మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది…

మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది

వర్ధన్నపేట.(నేటిధాత్రి):

ప్రజలను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం:బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆబిడి రాజ్ రెడ్డి &మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దు సత్యం & వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య.
మోడీ ప్రభుత్వం జిఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణల పేరుతో తీసుకు వచ్చిన మార్పులు పేద మధ్యతరగతి వర్గానికి ఉపయోగ పడదని ఇది మోడీ ప్రభుత్వ మోసకారితనము బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆబిడి రాజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య నేడు గురువారం వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలో ఉన్న క్యాంప్ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల విధానంలో తీసుకొచ్చిన మార్పు గురించి మోడీ ప్రభుత్వం సంకలు కొట్టుకుంటున్న ధి. గత 7 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన ఈ విధానం వల్ల దేశంలోని పెట్టుబడి దారులు , సామ్రాజవాదులే లాభ పడ్డారు ,వారికి దేశా ప్రజల లక్షల కోట్ల రూపాయలు సొమ్మును,పన్నుల రూపేణా దారా దత్తం చేసింది. ఇప్పటి వరకు సామాన్య ప్రజలు కొనుగోలు చేసే నిత్యావసర సరుకుల ధరలు తగ్గలేదు .మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ పన్నుల విధానం తన ఆధీనంలో ఉంచుకొని రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా మార్చింది.
రాష్ట్రా ప్రభుత్వాలు పన్నుల వసూళ్లలో తమకు ఉండే అధికారాలు కోల్పోయాయి .మోడీ ప్రభుత్వం ఏక కేంద్ర విధానాలను అమలు చేస్తూ రాజ్యాంగం కల్పించిన సమాఖ్య స్పూర్తి నీ దెబ్బ తీస్తుంది.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పోషాల వెంకన్నగౌడ్, కొత్తపెల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్ళపెల్లి యాదగిరి గౌడ్, మండల సీనియర్ నాయకులు మరుపట్ల సాయికుమార్,ల్యాబర్తి గ్రామ పార్టీ అధ్యక్షుడు,ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా కార్యదర్శి చిధుముళ్ళ భాస్కర్ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version