నేటిధాత్రి కథనానికి స్పందన..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ అనే శీర్షిక మంగళవారం నేటిధాత్రి లో కథనం ప్రచూరించబడింది. వెంటనే పంచాయతీ పాలకవర్గం స్పందించి బుధవారం డ్రైనేజీలో ఉన్న గడ్డి మొత్తం తొలగించారు. గ్రామంలో ఉన్న ప్రతి డ్రైనేజీ ని పారిశుద్ధం పనులు పకడ్ బందీగా నిర్వహిస్తామని తెలిపారు. సమస్యను పరిష్కరించిన నేటిధాత్రి కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
