వనభోజనాలకు ముదిరాజ్ కులస్తులు
నర్సంపేట నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని భానోజీపేట గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు వారి ఆరాధ్య కులదైవమైన పెద్దమ్మతల్లి వనభోజనాలకు తరలివెళ్లారు.జలాభిషేకాలు నిర్వహించిన అనంతరం దూపదీప నైవేద్యాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు భీమగాని మల్లయ్య, రాజమౌళి, విట్టల రాజన్న,భూషణబోయిన రమేష్, వెంకటయ్య, రవి, పిట్టల అశోక్, బిక్షపతి, ఉప్పుల బిక్షపతితో పాటు మహిళలు పాల్గొన్నారు.