చిత్రపురిలో చిత్రవిచిత్ర దోపిడి విన్యాసాలు ఎపిసొడ్‌`3 చిత్రపురిలో నక్షత్రకులు!

https://epaper.netidhatri.com/view/238/netidhathri-e-paper-17th-april-2024%09/3

`దారి దోపిడీదారులను మించిన నయవంచకులు.

`కార్మికుల బతుకులతో ఆటలాడుకుంటున్నారు.

`కార్మికుల జీవితాలను బలిపెడుతున్నారు.

`ఎప్పటికప్పుడు వారిని దోచుకుతింటున్నారు.

`ముప్పై ఏళ్లుగా మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు.

`కొత్త సభ్యత్వాలు ఇవ్వలేదని అబద్ధాలు చెబుతున్నారు?

`అనర్హులకు ప్లాట్లు కట్టబెడుతున్నారు.

`కోట్లకు కోట్లు దండుకుంటున్నారు.

`ఎవరూ సుద్దపూసలు కాదు.

`పెద్దల ముసుగులో కార్మికుల ఎంగిలి తింటున్నారు.

`సినీ లోకం..ఛీ..ఛీ అంటున్నా తుడుచుకుపోతున్నారు.

`ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో వ్యాపారం చేస్తున్నారు.

`పేద కార్మికుల ఉసురుపోసుకుంటున్నారు.

`వాళ్లు మారరు…ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే దారికి రారు.

`కార్మికుల కష్టాలు తీరవు…సొంతింటి కల నెరవేరదు.

`ఆ కల తీరకుండానే ఎంతో మంది చనిపోయారు.

`వారి ఆత్మల మీద కూడా పేలాలేరుకొని తింటున్నారు.

`చిత్రపురి పెద్దలు రాబంధులను మించిపోయారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
చిత్ర పురిలో పెద్దలుగా చెలామణి అవుతున్న వారు నక్షత్రులను మించిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందులో సుద్దపూసలు ఎవరూ లేరు. ఎవరి స్వార్ధం కోసం వారు చిత్రపురిని వాడుకుంటూ, తమ పబ్బం గడుపుకుంటున్నారు. విధిలేని పరిస్దితుల్లో అప్పు చేసిన పాపానికి సత్య హరిశ్చంద్రుడు, అప్పు తీర్చలేక ఎన్ని అవస్థలు పడ్డాడో..చిత్రపురి కార్మికులు కూడా అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంఘాలుగా మారితే సభ్యత్వాలు దక్కితే, వుండడానికి గూడు దొరుకుందన్న ఆశతో మొదలైన చిత్రపురి కార్మికుల ప్రయాణం సొసైటీ కమిటీ దోపిడికి మార్గమైంది. వారికి ఆస్దులు కూడబెట్టే బ్యాంకుగా మారిరంది. పెద్దలు దోచుకుంటూ తింటున్నా ప్రశ్నించలేని స్దితికి చేరింది. ఎప్పుడు ఏ లెక్క చెబుతారో? అర్ధం కాని అయోమయంలో కార్మికులు వున్నారు. హరిశ్చంద్రుడు తనను తాను అమ్ముకున్నా అప్పు తీరనట్లే, నలభై ఏండ్లుగా ఎదురుచూస్తున్నా అసలైన సినీ కార్మికులకు ఇండ్లు అందింది లేదు. వారికి నీడకల్పించింది లేదు. పేరుకు మాత్రం చిత్రపురి. అందులో ఇండ్లు ఎవరికున్నాయి? ఎంత మంది ఇతరులకున్నాయి? ఎంత మంది చేత లక్షలకు లక్షలు కిస్తిలు కట్టించుకొని ఏగవేశారు? ఒక్కొక్క ప్లాటు ఎంత మందికి అమ్ముకున్నారు? ఇలా లెక్కలు తీస్తే చిత్రగుప్తుడి మాయకన్నా పెద్ద మాయా ప్రపంచమే చిత్రపురిలో కనిపిస్తుంది. ఈ విషయంపై గత కొంత కాలంగా నేటిధాత్రి వరుస కధనాలు రాస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ కార్మికలోకంలో కదలిక వచ్చింది. గతంలో గొంత సవరించలేని వాళ్లుంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కొట్లాడి కొట్లాడి అలసిపోయిన వారిలో కూడా నేటిధాత్రి చెబుతున్న నిజాలతో మళ్లీ వారికి ఆశలు చిగిరిస్తున్నాయి. అయితే ఇది కూడా కొంత మంది పెద్దలు తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలిసింది.
కార్మికుల కోసం నేటిధాత్రి ప్రయత్నం చేస్తుంటే, కార్మిక లోకం కదులుతుంటే కొత్త నిర్మాణాల కోసం నిధుల సేకరణకు మార్గం ఏర్పడుతుందని చిత్రపురి గద్దలు చంకలు గుద్దుకుంటున్నారట.
అందుకే కార్మికులు మళ్లీ తొందరపడి మోసపోవద్దు. ఎవరినీ నమ్మొద్దు. పెద్దలున్నదే మిమ్మల్ని నమ్మించి, నయ వంచన చేసేందుకు..అది మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. నక్షత్రులకు కన్నా, ఘోరంగా తయారయ్యారు సొసైటీ కమిటీ పెద్దలు. చిత్ర పురిలో పెద్దలుగా చెలామణి అవుతున్నవారు మళ్లీ తమ పబ్బం గడుపుకునే కొత్త వేషం కడుతున్నారు. అందమైన బ్రోచర్లు సృష్టించి, భూతల స్వర్గంగా చిత్రపురిని మార్చుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అదింతా మోసం. .అంతా అబద్దం. నిజానికి ప్రస్తుతం చిత్రపురి సొసైటీ చెబుతున్న వాటిలో ఒక్కటి కూడా నిజం కాదు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. మళ్లీ మీ కళ్లకు గంతలు కట్టాలని చూస్తున్నారు. మీ ఆశలను సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. ముందు సినీ కార్మికులంతా సంఘటితం కండి? అసలు వాస్తవాలు తెలుసుకోండి. అసలు చిత్రపురి కోసం ప్రభుత్వం ఇచ్చిన స్ధలమెంత? ప్రభుత్వానికి నటుడు ప్రభాకర్‌రెడ్డి ఇచ్చింది ఎంత? ఆ స్ధలాలు ఏమయ్యాయి? ఇప్పుడు చెరువు బఫర్‌ జోన్‌ మాత్రమే ఎందుకు మిగిలింది? ఇలాంటి విషయలపై కార్మికులకు పూర్తి అవగాహన ఎంతైనా అవసరం. ఇలాంటి విషయాలు ఏమీ చెప్పకుండా గత నలభై ఏళ్లుగా కార్మికులను మోసం చేస్తున్నారు. ఒకప్పుడు కార్మికులను నమ్మించేందుకు, ఆ భూముల్లో వ్యాపారం చేసుకునేందుకు, వారు రాజకీయంగా ఎదిగేందుకు చిరంజీవి చేత కొందరికి పట్టాలు ఇప్పించినట్లు నటించారు. దాంతో ఎంతో మంది మోసపోయారు. చిరంజీవి చేతుల మీదుగా అందుకునే అవకాశం కొంతమందికే దక్కింది. అది కూడా చిత్రపురి పెద్దల ఆశీస్సులున్నవారికి ఇవ్వడం జరిగింది. వాటిని చూసి మోస పోకండి. చిత్రపురిలో పెద్ద మాయా ప్రపంచమే వుంది. అది తెలుసుకోలేక, సమయం లేక, సినీ కష్టాలు పడుతూ, దాచుకున్న సొమ్మును దోచుకునేందుకు చిత్ర పురి పెద్దలు కాచుకొని వున్నారు. మీ కష్టం కాజేయాలని చూస్తున్నారు.
ప్రస్తుతం చిత్రపురి సొసైటీ అధ్యక్షుడుగా వున్న వ్యక్తి నిమయాలను ఉల్లంఘించి అధ్యక్షుడయ్యాన్నది అందరూ చెబుతున్న మాటే.
అయినా ఎందుకు కార్మికులు స్పందించడం లేదు. ప్రశ్నించిన వారిని కొంత మందిని సొసైటీ కార్యాలయంలోకి పిలిపించుకొని కూడా కొట్టారని అందుకే కార్మికులు , సొసైటీ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు జంకుతున్నారన్న ప్రచారం కూడా వుంది. సాక్ష్యాత్తు ఓ మహిళను కూడా సొసైటీ పెద్దలు కొట్టి, చిక్కుల్లో పడ్డారు. ఆమె వారిపై న్యాయపోరాటం చేస్తోంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇలాంటి వాటిని బైటకు రానివ్వరు. అంతే కాకుండా ఆ మధ్య చాలా ప్లాట్‌లను ముగ్గురు, నలుగురికి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు కూడా వార్తలున్నాయి. తాము పూర్తి సొమ్ము చెల్లించినా, ఒకటో, రెండో కిస్తీల చెల్లింపుల్లో జాప్యం చేశామని చెప్పి, ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ ఇతరులకు చేయించిన సంఘటనలు కూడా వున్నాయి. వాటిపై ఇప్పటీకీ న్యాయపోరాటం చేస్తున్నవారున్నారు. ఇవన్నీ కార్మిక లోకాని తెలియాల్సిన అవసరం వుంది. లేకుంటే వాళ్లు కూడా మోసపోయే అవకాశం వుంది. సొసైటీ కార్యాలయానికి పిలిపించుకొని, కొట్టిన అమ్మాయి చేస్తున్న న్యాయ పోరాటం ఆపాలని, ఇప్పుడు ఆమెను ప్రాదేయపడుతున్నారు. ఇలా అనేక సంఘటనలున్నాయి. దాదాపు పదుల సంఖ్యలో ప్లాట్స్‌ ఒకరికే కాకుండా ఇద్దరు ముగ్గురికి కూడా రిజిస్ట్రేషన్‌ చేసిన సంఘటలను వెలుగు చూశాయి. ఇప్పుడు మీ పరిస్ధితి కూడా అదే అవుతుంది. తస్మాత్‌ జాగ్రత్త. ముందుగా అందమైన మాటలు చెబుతారు. నమ్మిస్తారు. ముందు 30 శాతం అడ్వాన్సు తీసుకుంటారు. నెల నెల కట్టే వాయిదాలలో ఏ మాత్రం తేడా వచ్చినా మిమ్మల్ని పక్కన పెడతారు. అయాకులుగా మీ చేత వాయిదాలు చెల్లించుకుంటారు. ఆఖరుకు ఏదో వాయిదా ఆలస్యమైందని చెప్పి మీకు ప్లాట్‌ లేదంటారు. గతంలో ఇలాంటివి అనేకం జరిగాయి. ఈ విషయం కార్మికులు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. ఈ విషయాన్ని మేం ముందే చెప్పామని, బైలాలో పొందు పర్చామని అప్పుడు నిబంధల గురించి చెప్పి , మిమ్మల్ని మోసం చేస్తారు. చిన్న చిన్న అక్షరాలతో పేజీలకు పేజీలు రాసి వుండే నిబంధనలు ఎవరూ చదువుకోరు. చాలా మందికి ఇంగ్లీషు కూడా రాదు. దాంతో చిత్రపురి సొసైటీ పెద్దలు చెప్పే తియ్యటి మాటలు నమ్మి పెట్టుబడి పెడతారు.
సంపాదనంతా వారి చేతుల్లో పెట్టేస్తారు. ఆఖరుకు మీకు ప్లాట్‌ రాదు.
పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాదు. తిరుపతి హుండీలో వేస్తే పుణ్యమైనా వస్తుంది. చిత్రపురి సొసైటీకి చేరిన పైస తిరిగి అసలే రాదు. దాని కోసమ మళ్లీ కోర్టు ఖర్చులు అదనం. అయినా మీ కేసు తేలేదెప్పుడో… కేసు గెలిచేదెప్పుడో… కేసు గెలిచినా మీకు సొమ్ము వస్తుందన్న నమ్మకం అప్పుడు కూడా వుండదు. సినీ కార్మికులు సొసైటీ పెద్దలు చెప్పే మాటలు నమ్మకండి. అంతే కాదు, మీరు కొనుగోలుకు రావడం లేదని, ఆ ప్లాట్స్‌ను ఇతరులకు అమ్ముకునే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకే ఆ స్ధలాలు కూడా కాపాడుకునే బాధ్యత మీదే…ఎందుకంటే ఆ స్ధలాలు కొనుగోలు చేసింది కార్మికుల సొమ్ముతోనే…నిజానికి 2015 నాటికే కార్మికులు ఎవరు? ఎంత మంది అన్నది ఖరారు చేశారు. ఆ తర్వాత సభ్యత్వాలు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నారు. దానిని సొసైటీ పెద్దలు ఎప్పుడో అతిక్రమించారు. 1994 నుంచి జీడి పాకంలా సాగుతున్న నిర్మాణాలలో మొత్తం 4213 ప్లాట్లకు డిజైన్‌ చేశారు. 2010 నుంచి 2015 వరకు దశలవారిగా ప్లాట్లను అందిస్తూ వచ్చారు. ఇంత వరకు పూర్తయిన కేవలం 2632. ఇంకా పూర్తి దశలో వున్నవి 1581. అవి కూడా పూర్తిదశలో వున్నాయి. అవి కూడ ఎప్పుడో మంగళం పాడేశారు. అనుయాయులకు చాలా వరకు అందించారు. గతంలో వున్న సొసైటీ కమిటీ చైర్మన్‌ సినీ కార్మికులకు కొంత వరకు మేలు చేశాడన్న పేరుంది..కాని ఇప్పుడున్న సొసైటీ చైర్మన్‌ కార్మికులను దోచుకుంటున్నాడన్న ఆరోపణలు అనేకం వున్నాయి. ప్రస్తుతం మళ్లీ కొత్త దుకాణం తెరిచాడు. ట్విన్‌ టవర్లు నిర్మాణం చేస్తున్నట్లు కార్మికులను మరోసారి మోసం చేసేందుకు చూస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆ స్ధలాలో ఎలాంటి అనుమతులు లేవు. వాటిపై గత ఎపిసోడ్‌లో నేటిధాత్రి పూర్తి స్ధాయి విశ్లేషణ అందించింది. కార్మికుల పక్షాన నేటి ధాత్రి అక్షర పోరాటం చేస్తోంది. మీరు మోస పోవొద్దని మరీ మరీ చెబుతోంది. కార్మికులంతా కలిసి కొత్త సొసైటీ కమిటీ ఎన్నుకుంటే తప్ప చిత్ర పురికి పట్టిన శని పోదని అందరూ అంటున్నారు.

50. తునికాకు ల కట్టకు 5.రూపాయల గిట్టుబాటు ధర చెల్లించాలి

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

చర్ల మండలం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి నూప.పోతయ్య అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవిలో మూడవ పంట అయిన తునికాకు పంట వేసవి వచ్చిందంటే మే నెల మొదటి వారంలో ఆదివాసి ఆదివాసి యేతర గ్రామీణ పేదలు అడవి బిడ్డలు తునికి.ఆకు సేకరించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరుగుతుందని ఎండని సైతం లెక్కచేయకుండా చెట్లు, పుట్టలు,గుట్టలు ఎక్కి అడవి జంతువుల భారి నుంచి తప్పించుకొని తునిగాకు సేకరించడం అంటే ప్రాణాలతో చెలగాటమే అన్నారు అయినా ఆదివాసులు ఇతర పేదలు బ్రతుకు దేరువు కోసం తునికి ఆకు సేకరించాల్సి వస్తుందని ఇంత కష్టపడి తునికి ఆకు సేకరిస్తే సరైన గిట్టుబాటు ధర లేక ఆదివాసులు నష్టపోతున్నారన్నారు. కానీ తునికాకు కొనుగోలు చేసే గుత్తేదారులు ,(కాంట్రాక్టర్లు) మాత్రం కోట్లకు పడగలేత్తుతున్నారని తునికి ఆకు సేకరణలో ఆదివాసులు క్రూర మృగాల దాడిలో గాయపడి మరణిస్తున్న వారికి మాత్రం ప్రభుత్వం గానీ గుత్తేదారులు గాని సరైన నష్టపరిహారం చెల్లించడం లేదని హెచ్చరించారు 50. ఆకుల తునికి ఆకు కట్టకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఆదివాసులను నిలువునా మోసం చేస్తూ ఉన్నారని తునికి ఆకు ఆదివాసులు కోయకపోతే బీడీ పరిశ్రమలు మూతపడతాయని దీని దృష్టిలో పెట్టుకొని 50 ఆకుల తునికి ఆకు కట్టకు కనీసం 5. రూపాయల కిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు తునికాకు సేకరణలో అడవి జంతువుల బారినపడి గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు మరణించిన వారికి 5.లక్షల రూపాయలు చెల్లించాలని అన్నారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు ఇవ్వని తునికాకు బోనస్ ని వెంటనే చెల్లించాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు అడ్డగర్ల.తాతాజీ. తిరుపతిరావు .రామారావు. నాగేశ్వరావు ముత్తయ్య. మంగమ్మ. అనసూర్య.వెంకటనరసమ్మ.భద్రమ్మ.లక్ష్మి.పద్మ.రామయ్య.శ్రీను. సత్యనారాయణ .వెంకట్ రెడ్డి. లక్ష్మయ్య. సావిత్రి. ముత్తమ్మ. రమేష్ కన్నయ్య .గంగయ్య. చిన్న. సింగయ్య. రాంబాబు. సుబ్బయ్య. రాజారావు. నాగరాజు. తదితరులు పాల్గొన్నారు

శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న భద్రాది రామయ్య

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం:ఏప్రిల్ 16
భ‌ద్రాచలంలో శ్రీ సీతా రాముల కల్యాణానికి శ్రీరామ దివ్య క్షేత్రం ముస్తాబవుతోంది. శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు చేశారు.

రేపు సీతారాముల కల్యా ణం జరగనుంది. అయితే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఇవాళ ఎదరుకోలు ఉత్సవాన్ని పండితులు నిర్వహిస్తున్నారు.ఈరోజు జరిగే శ్రీ రామన వమి కోసం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రూ. 3కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

భద్రాచలంలో సీతారాముల కల్యాణం నేపథ్యంలో ఏర్పా ట్లు చురుగ్గా జరుగుతున్నా యి. రామాలయ ప్రాంగణా న్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు తున్నారు. శ్రీ సీతారాముల కల్యాణం జరిగే మిథిలా కళ్యాణ మంటపాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు.

నేడు ఎదురుకోలు వేడుక‌…
భద్రాద్రిలోని రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదురుకోలు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రేపు మిధిలా స్టేడియంలో సీతా రామ కల్యాణం జరగనుం ది. రేపు సీతారామ కల్యా ణం… సీతారామ కల్యాణం సందర్భంగా పెద్దయెత్తున భక్తులు భద్రాద్రికి చేరుకుం టున్నారు.

ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఇప్పటికే భద్రాద్రి బాట పట్టారు. భద్రాచలంలోని అన్ని వసతి గృహాలు బుక్ అయి పోయాయి. సీతారామలు కల్యాణాన్ని తిలకించేందుకు ఎక్కువ మంది భక్తులు వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు.

ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వీస్తుండటంతో అందుకు తగినట్లు చర్యలు ఆలయ అధికారులు తీసుకున్నారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు దేశ నలు మూలల నుంచి వచ్చే ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల కోడ్ ఉండటంతో ఈ సారి స్వామి వారి కల్యాణానికి ముఖ్యమంత్రి వచ్చే వీలు లేనట్లు తెలు స్తోంది.రూ.3 కోట్ల వ్యయం..
దేవాదాయ శాఖ రూ.2.88 కోట్లు, గ్రామ పంచాయతీ రూ. 26 లక్షలు, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యూఎస్, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి మొత్తం రూ.3 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి.

స్వామి వారి కళ్యాణానికి మరో రోజు మాత్రమే గడువు ఉండటంతో యుద్ధ ప్రాతి పదికన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగమంతా ఏర్పాట్ల లో తలమునకలై ఉన్నారు. రాములోరి కళ్యాణానికి దేశ నలు మూలల నుంచి లక్ష మందికిపైగా భక్తులు వస్తారనే అంచనాతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

శాంతి నగర్ కాలనీ నందు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు భద్రాచలంలో శాంతి నగర్ కాలనీ నందు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం మహోత్సవము సందర్భంగా దాసరి వెంకటనారాయణ – హారతి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. భద్రాచలం వచ్చిన రామ భక్తులకు అన్నదానం నిర్వహించిన దాసరి వెంకటనారాయణ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి రమేష్ గౌడ్, హరీష్, యలమంచిలి చిన్ను తదితరులు పాల్గొన్నారు.

ఫైర్ స్టేషన్ కల కలగానే మిగిలిపోయింది

కాలం గడుస్తున్న ప్రభుత్వాలు మారినా పట్టించుకోని పాలకులు

న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్

ప్రభుత్వాలు మారిన చర్ల మండలంకు మాత్రం అగ్నిమాపక కేంద్రం రావడం లేదు

అగ్ని ప్రమాదాలకు భయబ్రాంతులకు గురవుతున్న పురిగుడిశ ప్రజలు

ఇటీవల కాలంలోఎన్నో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న విద్యుత్ షాక్ సరక్యూట్ తో పంటలు కాలిపోయిన వైరం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

చర్ల మండల కేంద్రంలో గత చాలా సంత్సరాల నుండి పైరు స్టేషన్ ఏర్పాటు చెయ్యాలని కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిసి అఖిలపక్షంగా ఏర్పడి కొట్లాడుతూనే ఉన్నాం ఐనా ఈ పాలకులకు దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉంటుంది ఎటువంటి చలనం లేదని ఈ సందర్బంగా ముసలి సతీష్ మాట్లాడుతూ ఇంకా ఎన్ని ఇల్లు అగ్నికి ఆహుతి అయితే ఫైర్ స్టేషన్ చర్లకు వస్తుంది ఓ ఏలేటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరు ప్రతి యాట ఊర్లకు ఊర్లు కాలిపోతున్నాయి ఇక్కడనుండి ఈ వలస ఆగవా చర్ల మండలంలో 75%శాతం రెక్కాడితేనే డొక్కాడే ప్రజలు ఉన్నారు చర్ల మండలంలో 28పంచాయతీలు 58గ్రామాలు 50వేల పైబడి ప్రజానీకం ఉంది అని అయన అన్నారు*ప్రతి సంవత్సరం మంటలకు గురై లక్షలాది రూపాయలు నష్టం జరిగి ప్రజలంతా నిజస్రాయలుగా మారిపోతున్నారు కనికరం లేని పాలకులు కనీసం ఫైర్ స్టేషన్ ఇచ్చే పరిస్థితులలో లేరు.
వేసవికాలం అయిపోయే లోపు ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని చూడాలో?అని అయన ఆవేదన వెక్తం చేశారు

చర్ల మండలం లింగాపురం గ్రామంలో నిన్న రాత్రి సుమారు 8. గంటలకు 1.మేడభత్తిని చిన్న నరసింహరావు.. 2.చందు.వీరి ఇద్దరి ఇల్లులు షాక్ సర్కిట్ జరిగి మొత్తం కాలిపోయి సర్వం కోల్పోయారు దాతలుఎవరు ఉన్న ఈ కుటుంబాని సహాయం చెయ్యాలని కోరుతున్నాము..55 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం అక్కడినుండి కుయ్యి కుయ్యి అని గంట రెండు గంటలకు భద్రాచలం నుండి ఫైర్ ఇంజన్ వచ్చే లోపు మా బ్రతుకులు మొత్తం కాలి బూడిదవుతున్నాయి సర్వం కోల్పోతున్నము తప్ప పాలకులలో ఎటువంటి మార్పు లేదు అగ్ని ప్రమాధం జరిగిన కుటుంబాలకు పక్క ఇల్లు కట్టించి ఇవ్వాలని వారి సామానులు పంట కాలిపోయినందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోని 5.లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆవేదన వెక్తం చేసింది
ఇప్పటికైనా మండలంలో ఉన్న నాయకులు ప్రభుత్వంతో మాట్లాడి చర్లలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని మరల ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంమీదనే ఆధారపడి ఉందని దాతలు ఎవరు ఉన్న ఈ కుటుంబాన్ని ఆడుకోవాలనీ మండలంలో ఉన్న ప్రతి వాసులను నాయకులను ప్రజలను వ్యాపార వర్గాలను అధికారులను మీడియా మిత్రులను కోరుతున్నాము.
ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంకు ఉంది అయినా నమ్మకం లెనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో అనేక గ్రామాల తో పాటు నిన్న రాత్రి సుమారు 8.గంటల సమయంలో లింగాపురంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లంతా కాలిపోయి బూడిద అయ్యింది రాత్రింబవళ్లు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పైసా పైసా కూడా పెట్టుకుని ఇల్లు కట్టుకుంటే ఎండాకాలం వస్తే అగ్నికి ఆహుతి అయిపోయి. కన్న కలల మొత్తం బూడిద పాలవుతుంటే ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలందరూ అయోమయ పరిస్థితిలో ఉన్నారు.ఇప్పటికే ఎండలు పెరిగిపోయి ఉన్నాయి ఏ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి చర్ల మండలంలో ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం.గతంలో వామపక్షంగా ఏర్పడి ప్రజల అందరితో అనేక ఆందోళన చేసి ఈ పాలకులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నాం అయినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వ అధికారులు ఆలోచన చేసి ఇప్పటికైనా చర్ల మండలంలో ఫైర్ స్టేషన్ నెలకొల్పాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ గా కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో. సర్పంచ్ రాధా మేడ బత్తిని కమల ఎడెల్లి దేవి గుండ్ల రమేష్ జక్క చిన్నక్క మేడ బత్తిని చందు జై రాజు నరసింహ చంటి నాగేశ్వరరావు శ్రీలేఖ చిరంజీవి రాజు తదితరులు పాల్గొన్నారు

రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక సీట్లు సాధించుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది

భద్రాచలం నేటి రాత్రి

ప్రజాపాలన కాంగ్రెస్ తోనే సాధ్యమని నమ్మిన తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ

అభివృద్ధి కోసం శ్రమించే వ్యక్తి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని ప్రజలే గెలిపించుకుంటారు

మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయం కోసం మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోగల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో భద్రాచలం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ సంక్షేమ పాలన కోసం కాంగ్రెస్ పార్టీని నమ్మి రాష్ట్ర ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చారని, ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ ఎన్నికల హామీగా ఇచ్చిన 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలుపరచి ప్రజా పాలన కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇండియా కూటమి విజయం సాధించి, దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారా సమన్యాయ పాలన కోరుకుంటున్నారని, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ అభివృద్ధి కోసం శ్రమించే వ్యక్తి కాబట్టి ప్రజలు ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించడం ఖాయమని ఆయన మాట్లాడారు.
ఈ ఎన్నికల ప్రచారంలో
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాస మల్ల రాము కాంగ్రెస్ నాయకులు అన్నేం రామిరెడ్డి, షబ్బీర్ భాష,మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వసంతాల రాజేశ్వరి, తుమ్మల రాణి, కట్ట కళ్యాణి, మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

18 నుండి ఎంపీ గా పోటీ చేసే అబ్యర్టులు దరఖాస్తుచేసుకోవచ్చు

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఏప్రిల్ 18 నోటిఫికేషన్ తేది నుండి దరఖాస్తు చేసుకోవచ్చని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ సూచించారు.
మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల నోటిఫికేషన్ ప్రక్రియ పై అవగాహన కల్పించారు.
ఏప్రిల్ 18 న నాగర్ కర్నూలు రిటర్నింగ్ అధికారి ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందనీ, వనపర్తి జిల్లా నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నందున నామినేషన్ లు నాగర్ కర్నూలు జిల్లాలో రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుందని నామినేషన్ వేయదలచిన అభ్యర్థులు నేరుగా రిటర్నింగ్ అధికారికి గాని లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేవారు హార్డ్ కాపీలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. అఫిడవిట్ నింపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారుఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు అభర్తులందరికి సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.
ప్రచార అనుమతులు సహాయ రిటర్నింగ్ అధికారి నుండి పొందవచ్చని తెలిపారు.ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈ .వి.యం ల మొదటి విడత ర్యాండ మైజేశన్ సైతం పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమవంతు సహకారం అందించాలని ప్రజాప్రతినిధులను కోరారు.వనపర్తి జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి యం. నగేష్, ఆర్డీవో పద్మావతి, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఐ.ఎన్.సి నుండి వెనాచారి, త్రినాథ్, బి.జే.పి నుండి వేంకటేశ్వర రెడ్డి, కుమార స్వామి, బి.ఆర్.ఎస్ నుండి సయ్యద్ జమిల్ , సిపిఎం పరమేశ్వరా చారి, యం.ఐ.యం నుండి రహీం, ఎన్నికల సెక్షన్ నుండి కిషన్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మ తల్లి దేవాలయం లో విగ్రహ ప్రతిష్ఠ కు బిజెపి అభ్యర్ధి ఆరూరి కి ఆహ్వానం

హసన్ పర్తి / నేటి ధాత్రి

హన్మకొండ జిల్లా, హసన్ పర్తి మండలం, నాగారం గ్రామంలో ఏప్రిల్ 26 తేదిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని బిజెపి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన నాగారం గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు.
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు దామేరా రాజు, మాజీ సర్పంచ్ అరుణ్, ఉప అధ్యక్షుడు తాళ్ళ నర్సయ్య, కార్యదర్శి కళ్లెబోయిన మల్లయ్య, రావుల సమ్మయ్య, శేఖర్, సృజన్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

హసన్ పర్తి / నేటి ధాత్రి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ పరిధిలోని పెగడపల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన గొల్లెల మహేందర్ భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి అనంతరం అదే గ్రామానికి చెందిన గండ్రతి భాగ్య గారు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అనంతరం 2వ డివిజన్ పరిధిలో గుండ్లసింగారం గ్రామంలో మదాసి సారయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు. అలాగే హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, హనుమకొండ మండల అధ్యక్షుడు మదాసి అజయ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళ్ళ తిరుపతి గౌడ్, డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు, వర్ధన్నపేట సోషల్ మీడియా ఇంఛార్జి పుట్ట తిరుపతి, హాసన్ పర్తి మండల యూత్ అధ్యక్షుడు సౌరం చరణ్ రవి, తో పాటు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు,మహిళలు ..

వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి సమక్షంలో చేరికలు..

పార్లమెంట్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయండి..

హసన్ పర్తి / నేటి ధాత్రి

వర్థన్నపేట నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో వర్థన్నపేట నియోజవర్గంలో బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. 43 వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు చింత ప్రకాష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను మరియు గౌడ సంఘం నాయకులను సుమారుగా 100 మందిని వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. వారికీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ
ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం, బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొన్నటి ఎన్నికల వరకు ప్రజలను మోస పూరిత మాటలతో మభ్యపెడుతూ కాలం వెల్లదీశారని అన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ నాయకులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాపాలన సాధ్యమని తెలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ను భారీ మెజారితో గెలిపించి వరంగల్ గడ్డ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి అని తెలిపారు.ఈ కార్యక్రమం లో 43వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పనులవద్ద సౌకర్యాలు కరువు– కూలీలపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు

—-రోజుకు ముప్పై నుండి నలబై రూపాయలు మాత్రమే
—–శ్రమ దోపిడికి గురౌతున్న కూలీలు
–చట్టాన్ని కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
—-డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్

హసన్‌ పర్తి / నేటి ధాత్రి

ఉపాధి హామీ కూలీలైన హక్కుదారులకు పనులవద్ద కనీస సౌకర్యాలైన నీరు, నీడ, ప్రధమ చికిత్స బాక్సు, సకాలంలో అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నరని,
మండుటెండల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు పనుల వద్ద టెంట్ (షేడ్స్) ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహారిస్తున్నారని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ అన్నారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరి గ్రామంలో హై చెరువులో పనిచేస్తున్న కూలీలతో పని వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ
కూలీలు ఎండలో పనిచేసిన కేవలం 30 రూపాయల నుండి 40 రూపాయలు మాత్రమే వస్తున్నాయని కూలీలు అవేధన వ్యక్తం చేశారు.
గత సంవత్సరం ఇంకుడు గుంతల పనిచేసిన,నర్సరీ లో పనిచేసిన,చేరువు పూడిక తీతలో పనిచేసిన కూలీలకు నేటికి డబ్బులు రాలేదని కూలీలు వాపోయారు.
కేంద్ర ప్రభుత్వం కూలీలకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్, ఆధార్ యాప్,బ్యాంకు అనుసంధానం కొత్త కొత్త యాప్ లను తీసుకువచ్చి కూలీల గొంతు నోక్కుతుందన్నారు.యన్ యమ్ యమ్ ఎస్ సిస్టాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు. పనిచేసిన పదిహేను రోజులలో కూలీ వేతనాలు అందించాలన్నారు. వడదెబ్బ తగలకుండా కూలీలకు పనుల వద్ద షేడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. కూలీలకు ఓఆర్ యస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు.
సంవత్సరంలో రెండు వందల రోజుల పని దినాలను కల్పించి, రోజుకు ఆరు వందల రూపాయలను అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్, రాజు, ఉపాధి హామీ కూలీలైన హక్కుదారులు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకే “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం”.

అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.

సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి.

*వేములవాడ రూరల్ నేటిధాత్రి*

నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఆదేశానుసారం మంగళవారం రోజున ఉదయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డిఎస్పీ అన్నారు.
ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రచరి మట్లాడుతు… ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామలుగా చేయలనే జిల్లా ఎస్పీ ఉద్దేశ్యం తోనే ఈ యొక్క కార్యక్రమo నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు.
మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలల చే విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగిందని, యువత మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో గంజాయి కి సంబంధించిన సమాచారం ఉంటే పోలీస్ వారికి అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి పేపర్లు లేని, సరైన నంబర్ ప్లేట్స్ లేని 40 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగిందని సబంధించిన వాహన దారులకు సరైన పత్రలు చూపించి వాహనాలు తీసుకవేళ్ళవచ్చు అన్నారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు.
గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అన్నారు.
గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో,నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమాo తరుచుగా నిర్వహిస్తామని,చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ మారుతి ,పోలీస్ సిబ్బంది , డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎంపీగా సుధీర్ కుమార్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి

చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే

పరకాల నేటిధాత్రి
వరంగల్ పార్లమెంటు నుంచి బి.ఆర్.ఎస్.అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారపెల్లి సుధీర్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మంగళవారం హనుమకొండ లోని వారి నివాసంలో పరకాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంటు బి.ఆర్.ఎస్.అభ్యర్థి మారపెల్లి సుధీర్ కుమార్ గారు హాజరుకావడం జరిగింది.సమావేశంలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని కేసీఆర్‌ పాలనలో సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని నాలుగు నెలల రేవంత్‌ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు, రైతులు సాగునీరందక, కరెంట్‌ రాక చుక్కలు చూస్తున్నారు.బి.ఆర్.ఎస్.పార్టీ శ్రేణులు సమన్వయంతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలన్నారు.బి.ఆర్.ఎస్.ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ధర్మారెడ్డి అన్నారు.అనంతరం ఎంపి అభ్యర్థి సుధీర్ కుమార్ మాట్లాడుతూ ఒక్కసారి దీవించండి మీకు అండగా ఉంటామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులకు,మహిళలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియచేయాలని కాంగ్రెస్,బిజెపి రెండు పార్టీలు ఒకటే బి.ఆర్.ఎస్.పార్టీ కుటుంబసభ్యులు కలిసికట్టుగా పనిచేయాలి అని కన్నతల్లి లాంటి పార్టీని మోసంచేసినవాళ్ళకు ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్ పాలనలో నాలుగు నెలలు తిరగకుండానే ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయామని ప్రజల్లో మార్పు మొదలైందని కేసీఆర్ పదేళ్ల పాలనలో ఇలాంటి పరిస్థితుల్లో ఏనాడు లేవన్నారు.పరకాల నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ వస్తున్న నమ్మకం ఉందని అన్నారు.

భూ కబ్జా కేసులో భూపాలపల్లి కౌన్సిలర్ కొత్త హరిబాబు అరెస్ట్

భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎస్పీ కిరణ్ ఖరే

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. కబ్జాలకు దిగితే ఎవరినైనా వదిలేది లేదని, భూ కబ్జాలకు గురైన బాధితులు తమ పరిధిలోని పోలిసు స్టేషన్ లో పిర్యాదు చేయాలని ఎస్పి పేర్కొన్నారు. సామాన్యులకు, పేద ప్రజలకు న్యాయం చేయడమే తమ అభిమతమని ఎస్పి వెల్లడించారు . భూ కబ్జాకు యత్నించిన కౌన్సిలర్ కొత్త హరిబాబును మంగళవారం భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పి తెలిపారు. భూపాలపల్లి పరిధిలోని కాసింపల్లికి చెందిన ఓ వ్యక్తికి చెందిన జామాయిల్ తోటను ధ్వంసం చేసి కాపలాదారులపై దాడి చేసి అక్రమంగా జామాయిల్ తోటలో రోడ్లు వేసి పక్కా ప్రణాళికతో బాధితుడి భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తుoడగా, బాధితుడి పిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన భూపాలపల్లి పోలీసులు, మున్సిపల్ కౌన్సిలర్ కొత్త హరిబాబుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

I will remain winner in Karimnagar : says Boianapalli Vinod Kumar

https://epaper.netidhatri.com/view/238/netidhathri-e-paper-17th-april-2024%09

Special interview with Neti Dhathri Editor
Katta Raghavendra Rao

· I am the voice of Telangana people

· I paved way for the growth of Karimnagar

· BRS formed only for the cause of Telangana

· BRS only prefers advantages for Telangana

· Separate state formed only with the efforts of BRS

· KCR kept his live in stake for the sake of Telangana

· KCR transformed Telangana into rice bowl

· ‘Golden Telangana’ achieved by KCR

· Within four months Congress spoiled the state

· Congress deceived people in the name of six guarantees

· Farmers lost their glory

· Telangana is transforming in to desert

· Within ten years nothing has done by BJP for Telangana

· BJP not given a single rupee to the state

· BJP MP failed to get single paisa for Karimnagar

· I developed karimangar in all sectors

· BJP deceived the Karimnagar people for believing it.

· I brought number of issues of Karimnagar to central government.

· I fought for central funds

· Congress and BJP doesn’t have moral right to ask vote from people

· There is no recognition for them among the people

· The two parties will learn lessons from the people

· Car is in josh in the present elections

HYDERBAD,NETIDHATHRI:

Congress has an attitude of deceiving the people. Looking positive towards Telangana it neglected the separate state issue for ten years. Till winning in elections, it enchanted the Telangana ‘mantra’ and after that Congress wanted to deceive the people of this region. In that situation KCR entered and successfully filled the ‘Telangana mantra’ among people hearts. He raised the Telangana movement and made the people to move towards achieving the goal. At one stage he put his life in stake for the cause of Telangana. After achieving the state, KCR transformed the state into ‘Golden Telangana’ and rice bowl. After ten years once again Congress came into power by its mesmerising and specious reasoning. Now it has been once again trying to exhibit its original face. Still it has not relinquished its deceiving nature and once again pulling the state people into plights. The leader, who didn’t raise the word of Telangana even for single time, now became Chief Minister. It is not astonishing that Telangana Congress leaders don’t know the meaning of Telangana. They don’t know the existence and self-respect of Telangana. The only thing known to them is to kneel before the Delhi leadership. Congress leaders give preference to power and posts. They never bother about the plights of the state people. Now entire Telangana is in affliction for drinking water. On the advent of summer rural areas now began to suffer from thirst which congress leaders show indifference towards this cause. So villages are now facing serious water problem. BJP never had done anything for the sake of Telangana. What it has done only brought the religion to forefront. Nothing has been done by BJP to raise the living standards of people. This is the reason for Telangana people for not relaying on BJP. Only KCR remain in the hearts of Telaganana people. This is the reason for BRS to emerge victories in coming elections. People will teach lessons to Congress and BJP, Boinapalli Vinod kumar BRS candidate saying in confidence with Katta Raghavendra Rao, Editor of Neti Dhatri. The details of what he said in his words.
I remain the voice of Telangana people and moved along with KCR for the cause of the state. I attended the Parliament sessions for highest number of days and raise questions on issues relating to Telangana and fought for bringing the funds for development. I paved the way for the growth of Karimnagar in all fronts. BRS born only for Telangana and achieved separate state. Within ten years of period it successfully brought the fruits of development for Telangana. No other leader in the world has developed his region like KCR as first Chief Minister of Telangana State. KCR successfully filled the self respect among Telagana people who were remain treated as second level people since seven decades of united Andhra Pradesh rule. He successfully transformed Karimnagar into green carpet with fertile lands and made it as rice bowl. The Congress party which was distance away from power for ten years now came to power by giving 420 assurances. Then Telangana people got some doubt. Immediately it gave assurances in the name of six guarantees deceived the people. Within a short span of time people of Telangana now realised their mistake. KCR always said that Congress gives only starvation and power cuts. Now people are remain in grieve for not heeding the words of KCR. Congress also misleads the people with negative campaign on Kaleswaram Project which transformed Telangana into green carpet with its water. Now people are remain anger against Congress for failing to give sufficient water and current which turned the hard work of farmers in vain. It deceived the people by assuring to raise Raitu Bandhu to Rs.15000 and now it seems reluctant to implement it. Congress also deceived the people by not implementing the loan waiver up to Rs.2lakh. Now Telagana people are antagonising against Congress for its unfulfilled assurances.
Since ten years what did BJP to Telangana is nothing more than deceiving the people. It shifted ITAR to Gujarat from Telangana and hoodwinked the youth of this state. BJP also foiled the hopes of Telangana people on Kazipet coach factory. BJP always cut down the funds to Telangana and hindered the growth. If by mistake Telangana people believes the words of BJP then current meters will definitely fixed to your pump sets. Current bills will be collected from the farmers. During his tenure KCR didn’t heed to the pressures exerted by Central Government on farmers and even it stopped the funds to the state. BJP leaders are like jackals and ambush to delude the people. So BRS only the party that always ready to fight for the self respect of Telangana people. Keeping this in mind state people will definitely will teach lesson to BJP. The religion that BJP mainly rely on will become dubious to the party in the coming elections at Karimnagar. Bandi Sanjay still not learnt lesson even after facing defeat in Assembly Elections. He is still continues to raise religion as main issue. Congress has no scope at all in Karminagar. Ultimate winner will be mine. The days are nearing that people to drive away Congress and BJP.

మధు యాష్కీ ని పరామర్శించిన తీగల ప్రదీప్ గౌడ్

TPCC ప్రచార కమిటీ చైర్మన్ మాజీ M.P. మధు యాష్కీ గౌడ్ ను B.C. రక్షణ సమితి అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ హిమాయత్ నగర్ లోని తన నివాసంలో పరామర్శించారు.

సోమవారం రోజున ఉదయం మధు యాష్కీ గౌడ్ మాతృ మూర్తి అనసూయమ్మ గుండెపోటుతో మరణించారు. ఈ సందర్బంగా మధు యాష్కీ గౌడ్ని పరామర్శించిన వారిలో IJU అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్లు, తీగల సతీష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు M. శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

ఎంపీ వద్దిరాజు శ్రీరామ నవమికి పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీరామ నవమి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టు వస్త్రాలు సమర్పించారు.ఖమ్మం బైపాస్ రోడ్డు రాపర్తి నగర్ సమీపాన నెలకొన్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఎంపీ రవిచంద్ర మంగళవారం సందర్శించి తన గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేసి శ్రీరామ నవమి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీ రవిచంద్రకు అర్చకులు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

 

Exciting Launch of ‘Silk Saree ‘ Movie Starring Vasudev! The much-anticipated film Silk Saree,

directed by T Nagendar and produced by Kamalesh Kumar under the Chahat productions banner, has unveiled its first look poster and teaser. Vasudev Rao, known for his role in popular web series, takes on the lead alongside actresses Reva Chaudhary and Preeti Goswami.Renowned producer Rajakandukuri has released the captivating first look poster, praising the grandiose title and expressing high expectations for the director’s work. The teaser has received positive feedback, generating anticipation for a successful production that will resonate with audiences. Vasudev Rao commends director Nagendar for crafting a compelling narrative, while producer Kamlesh Kumar’s commitment to quality shines through in every aspect of the film. With an engaging storyline and powerful performances from a talented cast including Omkar Nath Srisailam and Kotesh Manav, Silk Saree is poised to captivate viewers with its blend of drama and intrigue. Stay tuned for this cinematic gem brought to you by Chahat Productions, music by Varikuppala Yadagiri and cinematography by Sanaka Rajasekhar  

Movie name : silk saree
Banner : Chahat productions
Cast : Vasudev rao , reeva chaudary , Preeti goswami , kotesh manav, Omkarnath
Cinematography : sanaka Rajasekhar
Music : varikuppala yadagiri
Pro : sripal cholleti
Producer : Kamlesh kumar ,Rahul Agarwal ,harish Chandak
Director : T nagendar

వాసుదేవ్ హీరో గా ‘ సిల్క్ శారీ ’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్ !

 

చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సిల్క్ శారీ . ప్రముఖ హీరో గా వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్ రావు హీరో గా రీవా చౌదరి మరియు ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా టి . నాగేందర్ స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ రాజకందుకూరి గారి చేతుల మీదుగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు.

రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ, సినిమా టైటిల్ సిల్క్ శారీ అద్భుతంగా గ్రాండియర్‌ ఉందని , డైరెక్టర్ నుండి ఆశించిన అద్భుతమైన పనితనం కనిపించింది . టీజర్ మరియు ఫస్ట్ లుక్ చాల బాగున్నాయి అని .. ప్రొడ్యూసర్ గారికి మరియు డైరెక్టర్ గారికి పేరుతో పాటు మనీ కూడా రావాలి అని ఆశిస్తున్నాను . ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఈ సిల్క్ శారీ పై నమ్మకాన్ని చేశాడు.

హీరోగా నటిస్తున్న వాసుదేవ్ రావు మాట్లాడుతూ మా డైరెక్టర్ నాగేందర్ ఒక మంచి సబ్జెక్టు తో ఈ సినిమా ని తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా మంచి చిత్రాన్ని నిర్మించారు . టైటిల్ రిలీజ్ చేసినందుకు రాజుకందుకూరి గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను .
బలమైన కథ, దానికి తగ్గట్టుగానే డ్రామా సన్నివేశాలను అద్భుతంగా రాసుకొని ఓ ఆసక్తికరమైన సంఘటన చుట్టూ “సిల్క్ శారీ ” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

నటీనటులు: వాసుదేవ్ రావు , రీవా చౌదరి , ప్రీతీ గోస్వామి , ఓంకార్ నాథ్ శ్రీశైలం , కోటేష్ మానవ తదితరులు.
డైరెక్టర్ :టి . నాగేందర్
నిర్మాతలు : కమలేష్ కుమార్ , రాహుల్ అగర్వాల్ హరీష్ చండక్
బ్యానర్: చాహత్ ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: వరికుప్పల యాదగిరి
కెమెరా : సనక రాజశేఖర్
పీఆర్ఓ: శ్రీపాల్ చొల్లేటి

Corruption network in Medical Department Episode-1

https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09

·‘She’ became corruption king in medical department

·‘She’ is expert in selling the medical jobs

·Nobody compete with her in misappropriation of funds

·She is cleaver enough in diverting the funds

·She send’s substandard medicines to hospitals

·It became usual practice abusing the employees in the name of caste.

·Only one year deputation but settled here for five years.

·She has blessings of two key personalities in previous government

·She has upper hand in misusing the medical funds.

·Corruption and cast are being turned into ornaments to her.

·Number of allegations on her in the district.

·She is doctor and her husband is contractor.

·With the help of four employees engages in funds irregularities.

·Purchased chairs and tables with the medical funds of tribal people.

HYDERBAD,NETIDHATHRI:

The wide spread deep roots of corruption network in medical department in the state became like cancer with those who have been constantly accepting the bribes at the same time subjecting to harassment those who genuinely working. Even though remain in the posts to protect the lives of the people; they continue to leave the patients to their own fate. They indulge in the misappropriation of funds released by medical department. Such disappearance of funds causing for non availability of medicines which in turn creating negative impact on the health of poor people who unable to bear the cost of medicines. The corrupted people in this department becoming rich through indulging in misappropriation of funds, by keeping the poor people distance away from government medical treatments. At the same time such the wicked employees who are in higher positions, continue to abuse their subordinates causing mental agony to them. The belittle activities of those are in higher positions, the self respect of the lower cadre employees remain stake and are unable to express their raising anger compel them to remain in silence in order to protect their job on which entire their families have depended. Especially the using of abusive language belittling their cast, make them to feel uneasiness because the position of their job that became a forge flutter which preventing them to give strong reply. When we observe the reasons behind such arrogant behaviour of employees in higher positions, two main things come in to limelight. One is the support from the ruling party leaders who are in key positions and the confidence caused by it making them to feel that nobody will do anything against them is the second one. ‘She’ who is working in Bhadrachalam is one among such arrogant employees. It is being inner talk going among the employees of health department in the district.
She is the Medical Officer in Bhadrachalam district. At present she has been continuing as in-charge officer. Some years back she came here on deputation for one year, but since then continuing here without getting any orders for going back to her original post. There are prevailing rumours that she came here by simply paying Rs.15lakh as bribe. Since joining here she continues to behave with arbitrariness neglecting her duties. For her misusing the funds is like ‘gooseberry in once hand’. This art facilitated her to continue to accumulate funds and flourishing with all round prosperity. She never hesitate to divert the funds meant for poor and posses the art of making money simply by selling the jobs. In previous occasions she collected money from three such unqualified persons and caused injustice to those who qualified. Then there were allegations that she collected Rs.3lakh each for giving appointments for those persons. In the back ground of these allegations she returned back the amount what she collected. There is information that, in the name of voluntary resignations made by those three persons, she finally removed them from their posts. There are 29 primary centres and 5 upper primary health centres are functioning in Bhadradri district. In the name of ‘face branding’ state government allocated Rs.47.45lakh for this district. Without calling any tender she entrusted this painting work to her husband who is a contractor. There are allegations that less quality paint was used for painting all primary and upper primary health centres in the district. This created furore among the people. In order to come out of this, it is learnt that she deposited this amount in the accounts of health officers and made payments through them to this contractor. Finally all the colours painted faded away within short period but funds went into the pockets of corrupted one. On another occasion Rs.83lakh were sanctioned by the government for the treatments for tribal people. Instead of spending for treatment purpose, purchased some chairs and benches and embezzled the amount. It is said that the entire treasury become empty with such activities.
It is also said that her behaviour with her subordinates also not in proper way. She always used to scold them in front of others that cause mental agony for them. Even she doesn’t hesitate to abuse them by raising cast. Especially she treats the tribal employees with veil. With the blessings of elders in previous government she came here on deputation. Really speaking deputation comes to an end within one year. Rules won’t accept to continue any employee more than one year. But with the support of those ‘elders’ still she has been able to continue here. It is said that even in the new government she has support of one or two leaders. This is the main reason for her continuation here. There are allegations that, she has made a ‘ring’ with four employees and through them she used to continue her corrupt practices. One among the employees in ‘ring’ with her blessings was being appointed under mercy appointment. There are allegations that he got appointment with wrong credentials. Those employees who are working under her also not left behind! They also are making their earnings in lakhs with corrupt practices at their level! Especially their acts are all in favour of private hospitals. They constantly have been making the tribal people to distance away from government treatment indirectly inciting them to move towards private hospitals. With this they will get two benefits. One is they can misappropriate the government allocated funds for hospitals and second one is indirectly making benefit to private hospitals. The new government shall act strictly against such employees. Unfortunately in recent period the allegations of corruption are coming against most of the women officers. There is a strong opinion that if women present in higher positions, corruption gets automatically eliminated. Unfortunately if we observe what has been occurring is totally against this perception. Such corrupt women officers are becoming a blemish making other fair women officers to feel humiliation. In our Indian system we treat woman as mother. A mother always works hard for her family. If such women gets higher positions entire eco system under them become purified, is the general opinion prevail in the society. It is unfortunate that because of corrupt practices of some women officers causing negative results. Now the people of Bhadradri district wants the government to start its cleansing steps from this region. They demand to recover entire amount that medical officer accumulated with corrupt practices by issuing orders to inquire on her activities.

error: Content is protected !!
Exit mobile version