వేలు. ఇప్పుడు మరో వెయ్యి పెంచిన నాలుగువేలపదహార్లు ఇస్తున్న దేవుడు కేసిఆర్‌. పేదింటి పెళ్లికి పెద్దగా, కళ్యాణలక్ష్మి, షాదీ ముభారక్‌లతో ఆర్ధిక సాయం అందించి పెళ్లిచేస్తూ దీవిస్తున్న పెద్దన్న కేసిఆర్‌. కుల మతాల తేడా లేకుండా, పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి తెచ్చిన కళ్యాణ రాముడు కేసిఆర్‌. ఆ ఆడ పిల్ల తల్లిగా మారే క్షణం కడుపులో బిడ్డ పురుడు పోసుకున్న నుంచి బిడ్డ ప్రసవంతో ప్రపంచాన్ని చూసే వరకు ఆ బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు కేసిఆర్‌ న్యూట్రీషన్‌ కిట్‌, కేసిర్‌ కిట్‌ల పేరుతో తల్లీబిడ్డల ఆరోగ్య సంక్షేమం కేసిఆర్‌ రామరాజ్య పాలనకు నిదర్శనం. తెలంగాణ సాధించి దశాబ్ధ కాలం గడుస్తున్న వేళ ఇంత తక్కువ సమయంలో సాధించిన విజయాలు నభూతో నభవిష్యతి. తెలంగాన చిమ్మచీకట్లలో మగ్గిపోతూ, కరంటు మీద ఆధారపడి సాగే సాగుకు కరంటు లేక అల్లాడిన రోజులవి. ఆకాశంలో మబ్బు వైపు చూసి, చినుకు చుక్కను నమ్మిన విత్తు పండిరది లేదు. రైతు సంతోషపడిరది లేదు. కళ్లనిండా పంటను చూసింది లేదు. కరంటు అందక, బావులు, బోర్లు ఎండిపోయి ఎండిన పంటలను జీవితాలను దహిస్తున్నా, సాగు వదులుకోలేక రైతు విలవిలలాడిన నాటి శాపగ్రస్త తెలంగాణకు విముక్తి ప్రసాదించిన ముక్తి ప్రదాత కేసిఆర్‌. తెచ్చిన తెలంగాణకు కావాల్సినన్ని నీళ్లు తెచ్చాడు. తెలంగాణ అంతా నీటి గంగాళం చేశాడు. ఎక్కడ చూసినా నీటి పరవళ్లు తాండవించేలా కాలువల పరవళ్లు చూపించాడు. ఎటు చూసినా తెలంగాణ పచ్చని మాగాణం చేశాడు.

                         చినుకు పడిన వేళ రైతు చిన్న బోయి కూర్చోకుండా, ఎవరి ముందు చేయి చాచి అప్పు కోసం ఎదురు చూడకుండా, అఫ్పుల పాలు కాకుండా, రైతు బంధుతో ఆదుకుంటున్న తెలంగాణ పెద్ద రైతు అభినవ బాంధవుడు కేసిఆర్‌. కాలం వక్రీకరిస్తే రైతు భీమాతో ఆదుకుంటున్న ఆపద్భాందవుడు కేసిఆర్‌. ఎన్ని ఎకరాలు వున్నా, బుక్కెడు బువ్వకోసం ఏడ్చిన తెలంగాణ రైతుకు కన్నీటిని తూడ్చి ఆనందాన్ని పంచాడు. నీటిని, కరంటును ఇచ్చి సాగును పండగ చేశాడు. తెలంగాణ రైతులో సంతోషం నింపాడు. ఆనందాన్ని పంచిపెట్టాడు. వలసలు పోయిన వారిని తిరిగి తెలంగాణ పల్లెలకు రప్పించి సంపద సృష్టికర్తలను చేశాడు. తెలంగాణ పల్లెలను పరిపుష్టం చేశాడు. సంపద కేంద్రాలను చేశాడు. రైతులను రాజును చేశాడు. పల్లెలు వెలిగిపోయేలా సౌకర్యాలు కల్పించాడు. పల్లె ప్రగతితో పచ్చదనం, పట్టణ ప్రగతితో అభివృద్ది వేగవంతం చేశాడు. ఎక్కడిక్కడ తెలంగాణను అభివృద్ది కేంద్రం చేశాడు. విద్యా వ్యవస్ధలో నూతన ఒరవడిక శ్రీకారం చుట్టాడు. గురుకులాలను ఏర్పాటు చేసి, పేదలకు విద్యను మరింత చేరువ చేశాడు. చదువుకోలేని పేదలందరికీ విద్యను అందుకునేందుకు ఆశ్రయం కల్పించాడు. విద్య అందరి సొత్తు అన్నది నిజం చేస్తున్న విద్యావేత్త కేసిఆర్‌. ఆరోగ్య తెలంగాణ నిర్మాణం చేపడుతున్నాడు. తెలంగాణలో ఆరోగ్య విప్లవం సృష్టిసున్నాడు. పేదలందరికీ ఉచితంగా అతి ఖరీదైన వైద్యం అందేలా చేస్తున్న తెలంగాణ ధన్వంతరి కేసిఆర్‌. ఇలా చెప్పుకుంటూ పోతే కేసిఆర్‌ చేసిన అభివృద్దికి కొల మానం లేదు. సమయం చాలదు. 

ఆ ఆదర్శమూర్తి కేసిఆర్‌ పాలనలో కామారెడ్డిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నాను. నన్ను నమ్మి గెలిపిస్తూ వస్తున్న ప్రజలను అయ్యప్ప స్వామి ఇరుముడిని నెత్తిన పెట్టుకున్నట్లు పెట్టుకొని చూసుకుంటున్నాను. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా కామారెడ్డిని కూడా బంగారు తనకను చేస్తున్నాను. కేసిఆర్‌ ఆశీస్సులతో ప్రజల కష్టాలు అనేకం తీర్చాను. కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. చెరువులు దగ్గరుండి అభివృద్ధి చేయించాను. ఊళ్లను సస్యశ్యామలం చేయించాను. అందుకే కామారెడ్డి ప్రజల గుండెల్లో నేనే వున్నాను. ఒకనాడుకు సాగుకు కన్నీరొలికిన కామారెడ్డికి నీటిని తెచ్చి సాగు విప్లవం తెచ్చాను. ప్రతి రైతు కళ్లలో ఆనందం నింపాను. ఇంటింటికీ మిషన్‌ భగీరధ ద్వారా మంచినీళ్లు అందించాను. తెలంగాణలో ఏ నియోజకవర్గంలో కనిపించని డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి, గూడు లేని పేదలకు అందించాను. మోడల్‌ గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాను. చెరువులు బాగు చేయించి, నియోకవర్గంలో వున్న సమారు చెరువులకు పూర్వ కళ తెచ్చాను. ఇటీవల చెరువుల పండగను ఘనంగా జరుపుకున్నాము. ప్రతి పల్లెకు రోడ్లు వేయించాను. ప్రతి పల్లెలలో సిసి రోడ్లు వేయించాను. ప్రతి పల్లెను అనుసంధానం చేస్తూ తళతళ లాడే రోడ్లు నిర్మాణం చేయించాను. కామారెడ్డి పట్టణానికే కొత్త కళ తెచ్చాను. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశాను. ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చాను. కామారెడ్డిని విద్యా కేంద్రం చేశాను. ఆధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చాను. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కోరి కామారెడ్డి జిల్లా సాధించాను. కామారెడ్డి జిల్లాకు మెడికల్‌ కాలేజీ తెప్పించాను. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందుకు రూ.50 కోట్లు ప్రకటించారు. కామారెడ్డిని అభివృద్దికి కేరాఫ్‌ చేశాను. నాకు ప్రజల మీద విశ్వాసం..వారికి నాపై వున్న నమ్మకమే మళ్లీ నన్ను గెలిపిస్తుంది. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ సాధిస్తుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో కామారెడ్డికి మరిన్ని అందాలు అద్దుతాను.

KLR focus on Malkajigiri : మల్కాజిగిరిపై కేఎల్ఆర్ దృష్టి… మంత్రులపై ఫోకస్‌!

 

కాంగ్రెస్ పార్టీ కీలక నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాంత వాసులకి అత్యంత సుపరిచితులైన మన డైనమిక్ లీడర్. ప్ర‌స్తుతం ఆయ‌న‌ హై కమాండ్ ఆదేశాలతో ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఏక కాలంలో కేసీఆర్ క్యాబినెట్‌లోని ఇద్ద‌రు మంత్రులు, ఒక మాజీ మంత్రి నియోజకవర్గాలపై గురి పెట్టారు. ఈ మూడింట్లో ఏదొక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వలస వెళ్లిన సబితా ఇంద్రా రెడ్డి ప్రస్తుతం మహేశ్వరం ప్రాంతంలో సెగ్మెంట్‌లోని ఆమె ప‌నితీరు, లోటు పాట్లపై కేఎల్ఆర్ దృష్టి సారించారు. మంత్రిగా కూడా అధికారం వెలగబెడుతోన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు చేసిందేమీ లేదని తెలుస్తోంది. అలాగే, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మరో మంత్రి మల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంపై కూడా ఫోకస్ చేస్తున్నారు. మేడ్చల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన రేయింబవళ్లూ సీఎం కేసీఆర్, కేటీఆర్ భజనలో తరిస్తుంటారు. జనానికి చేసిన మేలు మాత్రం అంతంతమాత్రమే. రానున్న ఎన్నికల్లో కేఎల్ఆర్‌ను మేడ్చల్ నుంచి కూడా అధిష్టానం బరిలో దింపవచ్చట.

ఇక తాండూరులో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కిచ్చన్నగారి లక్ష్మారెట్టి ఢీకొట్టే అవకాశం ఉంది. మాజీ మంత్రిపై ఉన్న వ్య‌తిరేకత‌తో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి పైలెట్ రోహిత్ రెడ్డిని ప్ర‌జ‌లు గెలిపించారు. అయితే, ఆప‌రేష‌న్ ఆకర్ష్‌లో భాగంగా రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడ‌డంతో పార్టీ క్యాడెర్‌, ప్ర‌జ‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఒక‌వేళ కేఎల్ఆర్ ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దిగితే కేసీఆర్ టీమ్‌లోని బలమైన నేతగా ఉన్న మహేందర్ రెడ్డికి క‌ష్ట‌కాలం త‌ప్ప‌దని వినికిడి. మొత్తానికి ఈ మూడు స్థానాల్లో కేఎల్ఆర్ ఎక్క‌డ నుంచి బ‌రిలోకి దిగిన‌ కాంగ్రెస్‌కు ఒక సీటు కన్ ఫర్మ్ అని తెలుస్తోంది.

డోలారోహన కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వధించిన – నారబోయిన రవి ముదిరాజ్

 

మునుగోడు – చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లి వాస్తవ్యులు చింతల రాజు – అశ్విని గార్ల కూతురు డోలారోహన కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వధించిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారు.*

 

ఈ కార్యక్రమంలో మునుగోడు మండల వైస్ ఎంపీపీ అనంత స్వామి గౌడ్ గారు, బొల్లమోని శ్రీకాంత్ గారు, బండి చంటి గారు, బండి రాజు గారు, బిఆర్ఎస్ పార్టీ మునుగోడు మండలం ఆర్గనైజింగ్ సెక్రటరీ జెట్టి గణేష్ ముదిరాజ్ గారు, బిఆర్ఎస్ పార్టీ మునుగోడు పట్టణ సీనియర్ నాయకులు బండారు మల్లేష్ గారు, మరియు తదితరులు పాల్గొన్నారు.

నిజం..ఇజం..నేటిధాత్రి నైజం.

`నేటిధాత్రి అక్షరం నిజం పరిధి దాటలేదు.

`అబద్దాలు మోయలేదు..

` ఎవరికీ లొంగిపోలేదు.

`ఎంతటి వారైనా సరే తూర్పారపట్టకుండా వుండలేదు.

` మంచిని మంచిగానే చెబుతుంది.

`తప్పు చేస్తే చీల్చి చెండాడుతుంది.

` 19 ఏళ్లలలో ఆగింది లేదు..అలసట లేదు..

`తొందరపాటుకు గురికాలేదు..తొట్రుపాటు అసలేదు.

` నిజానికి నిజరూపం… నిజాయితీకి నిలువెత్తు అక్షరం.

` నిందలకు వెరవలేదు…నీతి మాలిన వాళ్లను వదలలేదు.

`కేసులకు భయపడలేదు.. అదిరింపులకు బెదరిపోలేదు.

` తప్పు చేస్తే అధికార పార్టీ నాయకులను ఏనాడు వెనకేసుకురాలేదు.

`ఎంతటి పలుకుబడి నేతలనైనా నిలదీయకుండా ఊరుకోలేదు.

` సూచనలిచ్చే చోట నచ్చచెప్పాం.

`ఎత్తి చూపే చోట హితవు పలికాం.

`వినకపోతే భవిష్యత్తు కూడా కళ్లకు కట్టినట్టు చెప్పాం.

` ఇప్పుడు రాజకీయంగా సతమతమౌతున్న వాళ్లకు ఎన్నో సలహాలిచ్చాం.

`నాడు నేటిధాత్రి చెప్పినా వినకపోతిమి అని మధనపడేవాళ్లను చూస్తున్నాం.

`అదీ నేటిధాత్రి అక్షరలెక్క..ఆచరించేవారికి ఎదురేదీ వుండదింక.

`అటు రాజకీయం.. ఇటు ప్రజాభిప్రాయం..భవిష్యత్తు కాలం.

` నేటిధాత్రి అక్షరంలో నిండిన వర్తమానం.

`డిప్యాక్‌ తోడుగా, నేటిధాత్రి అడుగుగా సాగుతున్న ఎదురులేని అక్షర ప్రయాణం.

`మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ముందే చెప్పింది నేటిధాత్రి.

` కర్ణాటక ఎన్నికల ఫలితాలు లెక్కలతో సహా ఖచ్చిత ఫలితమిచ్చింది.

`ఏ సర్వే సంస్థకు అందని లెక్కను కూడా పర్ఫెక్ట్‌ గా నేటిధాత్రి మాత్రమే చెప్పింది.

` ప్రజాభిప్రాయాన్ని సేకరించడంలో డి ప్యాక్‌ స్టైలే వేరని నిరూపించింది.

`సర్వే లలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

`అంచనా లెక్కలు కాదు…అసలు సిసలు లెక్కలు చెప్పడం నేటిధాత్రి కే సాధ్యమౌతుంది.

 

హైదరబాద్‌,నేటిధాత్రి:               

అక్షరం తల్చుకుంటే ఆగేదేముంటుంది? చైతన్యం విచ్చుకుంటే ఎదురేముంటుంది? పోరాటం తల్చుకుంటే ఏదురేమి నిలుస్తుంది? ఉద్యమ ఉప్పొంగితే తట్టుకునే శక్తి ఎవరికుంటుంది? అన్నింటికీ అక్షరం బాసటగా నిలిస్తే విజయాలుకు అడ్డేముంటుంది? ఎదురీతకు నిలిచే ధైర్యం ఎవరికి వుంటుంది? అదీ అక్షరం గొప్పదనం. ఎందుకంటే నేటి ధాత్రి నిప్పు కణం. అగ్ని రణం. నేటిదాత్రి నిజాల దావానలం. మంచి చేస్తే వెలుగు పంచుతుంది. తప్పు చేస్తే దహించి వేస్తుంది. నిజం పరిధిని ఏనాడు నేటిధాత్రి దాటే ప్రయత్నం చేయలేదు. చేయదు కూడా. అబద్దాన్ని ఏనాడు మోయదు. దాన్ని దరి చేరనివ్వదు. కొందరు నేటిధాత్రి గురించి తెలిసీ తెలియక కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే నేటిధాత్రి మీద నిందల రంగులు పూయాలనుకుంటున్నారు. నిజం గడప దాటే లోపు అబద్దం ఊరు చుట్టి వస్తుందని సామెత. అలాగే నేటిధాత్రి ఏ ఒక్కరికో వంత పాడుతున్నట్లుగా, ఎవరి మేలు కోసమో పనిచేస్తున్నట్లు కొందరు అభిప్రాయ పడుతున్నారు. నేటిధాత్రిని పూర్తిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు. అందుకే నేటిధాత్రి అంటే ఏమిటో చెప్పాల్సిన అవసరం మా పాఠకులకు చెప్పాలని అనుకుంటున్నాం. గత పందొమ్మిది సంవత్సరాలుగా నేటిధాత్రిని ఆదరిస్తున్నా, చూస్తున్న వారిని నేటిధాత్రి నైతిక విలువల గురించి పూర్తిగా తెలుసు. కాని కొత్త తరం పాఠకులకు చెప్పాల్సిన అవసరం వుందని గుర్తించి చెబుతున్నాం. నేటిధాత్రి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఏనాడు జంకలేదు. ఆలోచించలేదు. సమాజానికి మంచి జరుగుతుందనుకునే విషయాన్ని చెప్పకుండా ఊరుకోలేదు. సమాజానికి నష్టం అనుకున్న విషయాన్ని వెల్లడిరచకుండా ఆపలేదు. ఎందుకంటే ఎప్పుడూ, ఎట్టిపరిస్ధితుల్లోనూ నేటిధాత్రి అబద్దాన్ని మోయదు. దాన్ని దరి చేరనివ్వదు. ఇది మాత్రం నేటిధాత్రిని ఆదరించే పాఠకులకు చెప్పాలని అనుకున్నాం. 

నేటిధాత్రిపై పందొమ్మిది సంవత్సరాల సుథీర్ఘ ప్రయాణంలో బెదిరించాలని చూసిన వారున్నారు. భయపెట్టిన వారున్నారు. అదిరించాలని చూసి, దాడులకు దిగిన వారున్నారు. కార్యాలయం మీదకు వచ్చి ద్వంసం చేసే ప్రయత్నం చేసిన వారున్నారు. 

నేటిధాత్రి అక్షరాలు జీర్ణించుకోలేని అవినీతి పరులు, కబ్జాదారులు, అన్యాయాలు చేసేవారు మా సిబ్బందిపై పగలు, ప్రతీకారాలు పెంచుకున్న వారున్నారు. ఆఖరుకు నేటిదాత్రి ఎడిటర్‌నైన నాపైనే దొంగ దెబ్బ తీసే కుట్ర కూడా పన్నారు. అందులో ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా ఏదీ లేదు. నేటిధాత్రి చెప్పే నిజాలు నచ్చని వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే బెదిరించే ప్రయత్నం చేసినవారే…కేసులు నమోదు చేసిన వారే..అయినా నేటిదాత్రి అక్షరం జంకలేదు. మరింత అక్షరాలకు పదును పెంచుకున్నదే…కాని వణికిపోయింది లేదు. అక్షరం పారిపోయింది లేదు. ఎంతటి వారైనా సరే తప్పు చేస్తే తూర్పారపట్టకుండా వదిలేసింది లేదు. సమాజానికి మేలు చేసే వరకే ఎవరైనా? ఏ విషయంలోనైనా తప్పు అనిపిస్తే చాలు వారిని అక్షరాలతో కడగడం నేటిధాత్రి చేసే యజ్ఞం. అది దాదాపు అనేకమంది నాయకులకు తెలుసు. ఎందుకంటే మంచిని మంచిగానే నేటిదాత్రి విశ్లేషిస్తుంది. అవసరమైతే శబాష్‌ అని ముందుకు నడవాలని సూచిస్తుంది. తప్పు చేసిన వారిని చీల్చి చెండాడుతుంది. అందుకే ఈ పందొమ్మిదేళ్ల నేటిధాత్రి ప్రయాణంలో అలసట లేదు. అలుపు లేదు. అక్షరానికి విరామం లేదు. అక్షరం ఆపింది లేదు. కష్టానికి వెరవలేదు. సుఖానికి మురిసిపోలేదు. నేటిధాత్రికున్న పాఠకుల ఆదరణ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అదే మా నిబద్దత. నేటిధాత్రి తొందరపాటుకు గురైన సందర్భం లేదు. తొట్రపాటుకు గురైన సమయం లేదు. ఏదైనా ఒకటికి పది సార్లు ఆలోచించే అక్షరాన్ని రచిస్తాం. అచ్చువేస్తాం. ఎవరి మీద నిరాధారమైన ఆరోపణలు రాయం. అందుకే నేటిదాత్రిని నిజానికి నిజరూపం, నిజాయితీకి నిలువెత్తురూపం అని కొనియాడుతుంటారు. నేటిధాత్రి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పత్రిక. పద్నాలుగేళ్లపాటు తెలంగాణ కోసం నిరంతరం అక్షర యజ్ఞం చేసిన పత్రిక. ఆనాడు పత్రిక నిర్వహణ అంటే ఎంత కష్టమో తెలిస్తే, ఇప్పుడు నేటిధాత్రి మీద జోకులు ఎవరూ వేయరు. తెలంగాణ కోసం ఆస్ధులు తాకట్టుపెట్టి, చివరకు ఆ అప్పులు తీరక అమ్ముకొని నిలబడిరదే నేటిధాత్రి. కాని ఏనాడు అక్షరం ఆగలేదు. సమాజంకోసం, సమాజ హితం కోసం, తెలంగాణ కోసం, వచ్చిన తెలంగాణ అభివృద్ధి భాగాస్వామ్యం కోసమే నేటిధాత్రి సాగుతోంది.

తెలంగాణ వచ్చిన తర్వాత కోటి ఆశలుంటాయి. వాటిని కూడా ప్రజలు అర్ధం చేసుకోవాలి.

 ఒక కుటుంబం వేరుపడితేనే కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాంటిది తెలంగాణ వచ్చిన మరునాడే కోరికలు తీరాలన్న ఆశలు చాలా మందిలో వుంటాయి. తెలంగాణ ప్రజల ఆశలు తీరాలనే తెలంగాణ ఉద్యమం జరిగింది. అన్నీ చక్కదిద్దుకునే క్రమంలో కొంత ఆలస్యమౌతుంది. కాని తెలంగాణలో అలాంటి పరిస్ధితి కూడా ఎదురుకాలేదు. అదే నేటిధాత్రి చెప్పేది. కాని దాన్నికొందరు వక్రీకరించి నేటిధాత్రిపై అవాకులు చెవాకులు పేలినవారున్నారు. అది తప్పు. నేటిధాత్రి కూడా ప్రభుత్వంలో కీలకభాగస్వాములైన కొందరు చేసే తప్పులను కూడా ఎండగట్టిన సందర్భాలు అనేకం వున్నాయి. తెలంగాణ కోసం పద్నాలుగేళ్లు కొట్లాడి, తెలంగాణ తెచ్చుకొని, నవ్వే వాడి ముందు పడిపోకూడదనే నేటిధాత్రి ఎప్పుడూ కోరుకునేది. అందుకే మా దారి ఎవరి కోసం మార్చుకోలేదు. ఎవరికీ మేం భజన చేయం. సూచనలు ఇవ్వాల్సిన చోట ఇస్తాం. ఎత్తి చూపాల్సిన చోట ఎత్తి చూపుతాం. హితవు చెప్పాల్సిన అవసరం వుంటే చెబతాం. వినకపోతే కూడా వారి రాజకీయ భవిష్యత్తు ఎలా వుంటుందో కూడా ముందు విశ్లేషించి కళ్లకు కట్టినట్లు చెబుతాం. అయినా వినక, ఇప్పుడు బాదపడుతున్నవారు ఎందరో…ఆనాడు నేటిధాత్రి చెప్పినా వినకపోవడం వల్లనే ఈ పరిస్ధితి వచ్చిందని చెబుతున్నవాళ్లను చూస్తున్నాం. 

               పోరాడితే పోయేదేమీ లేదు..అన్న సిద్దాంతాన్ని నమ్ముకొని తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యాం. తెలంగాణ సాధనలో మేము తురుపుముక్కలయ్యాం. మా అక్షర విజయం తెలంగాణ అని గర్వంగాచెప్పుకుంటాం. అలాగే రాజకీయ భవిష్యత్తును కూడా ఎప్పటికప్పుడు విశ్లేషించడంతో డిప్యాక్‌ సంస్ధతో కలసి, నేటిధాత్రి అందిచించిన సర్వేలు ఎక్కడా పొల్లుపోలేదు. గతం గురించి కన్నా, తాజాగా వర్తమానంలో మునుగోడు ఉప ఎన్నికలపై ఖచ్చితమైన లెక్క చెప్పింది ఒక్క నేటిధాత్రి మాత్రమే. ఇక కర్నాటక ఎన్నికల సమయంలో నేటిధాత్రి సంచలనం సృష్టించింది. గతంలోనే కాదు, ఇటీవల కాలంలో కూడా ఏ సర్వే సంస్ధ చెప్పనంత ఖచ్చితమైన లెక్కను చెప్పి నేటిదాత్రి సరికొత్త సర్వేలకు తెరతీసింది. కర్నాటకలో కాంగ్రెస్‌, బిజేపి, జేడిఎస్‌లు ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై అన్ని పార్టీలకు ఒక్కసీటు కూడా అటు, ఇటూ కాకుండా చెప్పిన ఏకైక సంస్ధ డీప్యాక్‌. బొంబాయి కేంద్రంగా మొదలైన డీ ప్యాక్‌ సర్వేలు నేటిదాత్రితో కలిసి సాగించిన అన్ని సర్వేలు ఒక సంచలనమే అని చెప్పకతప్పదు. అదీ నేటిధాత్రి నిబద్దత. అలాంటి నేటిదాత్రి ఎప్పుడూ నిజాలే చెబుతుంది. ప్రజా శ్రేయస్సే కోరుకుంటుంది. అది పాఠకులు తెలుసుకుంటే చాలు… మీ అందరికీ శనార్దులు.

భట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరు ప్రత్యేకంగా ఫోన్ చేశారో తెలుసా?

mallu bhatti vikramarka with rahul gandhi
తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేని దుర్దినాలు… అప్పట్లో చంద్రబాబు పాలనలో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచక పాలన, కరువుతో అల్లాడిపోయేది. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నీటి చుక్క లేక జనం అల్లాడుతూ… కన్నీటి చుక్కలతోనే… తమ దాహం తీర్చుకునేటంతటి దుస్థితి! అదుగో అప్పుడు బయలుదేరాడు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి!
తన మనస్సుల్లాడే స్వచ్ఛమైన తెల్లటి పంచె, దానిపైన సంప్రదాయబద్ధమైన లాల్చీ, నెత్తిన రైతుల్ని తలపించే పాగా, కాళ్లకి స్పోర్ట్స్ షూసు… ఈ రూపం ఎక్కడ కనిపించిన మనకు పెద్దాయనే గుర్తుకు వస్తారు. అటువంటి సందర్భమే మరోసారి వచ్చింది తెలంగాణ నేలపై. అప్పుడు చంద్రబాబు లాగే ఇప్పుడు కేసీఆర్ అరాచక పాలన సాగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న తెలంగాణ ప్రజానీకానికి తొమ్మిదేళ్లుగా కన్నీళ్లే మిగిలాయి. వారి చెమర్చిన కళ్లు తుడవటానికే మనందరి జన నేత భట్టి విక్రమార్క పట్టుబట్టి బయలుదేరారు. వేయి కిలో మీటర్లు దాటి వంద రోజుల మైలు రాయిని త్వరలో చేరుకోబోతున్నారు!
ఆనాటి రాజశేఖర్ రెడ్డి లాగే ఇంటి నుంచీ బయలుదేరి నిర్విరామంగా జనం మధ్య గడుపుతోన్న భట్టికి జూన్ 15న ఆయన బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ కాల్ వచ్చింది! అది మరెవరి నుంచో కాదు… ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన సోనియమ్మ తనయుడు దిల్లీ నుంచీ ఫోన్ చేశారు! భట్టికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. గల్లీ నుంచీ దిల్లీ దాకా చర్చగా మారిన పీపుల్స్ మార్చ్… రాహుల్ ను కూడా ఆకర్షించింది. జనం కోసం జన నేత భ్టటి విక్రమార్క చేస్తోన్న పోరాటం ఆయన చేత ఫోన్ చేయించింది. తెలంగాణలో సామాన్య జనం బాగోగుల గురించి ఆరా తీయించింది! ప్రజల కోసం ఆరాటపడుతోన్న నాయకుడికి అండగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉంటుందని ఆయన అన్నట్లు సమాచారం. మొత్తంగా భట్టి పాదయాత్ర ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది! రాహుల్ నుంచీ ఫోన్ రావటంతో భట్టి విక్రమార్క మరింత ధృఢ సంకల్పంతో ఇక పై ముందుకు దూసుకుపోనున్నారు…

నిండైన గుణం..మేలైన నాయకత్వం.

`నారబోయిన రవిలో వుంది అసలైన సేవా గుణం.

`అందుకే ఆయనంటే అందరికీ ఇష్టం.

` పేదల బాధలు తెలిసిన నాయకుడు.

` వారి బాధలు పంచుకునే ఆత్మీయుడు.

` మునుగోడులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు తలుపుతట్టేది రవి ఇంటినే…

` బిఆర్‌ఎస్‌ లో రవి బలమైన బిసి నాయకుడు.

`మంత్రి జగదీష్‌ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు.

` జిల్లాలో మంత్రికి అనుంగు అనుచరుడు.

` ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండే నాయకుడు.

`మునుగోడు అభివృద్ధి కోసం అహర్నిశలు తపించే నాయకుడు.

` మునుగోడు ప్రగతి కోసం నిర్విరామ కృషి చేస్తున్న నాయకుడు.

`ప్రజల మనసెరిగిన నేత.

` భవిష్యత్తు మునుగోడు ప్రజానేత.

` బిఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కనున్న బిసి నేత.

` రవికే అన్ని వర్గాల చేయూత..

` సమస్యలు లేని మునుగోడు నిర్మాణమే రవి కల.

`అన్ని రంగాలలో మునుగోడు అభివృద్ధి జరగాలనేదే రవి ఆకాంక్ష.

హైదరబాద్‌,నేటిధాత్రి:  

మన సమాజంలో మాటలు చెప్పే నాయకులు చాలా మంది వుంటారు. సేవ అనగానే దూరం పారిపోయేవారు కూడా వుంటారు. కేవలం రాజకీయాల కోసమే పనిచేసేవారు మరికొందరుంటారు. కాని మునుగోడు బిఆర్‌ఎస్‌ నాయకుడు నారబోయిన రవి లాంటి నాయకులు అతి తక్కువగా వుంటారు. రవి సేవాభావం నిండుగా వున్న నాయకుడు. ప్రజలకు ఏ ఆపదవచ్చినా వెంటనే స్పందించే నాయకుడు. ఏ అర్ధరాత్రి తలుపుతట్టినా నేనున్నాని భరోసా కల్పించే నాయకుడు. ప్రజాసేవలో నిమగ్నమైన నాయకుడు. ప్రజలంటే ప్రేమ కల్గిన నాయకుడు. అందుకే రవి నాయకత్వం కావాలని మునుగోడు బలంగా కోరుకుంటోంది. ప్రజలు ఎంతో ఆసక్తిగా రవి నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో బిఆర్‌ఎస్‌ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని ఆసక్తి కనబర్చుతున్నారు. అటు ప్రజలు ,ఇటు మునుగోడు బిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలందరూ రవి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఈసారి ఎట్టిపరిస్ధితుల్లోనూ రవికే టిక్కెట్‌ ఇవ్వాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులే కాదు, ఏ పార్టీకి చెందిన నాయకులు నలుగురు ఒక చోట చేరినా, సరే నారబోయిన రవి గురించే చర్చించుకుంటున్నారు. ఆయన నాయకత్వం గురించి చర్చించుకుంటున్నారు. ఈసారి బిఆర్‌ఎస్‌ తరుపున నారబోయిన రవి ఎన్నికల బరిలో నిలిస్తే మిగతా పార్టీల పరిస్దితి ఎలా వుంటుందా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే రవి మునుగోడు నియోజకవర్గంలో బలమైన నాయకుడు. ఆయన రాజ్‌గోపాల్‌రెడ్డి లాంటి నాయకుడిని కూడా ఎదుర్కొగల సత్తా వున్న నాయకుడు. గత ఉప ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్లకు ఇంటా, బైట నేతలందరూ ప్రచారం నిర్వహించాల్సివచ్చింది. మరి సార్వత్రిక ఎన్నికలంటే ఎమ్మెల్యే అభ్యర్ధి ఎంతో జన బలం కల్గిననేతై వుండాలి. కూసుకుంట్ల ఆ విషయంలో చాలా వెనుకబడి వున్నాడన్న సంగతి గత ఎన్నికల్లోనే తేలిపోయింది. కాకపోతే ముఖ్యమంత్రి కేసిఆర్‌ మరోసారి ఉప ఎన్నికల్లో కూసుకంట్లకు అవకాశం కల్పించారు. అందులో దాగి వున్న మర్మం కూడా అందరికీ తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూసుకుంట్ల టిక్కెట్‌ అడక్కుండా వుండేందుకే ఉప ఎన్నికల్లో ఆయనకు అవకాశం కల్పించారన్నది భహిరంగ రహస్యమే. అందుకే ఉప ఎన్నికలు పూర్తయి తర్వాత నుంచి పార్టీ ఆదేశాల మేరకు నారబోయిన రవి నియోజకరవర్గంలో అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు విసృతంగా చేపడుతున్నారు. పార్టీ నుంచి ఇప్పటికే పూర్తి స్ధాయి సూచనలు అందినట్లు కూడా సమాచారం. అందుకే రవి ఏ పనిచేసినా పార్టీ నుంచి పూర్తి స్ధాయి అనుమతులున్నట్లు పార్టీవర్గాలు చెప్పుకుంటున్నాయి. అందులో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా నారబోయిన రవి నాయకత్వం గురించి వాల్‌ రైటింగ్స్‌ విసృతంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా రవి గురించి ప్రచారమే దర్శనమిస్తోంది. ఏ గోడచూసినా రవి నాయకత్వం గురించే చెబుతున్నట్లు వుంది. ఇక బిఆర్‌ఎస్‌ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మెజార్టీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పీటిసీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పూర్తి స్ధాయిలో రవి నాయకత్వాన్నే బలపర్చుతున్నారు. రవి ఎట్టిపరిస్దితుల్లో ఈసారి ఎమ్మెల్యే కావాలని కోరుతున్నారు. ఎందుకంటే కూసుకుంట్ల అటు ఎమ్మెల్యేగా, ఇటు నాయకుడిగా పూర్తి స్ధాయిలో విఫలం చెందారని సొంత పార్టీ నేతలే భహిరంగంగా చెప్పుకుంటున్నారు. 

ఇక ఉప ఎన్నికల సమయంలోనే కూసుకంట్ల వైపు పార్టీ అదిష్టానం మొగ్గు చూపుతోందన్న విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గ స్ధాయి నాయకులంతా ఏకమై, కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ, అనేక సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

అంటే ఆ స్ధాయిలో ఆనాడే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వుంది. మరి ఇప్పుడు ఆ వ్యతిరేకత మరింత రెట్టింపైంది. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన రాజగోపాల్‌రెడ్డి మరింత కసిగా వున్నారు. ఓడిపోయిన నాడే శపథం కూడా చేశాడు. అంటే వచ్చే ఎన్నికలు రాజగోపాల్‌రెడ్డికి చావో రేవో అన్నట్లుగానే సాగుతాయి. అలాంటప్పుడు ఆయనను బలంగా ఢీ కొనగలిగే నాయకుడు కావాలి. అది కేవలం రావి మాత్రమే అన్నది మునుగోడు నియోజకవర్గం మొత్తంచెప్పుకుంటున్న మాట. బిఆర్‌ఎస్‌లో చాలా మంది సిట్టింగ్‌ ఎమ్యెల్యేలను మర్చే యోచన ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేస్తున్నాడన్నది తెలుస్తున్న విషయమే. అందులో మునుగోడు ఖచ్చితంగా వుండే నియోజవర్గమే. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై ప్రజల్లో ఎలాగూ సదాభిప్రాయం లేదు. నాయకుల్లో నమ్మకం లేదు. ఆయన నాయకత్వమంటే విశ్వాసమే లేదు. మరోసారి కూసుకంట్లను కావాలని ఎవరూ కోరుకోవడం లేదు. కొత్త ఓటర్ల దగ్గర నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీ అంటే ఎంతో ప్రేమ వున్న నాయకులందరూ కోరుకుంటున్న ఏకైక వ్యక్తి నారబోయిన రవి. ఆయనను కాదని , ఎవరిని ప్రజల మీద రుద్దినా పార్టీకి నష్టమే అన్న అభిప్రాయమే వినిపిస్తోంది. అంతే కాదు కూసుకుంట్ల విషయంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో అంటే పార్టీ యంత్రాంగంమంతా పనిచేయడం గమనార్హం. అయినా ఆనాడే ఏ బిఆర్‌ఎస్‌ నాయకుడు మనస్పూర్తిగా కూసుకుంట్లకు పనిచేయలేదు. కాని పార్టీ మీద వున్న నమ్మకంతో, విశ్వాసంతో, ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం, మంత్రి కేటిఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పేరు నిలపడం కోసమే అందరూ కూసుకంట్లకు పనిచేశారు. కాని ఈసారి కూసుకుంట్ల వద్దే వద్దు అని ఎప్పటినుంచో పార్టీకి చెబుతున్నారు. ఉప ఎన్నికల సమయంలో కూసుకుంట్లకు పనిచేయడం ఇదే ఆఖరు సారి అని కూడా తేల్చిచెప్పినట్లు సమాచారం. 

  మునుగోడు వ్యవహారం ముందుగానే తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.

 బిఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా పట్టుబడుతున్నారు. నారబోయిన రవిలో అసలైన సేవా గుణం వున్న నాయకత్వం వుంది. అందుకే ఆయనంటే ప్రజలకు కూడా ఎంతో ఇష్టం. అది రవికి ఎంతో ప్లస్‌ పాయింట్‌ అని చెప్పకతప్పదు. నారబోయిన రవి పేదల బాధలు తెలిసిన నాయకుడు. వారి బాధలు పంచుకునే ఆత్మీయ నాయకుడు. మునుగోడులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు రవి ఇంటి తలుపు తట్టేవారే ఎక్కువ. బిఆర్‌ఎస్‌లో రవి బలమైన నేత. సామాజిక నేపద్యం అండగా వున్న నేత. ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రి కేటిఆర్‌, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి ఆశీస్సులున్న ఏకైక నాయకుడు. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డికి ఎంతో నమ్మకస్తుడు. అనుంగు అనుచరుడు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండే నాయకుడు. మునుగోడు అభివృ ద్దికోసం నిరంతరం తపించే నాయకుడు రవి. మునుగోడు అభివృద్ది కోసం నిర్విరామ కృషి చేస్తున్న నాయకుడు. ప్రజల మనసెరిగిన నేత. మునుగోడులో ఆసారి బిఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కనున్న బిసి నేత నారబోయిన రవి. ఎందుకంటే బిసిలలో అన్ని సామాజిక వార్గల చేయూత వున్న ఏకైక నేత కూడా రవే కావడం ఆయన అదృష్టం. సమస్యలు లేని మునుగోడు నిర్మాణమే రవి కల. ఆ కల నేరవేర్చేందుకు సరైన నాయకుడు రవి అనే ప్రజలు నమ్ముతున్న మాట. అన్ని రంగాల్లో మునుగోడు అభివృద్ది జరగాలంటే రవి నాయకత్వమే కావాలని అందరూ కోరుకుంటున్నారు. రవి ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తున్నారు. దీవిస్తున్నారు.

ఆరోగ్య తెలంగాణ. తెలంగాణలో వైద్య విప్లవం.

తెలంగాణ ప్రజలకు అందుతున్న ప్రభుత్వ వైద్యం గురించి, దశాబ్ద కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెచ్చిన వైద్య విప్లవం గురించి బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఖైరతాబాద్‌ ఇంచార్జ్‌ మన్నె గోవర్ధన్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న అభిప్రాయాలు… ఆయన మాటల్లోనే…

`తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు కేసిఆర్‌ అపూర్వ సృష్టి.

`తెలంగాణ కు నీళ్లొచ్చినయ్‌.

`తెలంగాణ కు నిరంతర కరంటు వచ్చింది.

` కోతలతో తల్లడిల్లిన తెలంగాణలో కరంటు విప్లవం.

` మన నిధులతో విద్యా రంగంలో గొప్ప ఆవిష్కరణలు.

` గురుకులాల ఏర్పాటుతో ఉచిత విద్యకు మోక్షం.

`ఇప్పుడు వైద్యరంగం వంతు.

` గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సదుపాయాలు.

` ఊళ్లలో పల్లె దవఖానాలు.

`పట్టణాలలో బస్తీ దవాఖానాలు.

` ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు.

` వరంగల్‌ లో 2500 బెడ్లతో కొత్త ఆసుపత్రి.

` హైదరాబాదు నలువైపులా నాలుగు ఆసుపత్రులు.

` నిమ్స్‌ కు మరో మణిహారం…విస్తరణతో మరొ కొత్త భవనం.

` కేసిఆర్‌ నిమ్స్‌ దీక్ష లోనే తెలంగాణ ప్రకటన వచ్చింది.

`కేసిఆర్‌ పాలనలో నిమ్స్‌ కు మహార్థశ పట్టనుంది.

`మరో 2000వేల బెడ్ల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన.

` దశాబ్ది ఉత్సవాల వేళ వెలిగిపోతున్న వైద్య రంగం.

` పేదలందరికీ అందుబాటులో ఉచిత వైద్యం.

`తల్లి, బిడ్డల సంక్షేమం.

` కేసిఆర్‌ కిట్‌ తో రేపటి తరానికి సంపూర్ణ ఆరోగ్యం.

`నవ తరం ఆరోగ్యానికి కేసిఆర్‌ పాలన కొండంత ధైర్యం.

`అటు హరీష్‌ రావు, ఇటు కేసిఆర్‌ పేదల వైద్యానికి భరోసా.

` ప్రభుత్వ ఉచిత వైద్యానికి తెలంగాణ అడ్డ.                 

హైదరబాద్‌,నేటిధాత్రి:   

తెలంగాణ ఈ పదమే ఒక ఉద్యమం…ఒక విప్లవం. ఒక ప్రశ్న. ఒక నిలదీత. ఒక వేధన. ఒక ఆందోళన. ఒక శక్తి. ఒక ఆర్తి. ఒక కీర్తి. వీటన్నింటినీ ఏకం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిననాడు ఎక్కడున్నారో కూడా తెలియని వాళ్లు కూడా ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉనికి తెలియని వాళ్లు, తెలంగాణ ఆన వాళు తెలియని వాళ్లు, తెలంగాణ గోస తెలియని వాళ్లు కూడా తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. అయినా కేసిఆర్‌ ప్రశ్న కొత్తది కాదు. కేసిఆర్‌కు ప్రశ్నలు కొత్తవి కాదు. తెలంగాణ వస్తే ఏమెస్తది,ఏమెస్తది అని ప్రశ్నించిన వారికి తెలంగాణ వ్యవసాయ విప్లవం కళ్లముందు కదలాడుతోంది. కాళేశ్వరం నిర్మాణం కళ్లముందు కనిపిస్తోంది. రేపటి బంగారు తెలంగాణ కళ్లముందు కదలాడుతోంది. ఇదే నేటి తెలంగాణ. బంగారు తెలంగాణ. పచ్చని మాగాణగా, మారి కోటినన్నర ఎకరాల సాగు తెలంగాణ ఏర్పడిరది. ఇప్పుడు దిగుబడుల్లో విప్లవం తీసుకొచ్చింది. రైతుల ఆశల పండిస్తోంది. మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ మన వెనక వున్నారన్న భరోసా ప్రతి రైతులో నిండిరది. ఆ నమ్మకమే రైతుల్లో కోటి ఆశలు నెరవేర్చుతోంది. కూలీ నాలి చేసుకునేందుకు వలసలు వెళ్లిన, కుటుంబాలకు దూరమైన, ఊరును ఏళ్ల తరబడి చూడలేకపోయిన వారంతా తెలంగాణ పల్లె జీవనంలో మమేకమయ్యారు. పల్లె సీమలో గొప్ప జీవితాలు అనుభవిస్తున్నారు. గర్వంగా మన తెలంగాణ అని చెప్పుకుంటున్నారు. నాకేం తక్కువ అన్నంత ధీమా రైతు వ్యక్తంచేస్తున్నాడు. అప్పుచేయాల్సిన పని లేదిక. ఎరువులు అందవన్న ఆందోళన లేదు. నకిలీ విత్తనాల బెడదలేదు. సకాలంలో వర్షాలు పడడం లేదన్న దిగులు లేదు. కరంటు ఎప్పుడొస్తుందా అని రాత్రిళ్లు, బావుల దగ్గర నిద్రలు పోవాల్సిన పనిలేదు. పగటి పూట ఎంత నీరు సమృద్ధిగా వుంటే ఎంత సమయమైనా నీటి పారకంతో పంట దిగుబడులు మారకాలౌతున్న కాలమిది. ఉద్యమకారుడు కేసిర్‌ పాలనిది. మూడు ముఖ్యమైనసమస్యల్లో ఒకటైన నీటి వనరులు అందేందుకు, చేయాల్సిన పనులన్నీ చేసి పెడుతున్నాడు. ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరంటు, సాగునీరు, పెట్టుబడి, అన్నీ తానై రైతుకు అండగా నిలుస్తున్నారు. అభివృద్ధిపై ఆర్తి, భవిష్యత్తుపై స్పూర్తి వున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. వేసే అడుగు, ఇచ్చే మాట, చేసే పని అన్నది మాత్రమే ఆలోచించే ఏకైక నాయకుడు ఆయన. అందుకే నమ్మకం లేని చోట నమ్మకాన్ని నిర్మించి, తెగించి తెలంగాణ తెచ్చిన ఉద్యమశీలి. బంగారుతెలంగాణకు బాటలు వేస్తున్న అభినవ రాజకీయ శిల్పి. కేసిఆర్‌ గురించి చెప్పాలంటే ఎప్పుడు మాట్లాడుకున్నా మొదటి పేజీనుంచి చెప్పుకుంటే గాని తృప్తి వుండదంటారు. అంతటి స్పూర్తివంతమైన రాజకీయ జీవితాన్ని అనుసరించి, అనుభవించి, పాలించి చూపించిన నాయకుడు ఒక్క కేసిఆర్‌ మాత్రమే. అంటున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు, బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి , నేటిధాత్రి ఎడిటర్‌కట్టారాఘవేంద్రరావుతో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రగతిపై చెప్పిన విషయాలు..ఆయన మాటల్లోనే…

సహజంగా ఎవరైనా రాజకీయాల్లో ఎదిగి, ఓట్లు, సీట్లు అన్నది మాత్రమే చూసుకొని పాలన సాగించిన వారే ఎక్కువ.

 కాని తన కలగని, ప్రజలచేత నినాదమై, తెలంగాణ ఉద్యమానికి నిర్మాణమై, లక్షలాది మంది కేసిఆర్‌లను తయారు చేసి, కోట్లాది గొంతుకై తెలంగాణ సాధించి, పాలిస్తున్న నాయకుడు ఒక్క కేసిఆర్‌. చరిత్రలో పేజీకోసం చూసే నాయకులు కొందరైతే, చరిత్రే తానుగా తీర్చిదిద్దుకునే నాయకులు కొందరే…అందులో తొలి వరుసలో వుండేది ఒక్కడే. తెలంగాణలో ఆయనొక్కడే. పద్నాలుగేళ్ల సుధీర్ఘ ఉద్యమ ప్రయాణంలో, పోరాట దారిలో కేసిఆర్‌ వున్నాడనే ధీమా ప్రతి ఒక్కరిలో కలిగించి, కదిలించిన నాయకుడుగా చరిత్ర ఆయనకు దాసోహమనక మానదు. తెలంగాణను చిరస్థాయిగా, చిరస్మరణీయం చేసినందునే తెలంగాణ ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. పాలనకు సరైన దారులు వేస్తారని నమ్మారు. ఆనాడైనా, ఈనాడైనా అదే దారి, అదే ఆర్తి, ఆదే సూర్తి… నిన్నటి ఉద్యమ ఆకాంక్ష నిత్యమై, సత్యమై ఎలా ముందుకు తీసుకెళ్లారో నేడు అభివృద్ధిని కూడా నిత్యవసంతం చేయాలన్న తపనతో ఆయన సాగుతున్నారు. అందుకే మట్టి విలువ, నీటి విలవ ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి. సహజంగా ఏ నాయకుడైనా ఉద్యమ పంధాలో వున్నప్పుడు, ఆ గెలుపే లక్ష్యంగా సాగినా, మరే దానిపై వ్యాపకం వుండకపోవచ్చు. కాని తెలంగాణ సాధన అన్నది ఏనాటికైనా సాధ్యమయ్యేదే అని బలంగా నమ్మి, భవిష్యత్తు తెలంగాణకు ఎలా పునాదులు నిర్మాణం చేపట్టాలని ఉద్యమ కాలంలోనే రచించిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. 

తెలంగాణ సాధించిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయన పాలనాపరమైన అడుగు ఎంతో ముందు చూపుతో, భివిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకొని వేస్తున్నారు.

 అందుకే అన్ని రంగాల్లో అనతి కాలంలోనే తెలంగాణ అధ్భుతమైన విజయాలు సాధింస్తోంది. సాగు రంగంలో ఒకనాడు తిండి గింజలు పండితే చాలు దేవుడా అనుకున్న తరుణం నుంచి తెలంగాణ అన్న పూర్ణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. సాగుకు నీరు కావాలని అప్పటి ఉమ్మడి పాలకులను ఎంత వేడుకున్నా తెలంగాణలో ఎత్తిపోతలు ప్రభుత్వానికి తీవ్రభారమని, రైతు శ్రేయస్సును కూడా కాదని, ప్రజలు ఆకలితో అలమటస్తున్నా పట్టించుకోని రోజులవి. కాని నేడు ఏ పాలకులు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం కష్టమన్నారో అక్కడే కాళేశ్వరం లాంటి గొప్ప నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేసి, రైతులకు నీళ్లందిస్తున్న అపర భగీరధుడు కేసిఆర్‌. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం తెలంగాణనే సంక్షేమ రాష్ట్రంగా విరాజిల్లేలా చేసిన గొప్ప సంస్కర్త కేసిఆర్‌. అదే వరసలో తెలంగాణలో వైద్య విప్లవం సృష్టించిన నాయకుడు కేసిఆర్‌. ఒకప్పుడు తెలంగాణలో ప్రభుత్వ వైద్యమంటే పెద్ద నగరాలకే పరమితమైన సౌకర్యం. కాని నేడు ఊళ్లలో పల్లె దవఖానాలు పెద్దఎత్తున ఏర్పాటు చేసి, పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటుతో మెరుగైన, మేలైన, అత్యవసర వైద్యానికి హైదరాబాద్‌ వరకు రాకుండా అక్కడికక్కడే వైద్యం అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తిచేసుకొని వైద్యం అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగతా జిల్లాల్లోనూ వైద్యకళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఒక్క వైద్య కళాశాల ఇవ్వడానికి కూడా ఉమ్మడి పాలకులు అంగీకరిచలేదు. ఇక వరంగల్‌లో 2500 పడకలతో అధునాతమైన ఆసుపత్రి, 24 అంతస్ధులతో నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. దసరా నాటికి ఆ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో రానున్నది. ఆ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే వరంగల్‌లో ప్రభుత్వ వైద్యమే తప్ప, ప్రైవేటు వైద్యం కనిపించకోవచ్చు. ఇక హైదరాబాద్‌కు నలువైపుల నాలుగు మల్లీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఆ ఆసుపత్రులతో పేద ప్రజలకు ఎంతో ఖరీదైన వైద్యం కూడా ఉచితంగా అందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇదిలా వుంటే తెలంగాణ ఉద్యమానికి సాక్షిగా నిలిచిన నిమ్స్‌కు మహార్ధశ పట్టనుంది. ఎక్కడైతే ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ కోసం దీక్ష చేపట్టి, తెలంగాణ సాధించారో ఆ ఆసుపత్రికి మరో మణిహారంగా కొత్తగా 2000 పడకల నూతన భవనం నిర్మాణం జరగనుంది. ఆ భవననిర్మాణానికి నేడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ భూమి పూజ చేయనున్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో వైద్య రంగంలో తెలంగాణను అగ్రగామిగా మార్చి, పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తెచ్చి, ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణలో ఆరోగ్య విప్లవాన్ని సృష్టించారు.

రవి కే టికెట్‌ ఖరారు!

-రవి వస్తేనే మునుగోడు అభివృద్ధి.

-మునుగోడు ప్రజల అభివృద్ధే రవి ధ్యేయం.

-అనేక సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు సేవలు.

-రవి ముదిరాజ్‌ కే ప్రజల దీవెనలు.

-ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే ఆపద్భాందవుడు.

-బలమైన ముదిరాజ్‌ సామాజిక వర్గ నేపథ్యం.

-మునుగోడు ఈసారి బిసిలకే…టికెట్‌ రవికే!

-ప్రజలంతా కోరుకుంటోంది రవినే…

-డి. ప్యాక్‌, నేటిధాత్రి సంయుక్త సర్వేలో తేలిందిదే.

-మెజారిటీ ప్రజలు రవి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు.

-పొరపాటున కూడా కూసుకుంట్ల వద్దంటున్నారు.

-బిసిలలో ఐక్యత సాధించే నాయకుడు రవి.

-బిఆర్‌ఎస్‌ నేతలు, బిసిలంతా ముక్త కంఠంతో కోరుకుంటోంది రవినే.

-మునుగోడు ముందటపడాలంటే రవే రావాలి.

-మునుగోడు అభివృద్ధి జరగాలి.

-ఇదే జనం చెప్పుకుంటున్న మాట.

-సామాన్యుల బాధలు తెలిసిన నేత రవి.

-కష్టపడి పైకొచ్చిన ఆదర్శనేత రవి.

-మునుగోడు వెలగాలంటే రవి రావాలి…మునుగోడు ప్రగతిలో దూసుకుపోవాలి.

-బిఆర్‌ఎస్‌ కు ఎదురులేదు…రవి నాయకత్వానికి తిరుగులేదు.

-పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసే నాయకుడు రవి.

హైదరబాద్‌,నేటిధాత్రి:               

గొప్పను గొప్పగా చెప్పాల్సిన తరుణాన్ని గొప్పగానే చెప్పాలి. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న మునుగోడు ముద్దుబిడ్డ నారబోయిన రవి ముదిరాజ్‌ గురించి నిజమే చెప్పాలి. నిజాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి. ఆయనకు ప్రజలంటే ప్రాణం. ప్రజా సేవ చేయడం ఇష్టం. తాను కష్టపడి సంపాది ంచిన దానిలో ఆపదలో వున్నవారిని ఆదుకునేందుకు ఖర్చు చేయడం గొప్ప గుణం. ప్రజల అవసరాలు తీర్చి, వారికి మేలు చేయడం ఎంతో ఇష్టం. తమ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ది చేయాలని ఇష్టం. గొప్పగా అభివృద్ది చెందాలని కోరుకోవడం ఆయన నైజం. తమ ప్రాంతాభివృద్ధిలో తన పాత్ర వుండాలనుకోవడం ఇష్టం. నాయకుడిగా ప్రజలు మరింత సేవ చేయాలన్నది ఆయనకు ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఎంతో ప్రాణం. ఆయన పాలనంటే ఎంతో ఎంతో ఇష్టం. ఉద్యమకారుడిగా తెలంగాణ సాధకుడిగా యుగపురుషుడిగా ఆయనను కొలవడం ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంక్షేమ పాలన అంటే మరీ ఇష్టం. మంచినీటికి కూడా గోస పడ్డ మునుగోడుకు అందరికంటే ముందే మంచినీళ్లు ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఎనలేని ఇష్టం. అలాంటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనతో, తాను కూడా ప్రజలకు సేవ చేయాలని రవికి ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో తమ ప్రాంత అభివృద్ది తన చేతుల మీదుగా మరింత జరగాలన్నది రవి కోరుకుంటున్న ఇష్టం. మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లో మరింత రాణించాలన్నది ఎంతో ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డిల ఆశీస్సులతో జరుగుతున్న అభివృద్ది మరింత జరగాలని, మునుగోడు అన్ని రంగాల్లో ముందుండాలని ఇష్టం. సామాజిక బాద్యతలో ప్రజాసేవలో వున్న రవి ప్రత్యక్ష్య రాజకీయాల్లో ప్రజా రాజకీయాల్లో ప్రజా భాగస్వామ్య రాజకీయాల్లో కీలకం కావాలని ఆయన అభిమానలకు ఇష్టం. మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఇదే మాట…ఎవరు చెప్పినా ఇదే మాట…ఎవరిని కదిలించినా చెబుతున్నది ఒకే మాట..మాకు ఈసారి రవి ఎమ్మెల్యే కావాలని, ఆయన నేతృత్వంలో మునుగోడు మరింత పరుగులు పెట్టాలని…

 వ్యాపార రంగంలో ఎంత బిజీగా వున్నా ప్రజలకు చేరువగా వుండడం రవికి ఎంతో ఇష్టం.

ఎందుకంటే తమ ప్రాంతం మీద ఎంతో మక్కువ వున్న నాయకుడు రవి. మునుగోడులో బిసి సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ. అయినా ఇప్పటి వరకు రెడ్డి రాజకీయం తప్ప, బిసిల రాజకీయం సాగలేదు. కాలం మారింది. తెలంగాణ వచ్చింది. బిసి రాజకీయానికి మరింత వన్నె వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్ని వర్గాలను ఆదుకుంటున్నారు. అన్ని వర్గాలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. సకల జనులతో తెలంగాణ ఉద్యమం సాధించినట్లుగానే, పార్టీలోనూ,పరిపాలనలోనూ అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రోత్సహిస్తున్నారు. అయితే మునుగోడును ఎన్నికైన నాయకులెవరూ గతంలో నియోజకవర్గాన్ని ఏనాడు ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసిఆర్‌ మునుగోడు కష్టం ప్రత్యక్షంగా చూసి, చలించిపోయారో..అప్పటి నుంచే మునుగోడులో కొంత మార్పు వచ్చింది. మునుగోడుకు కనీసం మంచినీళ్లు ఇచ్చేందుకు కూడా చేతులు రాని ఉమ్మడి పాలకులను కేసిఆర్‌ ప్రశ్నించారు. నిలదీశారు. కాని ఫలితం కనిపించలేదు. అందుకే తెలంగాణ రాగానే ముందు మునుగోడు గోడు తీర్చారు. అంత గొప్ప నాయకుడి పాలనతో మునుగోడు అభివృద్ది జరగాలంటే ఆ ప్రాంతం మీద ఎంతో అంకితబావం వున్న రవి లాంటి నాయకుడికి అవకాశం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మునుగోడులో ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్ల కాకుండా రవి లాంటి నాయకుడు ఎమ్మెల్యేగా వుంటే మునుగోడు ఒక వజ్రపు తునకగా మార్చేవారని ప్రజలు అంటున్నారు. 

నారబోయిన రవి అటు వ్యాపార రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఎక కాలంలో రెంటింటిలోనూ తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు.

 గతంలో కాంగ్రెస్‌లో రాష్ట్ర స్ధాయి నాయకుడిగా వున్నారు. అయితే మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రోద్భలంతో బిఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ కోసం అహర్నిషలు పనిచేస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి మాటంటే రవికి ఎంతో గౌరవం. అందుకే ఆయన పార్టీ కోసం ఏ పని చెప్పినా దానిని విజయవంతం చేయడంలో రవి దిట్ట. పార్టీ పరమైన కార్యక్రమాలెన్నో విజయవంతం చేసి, మంత్రి జగదీశ్‌రెడ్డి చేత అనేక సార్లు శబాష్‌ అనిపించుకున్నారు. గత ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల గెలుపుకోసం రవి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అయితే గత ఉప ఎన్నికల సమయంలోనే రవికి టిక్కెట్‌ ఇవ్వాలని పార్టీ శ్రేణులను నుంచి ఒత్తిడి వచ్చింది. రవికి ఇస్తే బిఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరు మీద నడకే అని పార్టీ శ్రేణులు చెప్పాయి. అంతే కాకుండా మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రధాన అనుచరుడిగా కూడా రవికి అదనపు బలంగా మారింది. కాకపోతే అప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం కూసుకుంట్లకు టిక్కెట్‌ ఇవ్వడం జరిగింది. అయినా పార్టీ కోసం తన సర్వ శక్తులు ఒడ్డి కూసుకుంట్లను గెలిపించడంలో కీలకభూమిక పోషించిన నాయకుడు రవి. అందువల్ల ప్రజలు కూడ ఈసారి రవికే టిక్కెట్‌ ఇవ్వాలని కోరుకుంటున్నారు. పార్టీ శ్రేణులైతే ఇప్పటినుంచే రవి టిక్కెట్‌ దక్కాలని పార్టీ పెద్దల వద్ద తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఎందుకంటే మునుగోడు ప్రాంత అభివృద్ది లక్ష్యం వున్న ఏకైక నాయకుడు నారబోయిన రవి. మరో వైపు ఆయన చేపట్టే సామాజిక కార్యాక్రమాలు మునుగోడు నియోజకవర్గంలో చాలా మందికి అందాయి. నియోజకవర్గంలోనే బలమైన బిసి సామాజిక వర్గంగా ముదిరాజ్‌లున్నారు. సుమారు 45వేలకు పైగా ముదిరాజ్‌ ఓట్లున్నాయి. మొత్తంగా మునుగోడులో బిసి సామాజిక వర్గాలే ఎక్కు.వ. అందులో ముదిరాజ్‌లదే పెద్ద బలగం. అందుకే నారబోయిన రవికి టిక్కెట్‌ ఇస్తే బిఆర్‌ఎస్‌కు తిరుగులేని మెజార్టీ రావడం ఖాయం అంటున్నారు. ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడుగా రవికి వున్న పేరు ఎంతో కలిసి వస్తుంది. 

 ఇదిలా వుంటే మునుగోడులో గత మూడు నెలలుగా డిప్యాక్‌, నేటిధాత్రిలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేలలో ప్రజలు ఎక్కువగా నారబోయిన రవి గురించే ప్రస్తావిస్తున్నారు.

 ఆయన సామాజిక సేవలు గుర్తు చేసుకుంటున్నారు. గ్రౌండ్‌ రిపోర్టులో నారబోయిన రవికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కనిపిస్తోంది. నియోజకవర్గంలో రవికి అరవై ఎనమిది శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతుండడం గమనార్హం. కూసుకుంట్ల విషయం కనీసం పట్టుమని పది శాతం మంది ప్రజలు కూడా మద్దతివ్వడం కనిపించలేదు. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ బలమైనపార్టీ. తర్వాత స్ధానంలో కాంగ్రెస్‌ వుంది. బిజేపికి కనీసం క్షేత్ర స్ధాయిలో కార్యకర్తలు కూడా లేరు. గత ఉప ఎన్నికల్లో కేవలం రాజగోపాల్‌రెడ్డి వల్లనే బిజేపికి ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. కాని ఈసారి రాజగోపాల్‌రెడ్డికి కనీసం ఇరవైశాతం ఓట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నిలకడ లేని రాజకీయాలు చేస్తూ, రాజగోపాల్‌రెడ్డి స్వార్ధ రాజకీయాల కోసం పనిచేస్తున్నాడన్న మాట ఎక్కువగా వినిపించింది. అందువల్ల బలంగా వున్న బిఆర్‌ఎస్‌కు మునుగోడు కంచుకోట కావాలంటే నారబోయిన రవికే టిక్కెట్‌ ఇవ్వాలని ప్రజలు పెద్దఎత్తున అభిప్రాయం వ్యక్తంచేయడం విశేషం.

గుండెపోటుతో ములుగు జడ్పీచైర్మన్ “కుసుమ జగదీష్” మృతి

ఫ్లాష్.. ఫ్లాష్..

నేటిధాత్రి వరంగల్

జిల్లా పరిషత్ చైర్మన్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్వర్ కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో హనుమకొండలోని అజార హాస్పిటల్ లో మృతి చెందారు.

తెలంగాణ ఊపిరి…ప్రగతి రూపశిల్పి.

 

 

`సంక్షేమ సారధి…అభివృద్ధి వారధి.

`సాగు నిర్ణేత..సస్యశ్యామల ప్రదాత.

`తెలంగాణ అభివృద్ధిపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న భావాలు…అనుభవాలు. పెద్ది మాటల్లోనే..

`అన్ని వర్గాల ఆకాంక్షలకు ప్రతీక.

`సకల జనుల అభివృద్ధి నిర్మాత.

`పల్లె సింగారానికి శ్రీకారం.

`తెలంగాణలో నీటి జాడలకు సంకేతం.

`చెరువులతొ మొదలైన అభివృద్ధి సంతకం.

`సాగుకు 24 గంటల కరంటు నిదర్శనం.

`ఆసరా ఫింఛన్లుతో భరోసా…

`దివ్యాంగుల ఫించన్‌ పెంపుతో ఊరట.

`దళిత బంధుతో పెరిగిన ఆత్మవిశ్వాసం…

`గిరిజన బంధుతో ఆత్మస్థైర్యం…

`కళ్యాణ లక్ష్మితో కమనీయం.

`బిసిలకు లక్షతో చేతి వృత్తులకు సహకారం.

`అభివృద్ధిలో తెలంగాణ ఫస్ట్‌..

`సంక్షేమంలో తెలంగాణే బెస్ట్‌.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

మొన్న: నా గోడు తెలంగాణ. నా గోస తెలంగాణ. కాలోజీ మాటల్లో నా గొడవ తెలంగాణ. కడుపుకు పట్టెడు బువ్వ కరువైన తెలంగాణ. కళ్ళలో కాంతి కరువు చేయబడ్డ తెలంగాణ. కంటికి కునేక కరువైన తెలంగాణ. ఉపాధి లేని తెలంగాణ. చీకటి సూర్యులై అడవుల బాట పట్టి, అమరులైన యువకుల తెలంగాణ. కడుపు కోతల తెలంగాణ. కరువు రక్కసి పీక్కుతిన్న తెలంగాణ. కన్నీటి తెలంగాణ. కష్టాల తెలంగాణ. కాని నిజాం కాలంలోనే పిడికిలెత్తిన తెలంగాణ. ఆనాడే ఉక్కు సంకల్పం నిండిన తెలంగాణ. మర్లవడ్డ తెలంగాణ. పెత్తనాన్ని ప్రశ్నించిన తెలంగాణ. పాట తెలంగాణ. ఆట తెలంగాణ. ఆత్మ గౌరవ తెలంగాణ. చాకలి ఐలమ్మ వేసిన బాట తెలంగాణ. దొడ్డికొమరయ్య అమరత్వం తెలంగాణ. పోరాటం నా తెలంగాణ. ఆరాటం నా తెలంగాణ. ఉద్యమం నా తెలంగాణ. ఉరకలెత్తే ఉత్సాహం నా తెలంగాణ. మర్లవడే తిరుగుబాటు నా తెలంగాణ. హక్కుల సాధన నా తెలంగాణ. ఆశయ సాధన నా తెలంగాణ. అరగారిణ వర్గాల చైతన్యం నా తెలంగాణ. జన నినాదం తెలంగాణ. రణం నా తెలంగాణ. పౌరుషం నా తెలంగాణ.

జంరaా మారుతం తెలంగాణ. మా నినాదం తెలంగాణ. మా ఊపిరి తెలంగాణ. దిక్కులు పిక్కటిల్లేలా గర్జన నా తెలంగాణ. అణువణువునూ నిండిన వాదం తెలంగాణ. ఉచ్చాస నిచ్చాసల బలం నా తెలంగాణ. ప్రతి వ్యక్తి గుండె చప్పుడు తెలంగాణ. ప్రతి కదలికలో అలికిడి తెలంగాణ. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వవాప్తమైన నా తెలంగాణ. రణమైనా, రాగమైనా అంబరమంటే సంబరం నిండిరదే నా తెలంగాణ. ఉత్కృష్టమైన, ఉజ్వలమైన వెలుగే నా తెలంగాణ. భావన నా తెలంగాణ. భావావేశం నా తెలంగాణ. 

నిన్న: అరవై ఏళ్ల దుఃఖం కడుపులో దాచుకొని పురిటి నొప్పులు పడ్డ గడ్డ నా తెలంగాణ.

 అడుగడుగునా దగాపడ్డది నా తెలంగాణ. కన్నీళ్లతో కడుపు చల్లబర్చుకున్నది నా తెలంగాణ. తలాపున గోదారి పరుగులున్నా, కనీసం నురగలు కూడా తెలంగాణ పల్లెలు చూడక, ఎండిపోయిన బతుకులు తెలంగాణ. ఆ పక్క కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా, పడావు పడ్డ పాలమురూ కరువు నా తెలంగాణ. పలుగు రాళ్లు తప్ప పంట చేలు కనిపించని నా తెలంగాణ. ఎండిన బీళ్లు, నెర్రెలు బారిన పొలాలు, ఇంకిన చెరువులు, ఒట్టిపోయిన ఒర్రెలు, వంకలు మూసుకుపోయిన వాగులు, నీటి జాడలు పాతాళంలో కనిపించని తెలంగాణ పల్లెలు. ఇవీ నా తెలంగాణ బతుకులు. జీవితాల గోసలు. 

నేడు: చిరునవ్వుల తెలంగాణ. చిద్విలాసం చూస్తున్న తెలంగాణ. సిరుల మాగాణ నా తెలంగాణ.

 కోటిన్న ఎకరాలకు సాగు చేరిన తెలంగాణ. పసిడిపంటల కాణాచి తెలంగాణ. పచ్చని పల్లెల తెలంగాణ. పైర్లు పైటలా కప్పుకున్న పచ్చని మాగాణ నా తెలంగాణ. సిరుల సింగారం నా తెలంగాణ. వీరుల తెలంగాణ. ఉద్యమ కారుల తెలంగాణ. నిండైన గౌరవం నా తెలంగాణ. ఆత్మ నిండిన తెలంగాణ. ఆత్మ గౌరవం వెల్లివిరిసిన తెలంగాణ. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. అనువణువూ పులకింత తెలంగాణ. అవమానాలు అంతరించిన తెలంగాణ. సగర్వంగా నిలబడ్డ గెలుపు పతాక తెలంగాణ. నీటి సవ్వడులతో గలగల నవ్వుతున్న తెలంగాణ. జలజలాపారుతున్న తెలంగాణ. కాళేశ్వరంతో కళకళలాడుతున్న తెలంగాణ. కాలువలు ఏరులై పారుతున్న తెలంగాణ. ఏరులన్నీ సజీవమైన తెలంగాణ. చెరువులన్నీ నిండిన నా తెలంగాణ. వాగుల్లో నిళ్లు పరవళ్లు తెలంగాణ. మత్తళ్లు దుంకుతున్న తెలంగాణ. ఒర్రెళ్లల్లో నీటి ఊటలు తెలంగాణ. పొలాల నిండా నీటి తెలంగాణ. పసిడి పంటల తెలంగాణ. ప్రతి గుండె కలల రూపం తెలంగాణ. పోరాడి సాధించుకున్న లక్ష్యం తెలంగాణ. ఉద్యమ కారుడైన కేసిఆర్‌ ఊపిరైన తెలంగాణ. పద్నాలుగేళ్లు పోరాటం చేసి సాధించి, వెయ్యేళ్లు చెప్పుకున్నా తనివి తీరని సంతోషం నిండిన తెలంగాణ. ఆనాటి జ్ఞాపకాలను, ఉద్యమకారుడైన కేసిఆర్‌ పోరాటంలో వేసిన ఎత్తులు, రాజకీయంగా అనుసరించి విధానాలు, ముక్కొటి గొంతులను ఒక్కటి చేసి జై తెలంగాణ అనిపించి తెలంగాణ సాధించిన కేసిఆర్‌ కలల రూపం నేటి తెలంగాణ అంటూ నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ చెప్పిన ఆసక్తికరమైన అంశాలు…తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల వేళ ఆయన మాటల్లోనే…

 ఒకనాడు తెలంగాణలో ఎక్కడ చూసినా కరువు. 

ఎప్పుడు చూసినా కరువే. కాని ఇప్పుడు ఆ మాటకు అర్ధమేమిటో కూడా తెలియనంత అభివృద్ధి తెలంగాణ జరిగింది. దానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఒక ప్రణాళికా ప్రకారం చేస్తున్న అభివృద్దే నిదర్శనం. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం కొట్లాకు బయలుదేరిన నాటి నుంచే భవిష్యత్తు తెలంగాణ ఎలా వుండాలన్నదానిపై ఒక స్పష్టమైన వైఖరితో వున్నారు. అందుకే ఇంత త్వరగా తెలంగాణ కోలుకోగలిగింది. అన్ని రంగాల్లో అభివృద్ది చెందగలింది. అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. సంక్షేమ రాష్ట్రంగా విరాజిల్లుతుంది. తెలంగాణ రాకుంటే ఇందులో ఏ ఒక్కటీ వుండేది కాదు. అదే గోస..అదే యాతన వుండేది. తెలంగాణ రాకపోతే చెరువులుండేవా? చెరువుల్లో నీళ్లుండేవా? పల్లెల్లో పంటలుండేవా? అదే ఎండిన బావులు, నెర్రెలు బారిన భూములు..అవే వలసలు…అప్పటికే చిద్రమైన పల్లె మరింత దరిద్రమయ్యేది. పల్లె జీవితం చిన్నాభిన్నమయ్యేది. కాని తెలంగాణ రాగానే పల్లెకు వెలుగొచ్చింది. పల్లె మురిసిపోయేంత సంతోషం నిండిరది. ఏళ్ల తరబడి పంటలకు పనికి రాకుండా పోయిన భూముల్లో మళ్లీ పంటల కళ వచ్చింది. ప్రతి ఎకరం సాగుకు యోగ్యమైంది. ఆరు తడి పంటల భూములన్నీ, పొలాలుగా మారాయి. నిత్యం నీటితో కళకళలాడే పంట పొలాలయ్యాయి. ఇదే కదా తెలంగాణ కోరుకున్నది. ఇదే కదా! ప్రతి రైతు ఆశించింది. ఈ నీటి కోసమే కదా! రైతు కన్నీరు కార్చింది. ఏదేశమైనా పాడి పంటలు బాగుంటేనే ఆ దేశం అన్ని రకాలుగా అభివృద్ది చెందుతుంది. ముందు సాగు, ఆపైనే ఇతర బాగు అని పెద్దలు అందుకే అన్నారు. అది తుచ తప్పకుండా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనుసరించారు. ఒకనాడు పంటలంటే, పచ్చని పొలాలంటే సీమాంధ్ర గురించి చెప్పుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నారు. తెలంగాణ లో పచ్చని కాంతిని చూస్తున్నారు. 

  తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లే అన్నారు. కాని పరాయి పాలకులను పారద్రోలినట్టే చీకట్లను కూడా తెలంగాణ తరిమేసింది. 

వెలుగులు నింపుకున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పుణ్యంతో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతున్నది. సీలేరు నుంచి కరంటు ఇవ్వకున్నా, కోతలు లేని కరంటు మన సొంతమైంది. కేసిఆర్‌ ప్రణాళిక ప్రకారం నిరంతరం కరంటు వస్తోంది. కాని అదే సీమాంద్రలో కరంటు కటకట చూస్తోంది. ఏ రైతుకు కరంటు కష్టం తెచ్చిపెట్టారో..తెలంగాణ రైతు గోస పుచ్చుకున్నారో…అదే తెలంగాణలో 24గంటల కరంటు రైతుకు ఉచితంగా అందుతోంది. రైతు కష్టం తీరుతోంది. రైతు కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒకనాడు కరంటు కోసం ఎదురుచూసి, ఎదురుచూసి, రాత్రిళ్లు బావుల దగ్గర నిద్రలు చేసి, పురుగు, పుట్రలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతికిన రైతన్నకు కరంటు అన్ని వేళలా అందుబాటులో వుంటోంది. ఇదీ తెలంగాణ సాధించిన విజయం. తెలంగాణ వస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన వారికి కళ్లముందు కనిపిస్తున్న సమాధానం. ఇక రైతు కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందిస్తున్న ఏ ఒక్క పధకం దేశంలోనే ఎక్కడా లేదు. ఏరాష్ట్రంలో రైతుబంధులేదు. రైతు భీమా లేదు. రైతు పండిరచిన ధాన్యం నేరుగా ప్రభుత్వమే కొనుగోలు లేదు. తెలంగాణలో అందుతున్న గిట్టుబాటు ధర ఎక్కడా అందడం లేదు. ఇదీ తెలంగాణ రైతు మాత్రమే అందుతున్న వరం. ఇది దేశం మెచ్చిన తెలంగాణ. ఇది కేసిఆర్‌ తెచ్చిన తెలంగాణ. కేసిఆర్‌ చేతిలో రూపు దిద్దుకున్న తెలంగాణ.

1000 కిలోమీట‌ర్లు.. 500 పైగా గ్రామాలు.. 30కి చేరువ‌లో నియోజ‌క‌వ‌ర్గాలు

 

సీఎల్పీ నేత జ‌న‌నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క మార్చి 16న చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర 85వ రోజు నాటికి
996 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ పాద‌యాత్ర‌లో వంద‌ల 500 పైగా గ్రామాలు.. తాండాలు, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు చుట్టేస్తూ సాగుతోంది.

గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్ట‌డుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్ర‌జ‌లు.. భ‌ట్టి విక్ర‌మార్క‌ను జ‌న నాయ‌కుడిగా పేర్కొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చే చుక్కానిలా భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర ముందుకు సాగుతోంది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీకి దూర‌మైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అట్ట‌డుగు, అణ‌గారిన వ‌ర్గాన‌లు తిరిగి పార్టీకి ద‌గ్గ‌ర చేయ‌డంలో భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర విజ‌యం సాధించింద‌ని చెప్ప‌వ‌చ్చు. .

మార్చిన 16న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం బజరహాత్నూర్ మండ‌లం పిప్పిరి గ్రామం నుంచి పాద‌యాత్రను ప్రారంభించారు. ఇప్న‌టికే బోథ్‌, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంప‌ల్లి, చెన్నూర్, మంచిర్యాల‌, రామ‌గుండం, ధ‌ర్మ‌పురి, పెద్ద‌ప‌ల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వ‌ర్ధ‌న్న‌పేట‌, వ‌రంగ‌ల్ వెస్ట్, స్టేష‌న్ ఘ‌న్ పూర్, జ‌న‌గామ‌, అలేరు, భువ‌న‌గిరి, ఇబ్ర‌హీం ప‌ట్నం, ఎల్బీన‌గ‌ర్, మ‌హేశ్వ‌రం, రాజేంద్రనగర్, చేవెళ్ల‌, షాద్ న‌గ‌ర్, ప‌రిగి, జ‌డ్చెర్ల‌, నాగ‌ర్ క‌ర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర సాగింది.

సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర కొన‌సాగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం కావ‌డంతో పాటు.. కేడ‌ర్ లో స‌రికొత్త జోష్ నెల‌కొంది. దీంతో ఇప్పుడు పాదయాత్ర వెళ్లని నాయకులనుంచి.. మా నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీద తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. భట్టి పాదయాత్ర నియోజకవర్గాల్లో సాగితే.. పార్టీలో కొత్త జోష్ రావడంతో పాటు, అభ్యర్థుల గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయన్న అంచనాలతో.. పీపుల్స్ మార్చ్ పై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

గాలి దుమారాలు.. విపరీత ఎండలు.. ఊహించన భారీ వర్షాలు.. అయినా కూడా తనతో నడిచే కార్యకర్తలతో సమానంగా టెంట్ లో ఉంటూ.. వారితో కలిసి తింటూ.. కలియ తిరుగుతున్న భట్టి విక్రమార్క.. సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా మారారు. కాంగ్రెస్ నౌకను గెలుపు తీరాలకు చేర్చే.. తెరచాపలా.. భట్టి విక్రమార్క ముందుకు సాగుతున్నారు.

ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ హన్మకొండ జనగామ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ నల్లగొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కొనసాగిన తరువాత
ఈనెల 25 నాటికి 101 రోజులు పాదయాత్ర పూర్తి అవుతుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరవుతారు. ముగింపు సభకు దాదాపుగా రెండు లక్షల పైగా జనాలు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగానే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎండల్లో ఎంత యాతన!

`తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుక.

`అటు నాయకులు, ఇటు అధికారులు.

`ఎండలను కూడా లెక్క చేయకుండా అభివృద్ధి పనులు.

`ఉత్సవాలలో ఇరవై రోజుల పాటు ప్రజలతో మమేకం.

`చెరువులో తట్టెడు మట్టి తీయని వాళ్లు కూడా తెగమాట్లాడుతున్నారు.

`ఊరుకు కళొచ్చిందంటే అది బిఆర్‌ఎస్‌ తోనే…

`పల్లెకు వెలుగొచ్చిందంటే బిఆర్‌ఎస్‌ తోనే

`చెరువే ఊరికి ఆదరువు.

`కుల వృత్తులకు బతుకుదెరువు.

`సాగును కాపాడే కల్పతరువు.

`ఊరందరికీ ఉపకారి చెరువు.

`ఆ చెరువును గాలికొదిలేసిన వాళ్లు మాట్లడడం దెయ్యాలు వల్లించడమే?

`తెలంగాణ రాకపోతే చెరువు లేదు.

`పల్లెకు బతుకుదెరువు లేదు.

`పల్లె వికాసమే లేదు.

`అలాంటి పల్లెను కాపాడుతున్నది బిఆర్‌ఎస్‌.

`ప్రజల గుండెల్లో వున్నది బిఆర్‌ఎస్‌.

`ప్రజలకు ఆమడ దూరంలో వున్నవి ప్రతిపక్షాలు.

`అధికారంలో వున్ననాడు పట్టించుకోలేదు…ప్రతిపక్షంలో వుండి ప్రగతిని ఓర్చుకోలేరు.

`అందుకే ప్రతిపక్షాలు ప్రజల దరి చేరడం లేదు.

`ప్రజా సంక్షేమం ప్రతిపక్షాల డిక్షనరీలోనే లేదు.

`అందుకే అభివృద్ధి వారి కళ్లకు కనిపించదు.

`అభివృద్ధి వారికి సహించదు.

`అభివృద్ధి అంటే బిఆర్‌ఎస్‌… సంక్షేమం అంటే కేసిఆర్‌. ఇదీ జనం మాట.

హైదరబాద్‌,నేటిధాత్రి:                తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల వేళ బిఆర్‌ఎస్‌ నాయకులు యాతన పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. అయినా అది ఎంతో సంతోషంగానే స్వీకరిస్తున్నారు. ప్రజల కోసం పడుతున్న ఇబ్బందులను ఆనందంగా చెప్పుకుంటున్నారు. ఉద్యమ కాలం నాడు అటుకులు బుక్కి ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్‌ నేతలే…ఇప్పుడు అధికారంలో వున్నా, మండుటెండల్లో ప్రజలకు చేరువలో వున్నదికూడా బిఆర్‌ఎస్‌నేతలే…కాని పని లేని ప్రతిపక్షాలు ఇళ్లు కదలకుండా అభివృద్ధిని చూడలేకపోతున్నారు. ప్రగతిని జీర్ణించుకోలేకపోతున్నారు. పల్లెల కాంతులను చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అందుకే ప్రతిపక్షాలు చేసే విమర్శలను ప్రజలు చీకొడుతున్నారు. ఏనాడైనా గతంలో అధికారంలో వున్న పార్టీలు ఇప్పుడు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న పనులు చేశారా? అంటూ ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఆనాడైనా ఈనాడైనా ప్రజల్లో వున్నది, వుండేది బిఆర్‌ఎస్‌ నాయకులే అంటున్నారు. ఎందుకంటే సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణకు అన్యాయం జరక్కుండా చూసింది కూడా బిఆర్‌ఎస్సే. ఆనాటి పాలకులు చేసిన ప్రతి ప్రజావ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించింది బిఆర్‌ఎస్సే. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు కరంటు బిల్లులు విపరీతంగా పెంచినప్పుడు ప్రశ్నించింది ముందు ఆనాటి ఉప సభాపతిగా వున్న కేసిఆరే…ఆనాడు విద్యుత్‌ చార్జీల ఉప సంహరణకు చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి, ప్రజల్లోకి వచ్చింది కేసిఆరే..అలా ఆయన ప్రజల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా ప్రతిపక్షంలో వున్నా, నేడు అధికారంలో వున్నా ప్రజల్లో వుండే ఏకైక పార్టీ బిఆర్‌ఎస్సే. ఇక తెలంగాణ ఉద్యోగులు సైతం దశాబ్ధి ఉత్సవాలలో ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజల మన్నననలు పొందుతున్నారు. గతంలో అధికారులు కార్యాలయాలు వదిలి బైటకు వచ్చేవారు కాదు. నాడు పాలకులు ప్రజల్లోకి వచ్చేవారు కాదు. అదికారులను పనిచేయనిచ్చేవారు కాదు. పాలకుల ఇష్టారాజ్యం అన్నట్లు వుండేది. కాని నేడు ప్రభుత్వ పెద్దలు ఎంతగా ప్రజల్లో వుంటున్నారో, అదికారులు కూడా అంతగా ప్రజలకు చేరువౌతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాని ప్రతిపక్షాలు మాత్రం రోజు రోజురోజుకూ ప్రజలకు దూరమౌతున్నారు. 

 తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు మండుటెండల్లో జరుగుతున్నాయి. 

ఉదయం వేళలోనే సూర్యుడు చుర్రుమంటున్నాడు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజల్లోనే వుంటున్నారు. దశాబ్ధి ఉత్సవాలలో నిత్యం పాల్గొంటున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులలో కనిపించే అంకితభావం మరో పార్టీలో వుండదు. అందుకే తెలంగాణ ప్రజలు ఇతర పార్టీలకు స్ధానం లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా చెరువుల పండగ అన్నది ఎంత గొప్పగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు, పత్రికలు లేని పోని కథనాలు వండి వార్చడాన్ని ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో పల్లెలు ఎలా వుండేవి? ఇప్పుడు ఎలా వున్నాయన్న విషయం తెలిసి కూడా తెలియనట్టు, ప్రజలను ఏమార్చే కనికట్టు ప్రతిపక్షాలు చేయాలని చూస్తే ప్రజలు హర్షించరు. ఇప్పటికే ప్రతిపక్షాలను ప్రజలు ఆదరించడం లేదు. అయినా వారిలో మార్పు రావడం లేదు.

తెలంగాణ వచ్చాక ఊరు మారింది.

 చెదిరిన కల కొత్త రూపును సంతరించుకున్నది. పల్లెకు మళ్లీ కొత్త సొగబు వచ్చింది. పల్లె రూపులకు రేఖలకు కొత్త కళ వచ్చింది. ఎండిన పైర్లు, బీడు వారిన భూములు, పల్లెర్లు మొలిచి పొలంఆనావాలు లేని భూములకు మళ్లీ మట్టివాసన అద్దింది. పూడిపోయిన బావులకు ఊటలు వచ్చాయి. ప్రతి ఊరిలో, ప్రతి గల్లీలో సిసి రోడ్లు వచ్చాయి. పచ్చదనం పెరిగింది. ఊరి చెరువు బాగుపడిరది. చెరువు కట్టలకు కొత్త దనం వచ్చింది. చెరువు కట్టల మీద ఊత వనాలు పురుడుపోసుకున్నాయి. చెరువు కట్టంతా అల్లుకున్నాయి. ఊరే చెరువుకు ఆదరవు. ఊరులో చెరువుంటే ఊరంతటికి కల్పతరువు. ఊరిలో చెరువుంటే, అది నిండుగా వుంటే పంటలకు కొదవలేదు. అందుకే తెలంగాణ రాగానే ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెరువుల పండగ మిషన్‌ కాకతీయను మొదలుపెట్టారు. ముందు చెరువుల బాగోగులు చూశాడు. చెరువులను మరమ్మత్తులు చేయించాడు. పాత కట్టల స్ధానంలో మరింత కొత్త కొత్త కట్టలు నిర్మాణం చేయించాడు. చెదిరిన చెరువులను తవ్వించాడు. పూడికను రైతుల భాగాస్వామ్యంతో పొలాలలకు మళ్లింపజేశాడు. చెరువుల పూడిక కార్యక్రమం పండగలా చేయించాడు. ,చెరువులన్నీ గోదారి జలాలలో నింపారు. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్లు దుంకించారు. దాంతో తెలంగాణ పల్లె రూపు ఒక్కసారిగా మారిపోయింది. వందేళ్ల కింది గొలుసుకట్టు చెరువులకు మళ్లీ కల వచ్చింది. చెరువుల్లోకి నీరొచ్చింది. బావులకు ఊటలొచ్చాయి. ఎండిన బోర్లు ఎల్లబోశాయి. పడావు పడిన భూములు మళ్లీ పొలాలయ్యాయి. వలసవెళ్లి రైతులంతా మళ్లీ ఊళ్లకు చేరుకున్నారు. వ్యవసాయం సాగిస్తున్నారు. రైతు బంధు అందుకుంటున్నారు. పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. అఫ్పులేకుండా వ్యవసాయం సాగిస్తున్నారు. ఇరవైనాలుగు గంటల ఉచిత కరంటు అందిస్తున్నారు. పండినపంటలను రైతు కల్లాల దగ్గరకే అధికారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. గతంలో రైతులే మార్కెట్‌ యార్డుకు తరలించి అమ్ముకునే దుస్ధితి నుంచి బైటపడ్డారు. రైతు తన పంట రాశి మీద దర్జాగా కూర్చొకొని తనదగ్గరికే అదికారులొచ్చి కొనుగోలు చేసుకుంటుంటే రాజులా తన ధాన్యాన్ని అమ్ముకుంటున్నాడు. ఇదీ ఇప్పుడు తెలంగాణ రైతు అనుభవిస్తున్న ఠీవి. మరి గతంలో రైతుపరిస్ధితి ఎలా వుండేది. చెరువు దుస్దితి ఎలా వుండేదో ప్రతిపక్షాలకు తెలియంది కాదు. కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 45 సంవత్సరాలు పాలించినా, ఏనాడు తెలంగాణకు చుక్క నీరు తెచ్చే యోచన చేయలేదు. నాటి పాలకులతో కొట్లాడి సాధించింది లేదు. చెరువుల బాగోగులు చూసంది లేదు. కనీసం చెరువుల పూడిక తీస్తే, తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందని అడిగింది లేదు. కాని నేడు చెరువుల పండగతో కులవృత్తులకు మేలు జరిగింది. అందుకే ఊరూరు చెరువుల పండగ జరుపుకుంటోంది. ఒకనాడు చెరువుల్లో నీళ్లు లేవు. చేపలు లేవు. ముదిరాజ్‌లకు ఉపాధి లేదు. కాని నేడు చెరువుల్లో పుష్కలమైన మత్య్స సంపద. ముదిరాజ్‌కు కళ్లముందు ఉపాధిపండగ. రజకులకు కూడా చెరువుల ద్వారా కుల వృత్తిపోషణ జరుగుతోంది. ఇలా రైతులకు మేలు జరుగుతోంది. చెరువు కట్టలపై వెలసిన ఈత వనాల మూలంగా గౌడసామాజిక వర్గానికి మరింత ఉపాది దొరికింది. ఇలా చెరువు ఊరికి కల్పతరువైంది. పూర్వం తెలంగాణ పల్లె సింగారం మళ్లీ ఇప్పుడు కళ్లముందు కదలాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాలలో చెరువు ఒక గొప్ప వరంగా మారింది. ప్రజలకు జీవనాడిగా మారింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలంటే, ఊరు బాగు పడిరదంటే అది ముఖ్యమంత్రి కేసిఆర్‌పుణ్యమే…ఆయన ఆలోచనల రూపమే…పచ్చని పైట సింగారించకున్న పల్లె ముస్తాబుకు సాక్ష్యమే..

కూసుకుంట్లకిస్తే ఒప్పుకోం?

`ఈసారి మాత్రం అసలే సహకరించం?

`మాకు విలువివ్వని కూసుకుంట్ల కోసం పని చేయం.

`కేవలం పార్టీ ఆదేశాలకు బద్దులై కూసుకుంట్లను గెలిపించాం.

`కార్యకర్తలను పట్టించుకున్నది లేదు.

`నాయకులకు అండగా నిలిచింది లేదు.

`ఎన్నికల సమయంలో నాయకులు చేసిన పనులకు బిల్లులు ఇచ్చింది లేదు.

`పార్టీ కోసం ఎంత కష్టమైనా పడతాం.

`కూసుకుంట్లకు ఇస్తే మాత్రం సహకరించం.

`మునుగోడులో బిఆర్‌ఎస్‌ బలంగా వుంది.

`కూసుకుంట్లకిస్తే మొదటికే మోసానికొస్తుంది.

`ఈసారి బిసిలకిస్తేనే బెస్ట్‌!

`గత ఉప ఎన్నికలలో కూడా పార్టీ శ్రేణులు కోరిందిదే!

`సార్వత్రిక ఎన్నికలలో బిసికి టికెట్‌ ఇస్తే బిఆర్‌ఎస్‌ గెలుపు గ్యారెంటీ!

`కూసుకుంట్ల కోసం రెండు నెలలు సహకరించింది నేటిధాత్రి.

కూసుకుంట్ల పనితీరును ప్రశ్నించే హక్కు నేటిధాత్రి కె ఉంది

`పని చేయకుంటే నిలదీస్తామని ముందే చెప్పింది నేటిధాత్రి.

`అందుకే నేటిధాత్రి కి పిర్యాధులందుతున్నాయి.

`మునుగోడు గ్రౌండ్‌ రిపోర్ట్‌ నేటిధాత్రి చేతిలో…

`నేటిధాత్రి కథనంపై కూసుకుంట్ల అక్కసు.

`గెలిపించిన వాళ్లకు ప్రశ్నించే హక్కుంటుందని మర్చిపోయిన కూసుకుంట్ల.

`ఈసారైనా ప్రజల మనసు చూరగొనేలా వ్యవహరించమని చెప్పాం.

`అయినా కూసుకుంట్లలో మార్పులేదంటున్న జనం.                                     

హైదరబాద్‌,నేటిధాత్రి: 

నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైనట్లు…ప్రజలు నాయకుడిగా ఎన్నుకున్నాక కూడా తీరు మారకుంటే ఇంతకంటే ఏ మంటారు? రాజకీయాలు కావాలి. పదువులు కావాలి. పెత్తనం నడదవాలి. కాని ప్రజల్లో వుండను. ప్రజల సమస్యలు పట్టించుకోను. ప్రజలను దరి చేరనీయను. పార్టీకి అండగా నిలవను. పార్టీ నాయకులను కలవను. వారిని ప్రోత్సహించను. వారికి ఎలాంటి దారి చూపను. రాజకీయంగా వారి ఉన్నతిని కోరుకోను? వారెవరికీ అందుబాటులో వుండను. కాని ఎన్నికలప్పుడు మాత్రం వారు పనిచేయాలి. తన గెలుపుకోసం కష్టపలి. తనను గెలిపించాలి. ప్రతిసారి నేనే నిలబడాలి. మీరంతా నా గెలుపుకోసం కృషి చేయాలి. గెలిపించి మళ్లీ ఎన్నికల దాకా నన్ను మర్చిపోవాలి. ఇదీ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తీరని అటు జనం, ఇటు పార్టీ నాయక గణం చెప్పుకుంటున్న మాట. పార్టీ పేరు చెప్పుకొని రాజకీయాలు చేయాలి. ఉద్యమ కారుడిగా పదవులు కావాలి. కాని ప్రగతిని కాంక్షించలేని, అభివృద్ధి గురించి తాపత్రయపడని నాయకుడు ఎవరైనా వున్నారంటే అది మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్లనే అని జనం చెబుతున్నారు. అదేంటో జనంలో లేకపోయినా, జనం వద్దనుకున్నా, కొన్ని సార్లు అదృష్టం కలిసొచ్చి పదవులు వరిస్తుంటాయి. అయినా వాళ్లు ప్రజల కోసం ఆలోచించరు. 2014 ఎన్నికల్లో మునుగోడు ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెలిచారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ మొత్తం బిఆర్‌ఎస్‌ ప్రభంజనం కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా బిఆర్‌ఎస్‌ 88 సీట్లు గెల్చుకున్నది. కాని మునుగోడు కాంగ్రెస్‌ కైవసం చేసుకున్నది. మునుగోడు అభివృద్ధి జరగలేదా? అంటే తెలంగాణలోని అన్ని నియోకవర్గాల కంటే ఒకింత ఎక్కువే జరిగింది. అప్పటి వరకు మునుగోడులో వున్న సమస్యలన్నీ దాదాపు తీరాయి. అయినా మునుగోడులో కూసుకుంట్ల ఎందుకు ఓడిపోయాడు? అంటే మునుగోడు అభివృద్ధి జరిగింది వాస్తవం. కాని ఆ ముగుగోడు అభివృద్ధిలో కూసుకంట్ల పాత్ర లేదనేది కూడా మరింత వాస్తవం. మునుగోడు అభివృద్దిపై ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టి, ప్రగతిపై ప్రత్యేక శ్రద్దపెట్టి అతి తక్కువ కాలంలో మునుగోడు రూపు రేఖలు మార్చాడు. పైలెట్‌ ప్రాజెక్టుల కింద మునుగోడును ముందంజలో నిలిపారు. మునుగోడును అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు. కాని ఆ అభివృద్ధిలో కూసుకుంట్ల పాత్ర ఎంత? అంటే ఆయనే చెప్పలేనంత? ఎందుకంటే జరిగిన అబివృద్ది కళ్ల ముందు కనిపిస్తున్నది. కాని 2018 ఎన్నికల్లో కూసుకుంట్ల ఓడిపోయాడు. అంటే అక్కడ పార్టీ ఓడిపోలేదు. ఎమ్మెల్యే వ్యవహార శైలి మాత్రమే ఓటమిపాలయ్యింది. అంతగా మునుగోడు అభివృద్ధి జరిగినా ఆయన ఖాతాలో పడలేదంటే ఆయన నిర్లక్ష్యం ఎంతో చెప్పకనే చెప్పొచ్చు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేలంతా బంబపర్‌ మెజార్టీతో గెలిచారు. దాదాపు సగం మంది బిఆర్‌ఎస్‌ ఎమ్యెల్యేలు 50 వేలు, 60వేల మెజార్టీపైనే గొప్ప విజయాలు సొంతం చేసుకున్నారు. కాని మునుగోడులో కూసుకుంట్లను ప్రజలు ఆదరించలేదు. కేవలం ఉద్యమ కారుడన్న ఒకే ఒక్క కారణంతో మునుగోడు ఉప ఎన్నికల్లో ఎంత మంది టికెట్‌ కోసం ఆశించినా అందిరినీ కాదని మళ్లీ కూసుకుంట్లకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ అవకాశం కల్పించారు. ఒక్క కూసుకుంట్ల కోసం బిఆర్‌ఎస్‌ యంత్రాంగమంతా దిగి ప్రచారం సాగించింది. మరి అదంతా కూసుకుంట్లకు గుర్తుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ఎలా వున్నాడో? ఇప్పుడూ అలాగే వున్నాడు. ఎక్కడా ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ప్రజలను పట్టించుకునేంత తీరిక లేదు. ఎండల్లో బైటకు రాలేదు. ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ఆలోచన లేదు. పార్టీ కార్యకర్తల సమావేశాలు పెద్దగా ఏర్పాటు చేసింది లేదు. సమన్వయం అన్నది అసలే లేదు. ఇది బిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు భహిరంగంగానే చెబుతున్న మాట. విమర్శిస్తున్న మాట. ఎన్నికల ముందు పార్టీకి చెందిన నేతలంతా అసమ్మతి రాగమే ఆలపించారు. ఆయనకు మద్దతుగా నిలబడిన వారు ఎవరూ లేరు. అయినా పార్టీ ఆదేశాలు క్రమశిక్షణ కలిగిన పార్టీ యంత్రాంగం శిరసావహించింది కూసుకుంట్లను గెలిపించింది. మరి కూసుకుంట్ల ఏం చేశాడన్నదే ఇక్కడ ప్రశ్నగా మారింది. 

ఉప ఎన్నికల్లో రెండు నెలల పాటు కూసుకుంట్లకు మద్దతుగా, తెలంగాణ ఉద్యమంలో భాగాస్వామ్య పత్రికగా ఇప్పటికీ తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ నిర్మాణంలో లో పాలు పంచుకుంటున్న తెలంగాణ పత్రిక నేటిధాత్రి.

 మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మునుగోడు ప్రగతిపై ఏ పత్రిక రాయనటు వంటి వార్తలు రాసింది ఒక్క నేటిధాత్రి మాత్రమే. మునుగోడుపై ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎంత ప్రేమ వుందనేది కూడా చూపించింది నేటిధాత్రి మాత్రమే. ఫ్లోరైడ్‌ సమస్య తరిమేసిన విషయాన్ని మళ్లీ ప్రజల ముందు పెట్టింది నేటిధాత్రినే. కూసుకుంట్లకు పార్టీ శ్రేణులు వ్యతిరేకంగా జట్టు కట్టినా, అందరినీ ఒక్కటి చేయడంతో నేటిధాత్రి చూపిన కూసుకుంట్ల మర్చిపోకూడదు. కూసుకుంట్లకు క్లిష్ట కాలంలో అండగా నిలిచింది కూడా నేటిధ్రాతినే. మరి అలాంటి నేటిధాత్రి మునుగోడులో పరిస్దితులను ఎప్పటికిప్పుడు వివరిస్తుంటే కూసుకుంట్లకు నచ్చడం లేదు? అందుకు నేటిధాత్రి మీద విషం చిమ్ముతున్నాడు. కూసుకుంట్లను నిలదీసే హక్కు నేటిధాత్రికి మాత్రమే వుంది. నేటిధాత్రి ఇచ్చిన నైతిక మద్దుతు, అక్షరాల కవచం అంత గొప్పది. మేలు చేసిన వారిని మర్చిపోయిన వ్యక్తైనా, వ్యవస్ధ అయినా మనుగడ కష్టం. అదే ఇప్పుడు కూసుకుంట్లకు కూడా కనిపిస్తోంది. ఎంతో కష్టపడి పార్యీ శ్రేణులన్నీ ఏకమైన కూసుకంట్లను గెలిపిస్తే వారిని కనీసం పట్టించుకోవడం లేదన్న విషయాలు అనేకం నేటిధాత్రి దృష్టికి వస్తున్నాయి. నిజానికి మునుగోడులో పార్టీ ఎంతో బలంగా వుంది. కాని కూసుకుంట్ల నాయకత్వమే బలహీనంగా వుంది. అలాంటి నాయకుడిని ప్రతిసారి కాపాడుకుంటూ రావడం పార్టీకి కూడా తలకు మించిన భారమే అవుతుంది. ఉప ఎన్నిక అంటే అందరూ వచ్చి కూసుకుంట్లకు మద్దతుగా నిలిచారు. ప్రచారం సాగించారు. కాని సార్వత్రిక ఎన్నికల్లో కూసుకుంట్ల ఒంటిరి పోరు చేయాల్సివుంటుంది. అది ఆయన వల్లకాని పని. అప్పనంగా మళ్లీ 2018 ఎన్నికల్లో జరిగినట్లు జరిగేందుకు కూడా కూసుకంట్లే కారణం కావొచ్చు. అందుకే ప్రజలు ఆసారి ఎలాగైనా కూసుకుంట్లను పక్కన పెట్టాలని కోరుతున్నారు. మునుగోడులో ఏం జరుగుతోంది. ప్రజలు ఏం అనుకుంటున్నారన్నది పూర్తిగా నేటిధాత్రి చేతిలో రిపోర్టు వుంది. పార్టీ నాయకులు చేసిన పనులకు బిల్లులు కూడా కూసుకంట్ల ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడంటే ఇక పార్టీ కోసం పనిచేయమంటే ఎలా చేస్తారు? సొంత పార్టీ నేతలను కూసుకుంట్ల ఇబ్బందుల పాలు చేయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం కూసుకంట్ల వల్ల ఉప ఎన్నికల సమయంలో పార్టీ కూడా కొంత దెబ్బతిన్నది. బిసి సామాజిక వర్గానికి చెందని బలమైన నాయకుడు, ఉద్యమకారుడైన ఓ నేత పార్టీని వదిలి వెళ్లిపోయాడు. మునుగోడులో ఎంతో బలమైన మూడు బిసి, సమాజిక వర్గాలకు చెందిన నాయకులను కాదని, కూసుకుంట్లకు టిక్కెట్‌ ఇస్తే దానిని నిలుపోకపోవం ఆయన వ్యవహార శైలికి నిదర్శనమంటున్నారు. ఈసారి కూసుకుంట్లకు కాకుండా, బసిలలో ప్రజల కు చేరువగా వుంటున్న నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆ నేతల్లో ఎవరినో ఒకరిని ఎంపిక చేయాల్సిన అవసరవం వుంది. ప్రజల క్షేమం కోసం, వారి అభ్యున్నతి కోసం పనిచేస్తున్న నేతలున్నారు. అలాంటి వారి గురించి మునుగోడులో కూడా మంచి పేరుంది. అలాంటి నాయకుడిని గుర్తించాలి. ఒక వేళ మళ్లీ కూసుకుంట్లను ప్రజల మీద రుద్దితే మాత్రం 2018 ఎన్నికల ఫలితాలు పునరావృతం కావడం ఖాయం? అంటున్నారు జనం.

నూతన వధూవరులను ఆశీర్వధించిన – నారబోయిన రవి ముదిరాజ్

మునుగోడు నియోజకవర్గం

మునుగోడు మండలం కొరటికల్ గ్రామ వాస్తవ్యులు బోనగిరి లక్ష్మయ్య – మల్లమ్మ గారి కుమారుడు నర్సింహా – స్నేహ గారి వివాహ వేడుకకి హాజరై నూతన వధూవరులను ఆశీర్వధించి శుభాకాంక్షలు తెలియజేసిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారు.*

 

ఈ కార్యక్రమంలో మునుగోడు మండల వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్ గారు, కొరటికల్ గ్రామ పంచాయతీ 10 వార్డ్ సభ్యులు అరేకంటి నర్సింహా గారు, బిఆర్ఎస్ పార్టీ మండల యువ నాయకులు జంగిలి నాగరాజు గారు, మునుగోడు పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బండారు మల్లేష్ గారు, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఉప అధ్యక్షులు సిర్గమళ్ళ అంజయ్య గారు, బోనగిరి లక్ష్మణ్ గారు, తమ్మల పురుషోత్తం గారు, మరియు తదితరులు పాల్గొన్నారు.

టిడిపి+బిజేపి-కాంగ్రెస్=బీఆర్ఎస్‌

 

రేవంత్ రెడ్డి నోటికి చంద్రబాబు తాళం?

తన రాజకీయమా! గురు దక్షిణకు కాంగ్రెస్ ను ముంచడమా!?

అడకత్తెరలో రేవంత్?

చంద్రబాబు కోసం తన భవిష్యత్తు తుంచుకుంటాడా?

అటు సీనియర్లు! ఇటు చంద్రబాబు!!

టిడిపి ని తిట్టలేడు.

బిజేపిని మెచ్చుకోలేడు.

ఆ పొత్తును అనైతికం అనలేడు.

ఓటుకు నోటు కోసం అప్పుడు!

బిజేపి పొత్తుతో ఇప్పుడు!!

రేవంత్ ఆశలపై ఊహించని దెబ్బలు!

చంద్రబాబు ను నమ్మినందుకే ఇన్ని తిప్పలు?

రేవంత్ తొందరపాటుకు పర్యవసానాలు!

ఆ పొత్తును తూర్పార పట్టకపోతే రేవంత్ కు మనుగడ లేదు.

చంద్రబాబును రాజకీయం ఇప్పటికీ రేవంత్ తెలుసుకోవడం లేదు.

కాంగ్రెస్ ను ఫణంగా పెడతాడా?

తానే టిడిపి గూటికి చేరుతాడా?

కాంగ్రెస్ సీనియర్ల భయం నిజం చేస్తాడా?

రేవంత్ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

హైదరబాద్‌,నేటిధాత్రి:  

ఊహలకు, ఊహించని మలుపులు తోడైతే ఆ రాజకీయం రసతవత్తరంగా వుంటుంది. కాని అనుభవించే నాయకులకు మాత్రం భవిష్యత్తుపై గందరగోళం నెలకొంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అదృష్టమో, లేక తెలంగాణ ప్రజల బలమైన కోరికో గాని ప్రతిపక్షాల వల్ల కూడా బిఆర్‌ఎస్‌ ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల రాజకీయాలు వేరు. తెలంగాణ రాజకీయం వేరు. ఇక్కడ రెండు ప్రాంతాల ప్రజలు, నాయకులు, పార్టీలు వుండడం మూలంగా జనం నాడి అంతు చిక్కకుండా వుంటుంది. ముఖ్యంగా ఈసారి రాజకీయాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రేవంత్‌ రెడ్డికి మళ్లీ గట్టి దెబ్బ తగిలే అవకాశమే కనిపిస్తోంది. అదేంటో వ్యక్తిగత రాజకీయం ఎంత ఎదిగినా, రేవంత్‌ రెడ్డి ఏ పార్టీలో వుంటే ఆ పార్టీ పరిస్థితి చెప్పలేని విధంగా తయారౌతోంది. రేవంత్‌రెడ్డి రాజకీయ ఓనమాలు బిఆర్‌ఎస్‌నుంచి మొదలైనా, గుర్తింపు రాజకీయాలు తెలుగుదేశంతో ఆరంభమయ్యాయి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. దాంతో రేవంత్‌రెడ్డి క్రియాశీల రాజకీయాలు ఆపార్టీకి అవసరమయ్యాయి. చంద్రబాబు బాగానే పార్టీకి వాడుకోవాలని అనుకున్నాడు. దాంతో రేవంత్‌కు చంద్రబాబు ప్రాదాన్యతనిస్తూ వచ్చారు. అది వ్యక్తిగతంగా రేవంత్‌కు గుర్తింపుతెచ్చింది. కాని పార్టీ రాజకీయం ఆగమ్యగోచరమైంది. ఇంతలో తెలంగాణ వచ్చింది. మొత్తానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అడ్రస్‌ లేకుండాపోయింది. చంద్రబాబు తెలంగాణను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అందుకు కారణం కూడా రేవంత్‌రెడ్డే కావడం గమనార్హం. చంద్రబాబు చెప్పాడని ఓటుకు నోటు కేసులో కూడా రేవంత్‌ ఇరుకున్నాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కన్నెర్ర చేయడంతో చంద్రబాబు రాత్రికి రాత్రే తట్టాబుట్టా బుట్ట సర్ధుకొని పోయాడు. హరిహర బ్రహ్మాధులొచ్చినా చంద్రబాబును కాపాడలేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనేసరికి తెలంగాణ వైపు చూడడమే మానేశాడు. దాంతో తెలుగుదేశం మనుగడ సాగించడం కష్టమైంది. ఆ పార్టీ నుంచి చాలా మంది నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరడం జరిగింది. తెలుగుదేశంలో రేవంత్‌రెడ్డి వ్యవహారం నచ్చని వాళ్లంతా రేవంత్‌కు అప్పటికే పొగపెట్టారు. కాకపోతే రేవంత్‌ జైలుకెళ్లాడు. వచ్చిన తర్వాత తెలుగదేశంలో ఇమడలేకపోయాడు. ఇక ఎటూ కాని రాజకీయ ఊగిసలాటలో వున్న రేవంత్‌ భవిష్యత్తు నిర్ధేనంలో చంద్రబాబు కీలకభూమిక పోషించారు. కాంగ్రెస్‌తో మాట్లాడి ఆ పార్టీలో రేవంత్‌కు స్ధానంకల్పించారు. పనిలో పనిగా వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి కూడా ఇప్పించారు. ఇంతలో ఆంద్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో నిలువ నీడ లేకుండాపోయింది. రాజకీయం చేద్దామన్న ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండాపోయింది. దాంతో చంద్రబాబు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో నివాసం తెలంగాణలో అన్నట్లు తయారైంది. ఇంకో ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం రాజకీయాలు దూరమైతే, ఆ పార్టీ ప్రజలకు దూరమవడం ఖాయం. చంద్రబాబు తనయుడు లోకేష్‌ రాజకీయం క్లోస్‌. అందుకే లోకేష్‌తో చంద్రబాబా పాదయాత్ర మొదలుపెట్టించాడు. ఏ బిజేపితో వైరం పెంచుకున్నాడో అదే పార్టీతో మళ్లీ పొత్తుకోసం చంద్రబాబు పాకులాడుతున్నాడు. గత కొంత కాలంగా బిజేపి పెద్దలను కలవాలని ఆరాపడ్డాడు. ఆఖరికి ఇటీవల అమిత్‌షాతో పాటు, బిజేపి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు బేటీ అయ్యారు. రాజకీయాలు మాట్లాడుకున్నారు. తెలంగాణలో కలసి సాగేందుకు ముందు ఎన్నికల ట్రయల్‌ మొదలుపెడదామని అంగీకారానికి వచ్చారు? తెలుగుదేశం, బిజేపి కాంబోపై క్లారిటీ వచ్చినట్లే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సుబ్బి పెళ్లి వెంకి చావుకొచ్చినట్లు చంద్రబాబు బిజేపితో కలవడంతో రేవంత్‌ పరిస్ధితి కుడిలో పడ్డ ఎలుకలా మారిపోయింది. మింగలేక, కక్కలేని స్ధితికి వచ్చేసింది. ఎటూ పాలుపోని స్ధితికి నెట్టేయబడ్డటైంది. అసలైన రాజకీయం ఇప్పుడు తెలంగాణలో మొదలు కాబోతోంది. 

అసలు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలనుకున్నప్పటి నుంచి ఆ పార్టీ సీనియర్లు వ్యతిరేకిస్తూనే వున్నారు.

 రేవంత్‌ పార్టీలో చేరిన తర్వాత కూడా వ్యతిరేకించారు. పిసిసి. అధ్యక్షుడు కాగానే రేవంత్‌ రెడ్డి యాభైకోట్లు పెట్టి ప్రెసిడెంటు పదవి కొన్నాడని సాక్ష్యాత్తు ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అప్పటినుంచి సీనియర్లు రేవంత్‌రెడ్డి మీద కత్తికట్టారు. ఇప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌ను తూర్పారపడుతున్నారు. ఆయనను పార్టీ నుంచి తరిమేయాలనే చూస్తున్నారు. ఇప్పటిదాకా కాలం కలిసిరాలేదు. అధిష్టానం కూడా సీనియర్లు చెప్పిన మాట వినలేదు. రేవంత్‌ రెడ్డి రాజకీయం చాలా విచిత్రమైంది. ఆయన ఏ సభ నిర్వహించినా సక్సెస్‌ అవుతుంది. ఏ ర్యాలీ తీసినా గొప్పగా ప్రచారం జరుగుతుంది. కాని ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్‌ పరిస్ధితి అద్వాహ్నంగా తయారౌతుంది. హుజూరాబాద్‌ 2018 ఎన్నికల్లో 60వేల ఓట్లు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి, ఉప ఎన్నికల్లో మూడువేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు రేవంత్‌రెడ్డిని సీనియర్లు ఒక ఆట ఆడుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడ రాలేదు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన రేవంత్‌రెడ్డికి ప్రజల నుంచి చేదు అనుభవమే ఎదురైంది. ఇక రేవంత్‌రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టినా పాదాల మీద నడవలేక, అక్కడక్కడ పాదాలను భూమి మీద మోపి సాగించారనే విమర్శలు కూడా ఎదుర్కొనాన్నారు. ఆఖరకు షర్మిల చేత కూడా తిట్టించుకున్నారు. పాదయాత్ర అంటే ఎలా చేయాలో క్లాస్‌ పీకించుకున్నారు. అయితే పాదయాత్రలో ఎదురైన ప్రజలు రేవంత్‌ను చాలా వరకు గుర్తు పట్టలేదు. చివరికి నేను ఎవరు ? అంటే కూడా ప్రజలు ఏమో? అన్నట్లు మొహం పెట్టి, రేవంత్‌కు చుక్కలుచూపించారు. అయినా రేవంత్‌రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు తెలంగాణలో ఊపును తెచ్చిందని ప్రచారం జోరుగా సాగింది. ఇంతలోనే రేవంత్‌రెడ్డికి పిడుగులాంటి వార్త వినాల్సివచ్చింది. తన రాజకీయ గురువుగా చెప్పుకునే చంద్రబాబు మళ్లీ బిజేపితో కలుస్తున్నాడన్న వార్త విన్న తర్వాత రేవంత్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒక వేళ బిజేపి, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు పొడుపులు జరిగితే మాత్రం ముందు నష్టపోయేది రేవంత్‌రెడ్డి రాజకీయమే! ఎందుకంటే ఈ రెండు పార్టీలు జతకట్టి గతంలోనే కాంగ్రెస్‌ను ఖతం చేసే పని పూర్తి చేశాయి. మళ్లీ ఇప్పుడు కొత్త కలయిక జరిగినా కాంగ్రెస్‌ మీద యుద్దం ఆపరు. తెలుగుదేశంపార్టీకి బిఆర్‌ఎస్‌ మీద గురి వున్నప్పటికీ, బిజేపికి ముందు కాంగ్రెస్‌ మీద కసిని చూపించకుండా వుండలేవు. అందువల్ల తెలుగుదేశం, బిజేపిలు కలిసి బిఆర్‌ఎస్‌ మీద యుద్దం మొదలుపెట్టినా, ముందు కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేసే పని మాత్రమే పెట్టుకుంటారు. అదే జరిగితే ఆది నుంచి సీనియర్లు చెప్పిందే నిజమౌతుంది. రేవంత్‌ రెడ్డి రాజకీయం త్రిశంకు స్వర్గమౌతుంది. లేదా రేవంత్‌రెడ్డి సరిగ్గా ఎన్నికల మందు వదిలేసి తెలుగుదేశంలో చేరాల్సివస్తుంది. అదే జరిగితే రేవంత్‌రెడ్డి మీద ప్రజలకు వున్న ఆ కాస్త నమ్మకం కూడా పోతుంది. ఏ రకంగా చూసినా రేవంత్‌కు ఇబ్బందికరమే. కాంగ్రెస్‌లో వుంటూ చంద్రబాబుపై కాలు దువ్వలేడు. బిజేపికి లొంగిపోలేడు. కాంగ్రెస్‌ను వదిలిపోవడమొక్కటే శరణ్యమౌతుంది. ఎటు చూసినా రేవంత్‌కు దారులు మూసుకుపోవడం పక్కా…

ఎర్రబెల్లి కి ఎదురా…ఇంపాజిబుల్‌!

-ఎర్రబెల్లిని ఢీ కొట్టడం అంత సులువు కాదు.

-ఎర్రబెల్లి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకే రాజకీయ వరం.

-ఎర్రబెల్లి జనం గుండెల్లో సంజీవని.

-ఉమ్మడి జిల్లాలోనే తిరుగులేని నేత.

-ఎర్రబెల్లి చేసేది సేవా రాజకీయం…

-ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక్క ఎర్రబెల్లికే అది సాధ్యం.

-ప్రాంతాలకు అతీతంగా సేవ చేసే నాయకుడు.

-నాలుగు దశాబ్దాల బలమైన సేవా పునాదులు

-దయన్నా! అంటే దయచూపిస్తాడు.

-ఆపద అంటే ఆదుకుంటాడు.

-ఆరోగ్యాల విషయంలో నియోజకవర్గం మొత్తం తండ్రిలా కాపాడుకుంటాడు.

-2014 నుంచి పాలకుర్తి దశ మార్చిన నేత.

-2014 డెంగ్యూ జర్వాల నుంచి ప్రాణాలను కాపాడిన ప్రాణదాత.

– ప్రతి ఊరిలో అంబులెన్స్‌ ఏర్పాటు చేసి, వందల మంది ప్రాణాలు కాపాడాడు.

-హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేసి, వైద్యం అందించాడు.

-పరిస్థితిని బట్టి అంబులెన్స్‌ ల ద్వారా సొంత ఖర్చుతో ప్రైవేట్‌ ఆసుపత్రులలో చికిత్స చేయించాడు.

-పల్లెలలను సుందరంగా తీర్చిదిద్దాడు.

-నియోజకవర్గంలో ప్రజలు సీజనల్‌ జ్వరాల బారిన పడకుండా చూసుకుంటున్నాడు.

– కరోనా కాలంలో ఎంతో మందిని ఆదుకున్నాడు.

– పెద్ద ఎత్తున ప్రజల ఆహార అవసరాలు తీర్చాడు.

– వందలాది మందికి ఉచితంగా కరోనా చికిత్సలు చేయించాడు.

-అతి ఖరీదైన వైద్యం కూడా సొంత ఖర్చులతో అనేక మందికి చెయించాడు.

– నియోజకవర్గం సుందరంగా తీర్చిదిద్దాడు.

-పంచాయతీకి రాజ్‌ శాఖకు దేశంలోనే అనేక అవార్డులు తెచ్చిపెట్టాడు.

-ప్రజలకు అండగా వుంటూ, అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ముందుంచాడు.

-ఎదురులేని రాజకీయం చేయడంలో దిట్టు.

-తిరుగులేని నాయకత్వం ఎర్రబెల్లి సొంతం.

-ఓటమెరగని నేతగా రికార్డు.

-ఎన్‌ఆరైలు టూరిస్టులు…

-వచ్చి వెళ్లేవారు ప్రజాసేవ చేయలేరు.

-కేవలం రాజకీయాల కోసం వచ్చేవారు…ఎన్నికల కోసమే వస్తారు.

-ఓడిపోయి జనం ముఖం చూడని వాళ్లు ఎంతో మంది వున్నారు.

-నాలుగు రోజుల రాజకీయ అవతారులను ప్రజలు నమ్మరు.

– ప్రజల గుండెల్లో వున్న ఎర్రబెల్లిని దూరం చేసుకోరు. 

హైదరబాద్‌,నేటిధాత్రి: 

రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావు ముందు ఎన్నికల బరిలో నిలబడం అంటే పులి ముందు ప్లూట్‌ ఊదడమే అవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఓటమి అంటే ఎమిటో తెలియదు. అది ఎలా వుంటుందో కూడ తెలియదు. ఎందుకంటే ఆయనకు ప్రజాభిమానం ఎక్కువ. ప్రజాదరణ ఎక్కువ. ప్రజలను గుండెల్లో పెట్టుకునే నాయకుడు దయాకర్‌రావు. అందుకే నాలుగు దశాబ్ధాలుగా ఆయన ఎదురులేని నాయకుడిగా, తిరుగులేని ప్రజాప్రతినిధిగా వెలుగొందుతున్నారు. ప్రత్యక్ష్య ఎన్నికల ప్రస్దానంలో ఆయను ఎదరులేదు. ఆయనకు ఎదురుగా నిలబడిన నాయకులు మళ్లీ రాజకీయాలు చేసింది లేదు. ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన పెద్దగా ప్రయాస పడిరది కూడా లేదు. ఎంతో సునాయాసంగా ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ వచ్చారు. గతంతో 2004లాంటి కాంగ్రెస్‌ ప్రభంజన కాలంలోనూ గెలిచారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత కూడా ఆయన గెలిచారు. అంటే కాలమేదైనా, పరిస్ధితులు ఏవైనా, రాజకీయాలకు అతీతమైన ప్రజాభిమానం ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంతం. గతంలో ఆయన వరసగా వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత డీలిమిటేషన్‌ కారణంగా పాలకుర్తినుంచి పోటీ చేస్తున్నారు. అప్రతిహాతంగా గెలుస్తూ వస్తున్నారు. మధ్యలో పార్లమెంటుకు కూడా పోటీ చేసి గెలిచిన ఘనత ఎర్రబెల్లి దయాకర్‌రావుది. ఇలా వరసగా ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ గెలిపిస్తూ వస్తున్నారంటే, ప్రజలంటే ఆయనుకు ఎంత నమ్మకంతో తెలుసుకోవచ్చు. ప్రజలకు ఆయననంటే ఎంత అభిమానమో తెలుసుకోవచ్చు. అలాంటి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా ఆయన ఢీ కొట్టిన నాయకుడు లేడు. ఎప్పుడూ మంచి విజయాలే..మెజార్టీ గెలుపులే. ఆయన రాజకీయ జీవితం మీద దెబ్బకొడదామని చాలా మంది చూశారు. కాని వాళ్లే దెబ్బతిన్నారు. ఆయన మీద ఆధిపత్యం చేయాలని చూలా మంది చూశారు. కాని వాళ్లే అడ్రసు లేకుండాపోయారు. అంతే కాదు ఎర్రబెల్లిని రాజకీయంగా ఎదుర్కొలేక, నిలబడలేక, ఓపికలేక, ఇక తమ వల్ల కాదని చాలా మంది క్రియాశీల రాజకీయాలకు కూడా చాలా మంది దూరమయ్యారు. కాని ఎర్రబెల్లి ఎదుగుతూనే వస్తున్నాడు. గెలుస్తూ విజయాలతో వారికి సవాలు విసురుతూనే వున్నాడు. ఎర్రబెల్లిని అణిచివేయాలని కూడా కొందరు చూశారు. కాని వాళ్లే ఇప్పుడు చేష్టలుడిగి చూస్తున్నారు. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న ఎర్రబెల్లిని చూస్తూ, కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఆయన కీర్తి ప్రతిష్టలను చూసి, కుళ్లుకుంటున్నారు. అదీ ఎర్రబెల్లి రాజకీయం అంటే..ప్రజాసేవకు ఆయన ప్రజలనుంచి పొందుతున్న ఆదరణకు నిదర్శనం. ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా ఎర్రబెల్లి హవా ఆగలేదు. ప్రజల్లో ఆయనకు ఆదరణ ఇసుమంత కూడా తగ్గలేదు. ఆయన ఎక్కడా తలవంచలేదు. ఆయనను నమ్మి ఎనుకున్న ప్రజలకు నష్టం చేయలేదు. ఆయా పార్టీలకు తలవంపులు తేలేదు. దుష్టపన్నాగాలు ఏనాడు పన్నలేదు. చాటామాటు రాజకీయాలకు ఒడిగట్టలేదు. ఏది చెప్పినా ముక్కుసూటిగానే, ఏది చేసినా నిర్మొహమాటంగానే చేశారు. అదే ప్రజలు మెచ్చారు. ఎర్రబెల్లికి అండగా నిలుస్తున్నారు. ఆదరిస్తున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా తన రాజకీయం తాను చేసుకుపోవడం, ప్రజలకు మేలు చేయడం, నియోజకవర్గం అభివృద్ది చేయడం తెలుసు. తనకు అప్పగించిన మంత్రిత్వశాఖను సమర్ధవంతంగా నిర్వహించడం మాత్రమే ఎర్రబెల్లికి తెలుసు. వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా, మొక్కవోని ధైర్యమే ఆయన సొంతం..అదే ఆయన విజయాలకు చిహ్నం. ప్రజాసేవకు నిదర్శనం.

ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు. ప్రజాసేవ చేయొచ్చు.

 కాని ఇటీవల ప్రజా సేవ అనేదానికన్నా, రాజకీయం అన్నది ఎక్కువ ప్రచారంలోకి వచ్చి, ఎంతైనా ఖర్చు చేస్తా..ఎన్నికల్లో నిలుస్తా? అనుకుంటున్నారు. కాని ఒక్కసారి రాజకీయంలోకి దిగితే గాని అసలు లోతు తెలియదు. ప్రజా సేవతో రాజకీయం చేయడం వేరు..రాజకీయాల కోసం ప్రజాసేవ ముసుగేసుకోవడం వేరు. ఈ రెండు తెలియక ఇటీవల కాలంలో చాలా మంది తెలియని తనంతో రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. అయినా ప్రజలు ఎంతో విజ్ఞలు. రాను రాను రాజకీయాలంటే అలుసైపోతున్నాయి. పైసలుంటే చాలు రాజకీయాలు చేయొచ్చనే భ్రమలు బాగా పెరిగిపోతున్నాయి. చదువుకొని భవిష్యత్తును నిర్ధేశించుకన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన వుండదు. కాని నాలుగు పైసలు సంపాదించగానే రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు. సేవ ముసుగులో పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా చాలా మంది దేశంలో రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య విద్య చదువుకున్న వారు వైద్యులుగా తమ ప్రాంతాలకు సేవ చేయక, విదేశాలకు వెళ్లి అక్కడ స్ధిరపడి, డబ్బు సంపాదించుకొని, రాజకీయాలు చేయాలన్న ఆశతో వచ్చినవారు చాల మంది వున్నారు. అలాంటి వారిలో మరో ఎన్‌ఆర్‌ఐ కుటుంబం పాలకుర్తిలో రాజకీయం చేయాలని చూస్తోంది. కాని వారికి కూడా తెలుసు. ఎర్రబెల్లిదయాకర్‌రావును ఎదిరించి రాజకీయాలు చేయడం అంత సులువైన పని కాదు. అయినా రాజకీయాలు చేయాలన్న ఆశతో పాలకుర్తి రాజకీయాల్లో వేలుపెడుతున్నట్లు సమాచారం. మా తాతలు నేతలు నాకారు…మా మూతులు వాసన చూడండి అన్నట్లు ఎప్పుడో తమ కుటుంబం పాలకుర్తికి సేవ చేసింది. ఇప్పుడు రుణం తీర్చుకోండని ప్రజలను ఆదేశిస్తున్నట్లుగా రాజకీయం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి వారు ఎంత మంది వచ్చినా పరోక్షంగా మంత్రి దయాకర్‌రావుకే మేలు కలుగుతుంది. ఎందుకంటే దయాకర్‌రావు అవకాశ వాద రాజకీయాలు ఏనాడు చేయలేదు.

అవకాశా వాదంతో రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలను నమ్ముకొని రాజకీయం చేశాడు. రాజకీయాలు చేస్తున్నా ప్రజాసేవను ఎంతో ఇష్టంగా చేస్తుంటాడు. ఆయన చేసిన చేవలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏ నాయకుడు ఇప్పటి వరకు చేయలేదు. రాజకీయాలు చాల మంది చేశారు. దానితోపాటు ప్రజా సేవ చేసినవాళ్లున్నారు. కాని దయాకర్‌రావు మాత్రం రాజకీయాల కోసం మాత్రమే ప్రజాసేవ ఏనాడు చేయలేదు. ప్రజలకు ఏనాడు ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అది ఆర్ధికపరంగానైనా, ఆరోగ్యపరంగానైనా అన్నా అని వెళ్తే చేసే సాయాలు అన్నీ ఇన్నీ కావు. ఆయనతో మేలు పొందని కుటుంబం అంటూ వుండదంటే అతిశయెక్తి కాదు. గతంలో ఆయన చేసిన సేవ కార్యక్రమాల గురించి పక్కన పెడితే, తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలోనే సీజనల్‌ వ్యాధులు విసృతంగా ప్రభలాయి. ఆ సమయంలో పాలకుర్తి నియోజకవర్గంలో పెద్దఎత్తున డెంగ్యూ జ్వరాలు ప్రజల ప్రాణాలు తీశాయి. ఒక రకంగా చెప్పాలంటే వైద్యులు కూడా పల్లెల్లోకి వెళ్లి వైద్యం చేయాలంటే భయపడేంతగా ఇబ్బందికరపరిస్దితులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో ఆయన అనేక మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఆంబులెన్స్‌లు ఎప్పుడూ సిద్దంగా వుంచారు. ఏ గ్రామంలో ఏ ఒక్కరి పరిస్ధితి విషమించినా వెంటనే వరంగల్‌, హైదరాబాద్‌లలో ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి ఉచిత వైద్యం అందించి అనేక మంది ప్రాణాలు కాపాడిన నాయకుడు దయాకర్‌రావు. ఇక కరోనా సమయంలో ఆయన చేసిన సేవ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏ నాయకుడు చేయలేదు. ఏ సామాజిక వేత్త చేయలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా సమయంలో మంత్రి దయాకర్‌రావు తన నియోజవకవర్గంలోనే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన అనేక రకాల సేవంలందించాడు. ముఖ్యంగా వైద్యపరమైన అవసరాలు తీర్చాడు. పేదలకు ఎంతో ఖరీదైన వైద్యం కూడా ఉచితంగా చేయించాడు. రెమిడీస్‌ వీర్‌లాంటి ఇంజక్షన్లు ఎంతో మంది పేదలకు ఉచితంగా అందించి, వారి ప్రాణాలు కాపాడాడు. ఎంతో మందికి ఆహార అవసరాలు తీర్చాడు. అంత గొప్పది దయాకర్‌ రావు సేవ. ప్రజలు ఇప్పటికీ ఆనాటి సేవలు ఎవరూ మర్చిపోలేదు. కాని రాజకీయాలు చేసిన వారు మర్చిపోయారు. ప్రజలను ఏమార్చాలనుకునేందుకు ప్రయత్నిస్తున్నవారు మర్చిపోయారు. కరోనా కాలంలో వారు ఎవరూ లేరు. ప్రజల మీద ప్రేమ చూపలేదు. వారికి సేవ చేయలేదు. ఇప్పుడు రాజకీయాలు చేయడానికి వస్తున్నారు. ప్రజలు ఎంతో విజ్ఞులు. మంత్రి దయాకర్‌రావును కాదనుకోలేరు. ఇది దయాకర్‌రావు మీద రాజకీయం చేయాలనుకున్నవారందరూ నేర్చుకున్న పాఠమే..ప్రతిసారి ఆయన కొత్తగా రుచి చూపిస్తున్నదే…

error: Content is protected !!
Exit mobile version