ములుగు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా…

ములుగు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా.

#అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలి.

#ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న….

#రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి :

 

నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీనీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 99 రోజులు నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో శనివారం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేశామని, పలు అభివృద్ధి పనులకు ఇప్పటికే 15 కోట్ల రూపాయలతో టెండర్లు జరిగాయని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపాలిటీ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగకల్యాణి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆసియా షాహిన్ రియాజ్ మీర్జా, 5వ వార్డు కౌన్సిలర్ గుగ్గిళ్ళ దివ్య సుజన్, వార్డుల కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version