మహా గర్జన సదస్సును విజయవంతం చేయాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న అట్టడుగు వర్గాలైన వికలాంగులకు అనేక రకాల పింఛన్దారులకు మేనిఫెస్టో ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రకారం వికలాంగులకు పెన్షన్ 6000 లకు ఇతర ఆసరా పెన్షన్లు 4000 రూపాయలకు తీరువ వైకల్యం వికలాంగులకు 15000 వెంటనే తీర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకొని తిరుగుతుందని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉద్దేశంతో జూలై, ఈ నెల,28 సంగారెడ్డి లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ, మందకృష్ణ మాదిగ,అధ్యర్యంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని సన్నహాక సభ లో పాల్గొని విజయవంతం చేయాలని వికలాంగుల సంఘం సీనియర్ నాయకులుహైమద్, తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయి కోటి నర్సిములు పిలుపునిచ్చారు.