కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి
బాల్క సుమన్ పిలుపు
మంచిర్యాల,నేటి ధాత్రి:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 12న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు.జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆహ్వానం మేరకు ఖరారైన ఈ పర్యటనలో భాగంగా,కేటీఆర్ ఆదివారం ఉదయం గం 11 లకు నస్పూర్లోని తెలంగాణ భవన్లో జరిగే కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేయనున్నారు.అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన పాలక మండలి సభ్యులను సన్మానించి,మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.ఆ తర్వాత క్యాతనపల్లిలోని బాల్క సుమన్ నివాసంలో వివిధ సంఘాల నేతలతో సమావేశమై, చివరగా మీడియాతో మాట్లాడనున్నారు.ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
