దోపిడి పాలకులకు వామపక్ష ఐక్యతే ఏకైక మార్గం
ఓంకార్ పీడిత ప్రజల మహాశక్తి
ఎంసిపిఐ(యు)జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్
ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ ప్రారంభ సభలో పాల్గొన్న వామపక్ష సామాజిక రాష్ట్ర నేతలు
వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:
దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలకు మతోన్మాద దోపిడీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం వామపక్ష సామాజిక శక్తుల ఐక్య ఉద్యమాలు అని ఎంసిపిఐ యు జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ అన్నారు. కమ్యూనిస్టుల ఐక్యతకు అమరజీవి మద్ది కాయల ఓంకార్ కలలు కన్నాడని అది నిజం చేయడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అసెంబ్లీ టైగర్ ఎంసిపిఐ యు వ్యవస్థాపకులు,అమరజీవి మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ కామ్రేడ్ గోనె కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అశోక్ ఓంకార్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, ప్రజాకవి జయరాజు, సినీ డైరెక్టర్ బాబ్జి, సిపిఐ ఎంఎల్ యు డెమోక్రసీ అధికార ప్రతినిధి చలపతిరావు, బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, మురహరి తదితరులు మాట్లాడుతూ అమరజీవి ఓంకార్ త్యాగాలు ఆదర్శాలు ప్రతి కమ్యూనిస్టు ఉనికిబుచ్చుకొని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ దిశలో బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందని అందరికీ చెందాల్సిన సంపదను పెట్టుబడిదారులకు కట్ట పెడుతున్నారని ప్రజా ఉద్యమాలనుంచి వేస్తున్నారని భద్రత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మతం అంట కడుతున్నారని ప్రజలకు కనీస అవసరాలు సమకూర్చడంలో కనీస చిత్తశుద్ధి ప్రదర్శించని పాలకులు పోరాడే వారిపై మాత్రం అణిచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఓంకార్ గారి స్ఫూర్తితో ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి పోరాటాలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, పోలి బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం, వల్లె పుపేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, యువ రచయిత యోజన,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ రెడ్డి అంశారెడ్డి, మస్తుల మట్టయ్య, వరికుప్పల వెంకన్న,మంద రవి,కుంభం సుకన్య, తుకారాం నాయక్, లింగంపల్లి శ్రీనివాసరెడ్డి,వర్ణం వెంకటరెడ్డి, సోమిడి శ్రీనివాస్ లతోపాటు ఐక్య ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న బృందం ఇతర కళాకారులు ఆటపాట అలరించాయి.ముందుగా వరంగల్ వ్యాప్తంగా ఎర్రజెండాలు,ప్రభబండ్లు,కోలాటాలు,ప్రజా నాట్యమండలి డప్పు చప్పుళ్ళతో వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై
భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.మహిళల కోలాట నృత్యాలు,విప్లవ పాటలు ఎంతగానో అలరించారు.